ETV Bharat / city

ఎస్పీ బాలు మృతి కళా, సాంస్కృతిక రంగానికి తీరని లోటు: సీఎం జగన్

author img

By

Published : Sep 25, 2020, 4:39 PM IST

గానగంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణం మృతికి సీఎం జగన్ సంతాపం తెలిపారు. ఎస్పీ బాలు కుటుంబసభ్యులను ఫోన్​లో పరామర్శించిన సీఎం జగన్​... వారికి ధైర్యం చెప్పారు.

ఎస్పీ బాలు
ఎస్పీ బాలు

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎస్పీ బాలు కుటుంబసభ్యులను సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్​కు ఫోన్ చేసిన సీఎం జగన్.. వారితో మాట్లాడారు. ఎస్పీ బాలు మరణం కళా, సాంస్కృతిక రంగానికి తీరనిలోటని సీఎం అన్నారు. ధైర్యంగా ఉండాలని... కుటుంబసభ్యులందరికీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎస్పీ బాలు కుటుంబసభ్యులను సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్​కు ఫోన్ చేసిన సీఎం జగన్.. వారితో మాట్లాడారు. ఎస్పీ బాలు మరణం కళా, సాంస్కృతిక రంగానికి తీరనిలోటని సీఎం అన్నారు. ధైర్యంగా ఉండాలని... కుటుంబసభ్యులందరికీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

ఇదీ చదవండి : ఆస్పత్రి నుంచి నివాసానికి బాలు పార్థివదేహం తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.