వెలగపూడిలో రైతుల రిలే నిరాహార దీక్షల్లో చిన్నారులూ భాగమవుతున్నారు. రైతులు, కూలీలు, మహిళలు ఆందోళన చేశారు. అభివృద్ధి చెందుతున్న అమరావతిని గత 7 నెలల్లో శ్మశానంగా మార్చింది పాలకులేనని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇళ్లలో పండిన కూరగాయలను దీక్షా శిబిరం వద్ద తోరణంగా కట్టి నిరసన తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
ఇవీ చదవండి