ETV Bharat / state

వల్లభనేని వంశీ కేసు - విజయవాడలో కోర్టులో సత్యవర్ధన్‌ వాంగ్మూలం - VALLABHANENI VAMSI CASE UPDATES

విజయవాడలో కోర్టుకు హాజరైన సత్యవర్ధన్‌ - మెజిస్ట్రేట్ ఎదుట సత్యవర్ధన్‌ వాంగ్మూలం

Vallabhaneni Vamsi Case Updates
Vallabhaneni Vamsi Case Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2025, 10:51 PM IST

Vallabhaneni Vamsi Case Updates : గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ బెదిరించిన కేసులో బాధితుడు సత్యవర్ధన్ కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు విజయవాడ రెండో జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరయ్యారు. ఆయన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సుమారు గంటపాటు రికార్డ్ చేశారు. నిబంధనల ప్రకారం కోర్టు హాలు తలుపులు మూసేసి ఇతరులను లోనికి రానీయకుండా స్టేట్​మెంట్ నమోదు చేశారు. పోలీసులు సత్యవర్ధన్‌ను కోర్టు హాల్ నుంచి మీడియా కంటపడకుండా రహస్యంగా తీసుకెళ్లారు.

అసలేం జరిగిదంటే : సత్యవర్ధన్‌ గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆఫీస్‌పై దాడి జరిగింది. ఈ ఘటనపై కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, దివంగత నేత బచ్చుల అర్జునుడి కుమారుడు సుబ్రహ్మణ్యంతో కలిసి వెళ్లి సత్యవర్ధన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సత్యవర్ధన్​ ఇటీవల విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. ఆ తర్వాత తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Vallabhaneni Vamsi Case Updates : గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ బెదిరించిన కేసులో బాధితుడు సత్యవర్ధన్ కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు విజయవాడ రెండో జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరయ్యారు. ఆయన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సుమారు గంటపాటు రికార్డ్ చేశారు. నిబంధనల ప్రకారం కోర్టు హాలు తలుపులు మూసేసి ఇతరులను లోనికి రానీయకుండా స్టేట్​మెంట్ నమోదు చేశారు. పోలీసులు సత్యవర్ధన్‌ను కోర్టు హాల్ నుంచి మీడియా కంటపడకుండా రహస్యంగా తీసుకెళ్లారు.

అసలేం జరిగిదంటే : సత్యవర్ధన్‌ గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆఫీస్‌పై దాడి జరిగింది. ఈ ఘటనపై కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, దివంగత నేత బచ్చుల అర్జునుడి కుమారుడు సుబ్రహ్మణ్యంతో కలిసి వెళ్లి సత్యవర్ధన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సత్యవర్ధన్​ ఇటీవల విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. ఆ తర్వాత తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

కిడ్నాప్ చేస్తూ సీసీ కెమెరాలు మరిచారు - మరోసారి అడ్డంగా దొరికిపోయిన వంశీ గ్యాంగ్

వంశీ ఇంట్లో సోదాలు - దొరకని ఫోన్​ - వెనుదిరిగిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.