ETV Bharat / bharat

రైతులకు గుడ్​న్యూస్​ - రేపు అకౌంట్లోకి "పీఎం కిసాన్​" డబ్బులు - స్టేటస్​ ఇలా చెక్​ చేసుకోండి! - PM Kisan 18th Installment Status

పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌. అక్టోబర్​ 5న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. మరి ఆ లిస్ట్​లో మీరు ఉన్నారేమో స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి.

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

PM Kisan 18th Installment Status
PM Kisan 18th Installment Status (ETV Bharat)

PM Kisan 18th Installment Status: అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం-కిసాన్‌ పథకం 18వ విడత నిధులు విడుదల కానున్నాయి. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 9 కోట్ల మంది పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. మరి ఆ లబ్ధిదారుల్లో మీరు ఉన్నారేమో స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి.

2019లో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు "ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి" స్కీమ్​ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు పంట సాయంగా ఏడాదికి 6 వేల రూపాయలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా జమ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా కేంద్ర సర్కార్ 17 సార్లు రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేసింది. తాజాగా.. 18వ దఫా పీఎం కిసాన్ డబ్బులను "2024, అక్టోబర్ 5న మహారాష్ట్రలోని వాశిమ్​లో " ప్రధాని నరేంద్ర మోదీ రిలీజ్ చేస్తారని పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ పేర్కొంది.

స్టేటస్​ ఇలా చెక్​ చేసుకోండి:

  • ఫస్ట్‌ మీరు www.pmkisan.gov.in వెబ్​సైట్​ ఓపెన్ చేయాలి.
  • తర్వాత వెబ్​సైట్​లోని "Beneficiary List" ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను సెలెక్ట్​ చేసుకోవాలి.
  • లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చెక్​ చేసుకోవాలి.

ఈ జాబితాలో పేరు ఉంటే మీకు పీఎం కిసాన్​ డబ్బులు పడ్డట్టే. ఆ స్టేటస్​ ఇలా తెలుసుకోండి.

  • ఇన్​స్టాల్​మెంట్ స్టేటస్​ చెక్​ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్​ను ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు Know Your Status అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్​ను నమోదు చేసి, క్యాప్చా కోడ్​ను ఎంటర్‌ చేయాలి. రిజిస్ట్రేషన్​ వివరాలు లేకపోతే Know Your Registration Number పై క్లిక్​ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
  • ఇప్పుడు Get OTP ఆప్షన్​పై క్లిక్​ చేస్తే మీ మొబైల్​కు ఓటీపీ వస్తుంది. ఆ వివరాలు ఎంటర్​ చేస్తే స్క్రీన్​పై మీ బెనిషియరీ స్టేటస్​ కనిపిస్తుంది.
  • ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఈ - కేవైసీ చేయించలేదని అర్థం.

e-KYC ఎలా చేయాలంటే? :

  • ముందుగా పీఎం కిసాన్​ అధికారిక వెబ్​సైట్​ https://pmkisan.gov.in/ లోకి లాగిన్​ అవ్వాలి.
  • ఆ తర్వాత హోమ్​ పేజీలో కుడివైపున e-KYC ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత ఆధార్​ నెంబర్​ ఎంటర్​ చేసి 'Search'​ ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత వివరాలు స్క్రీన్​ మీద డిస్​ప్లే అవుతాయి. ఓటీపీ సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.
  • లేదంటే.. పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు.
  • ఇంకా.. దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కూడా బయోమెట్రిక్ సాయంతో ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

పీఎం కిసాన్ పైసలు రావాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి - మరి మీరు చేయించారా?

హెచ్చరిక : పీఎం కిసాన్ డబ్బులకు ఎసరు పెట్టారు - తొందరపడ్డారో ఖతమే!

PM Kisan 18th Installment Status: అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం-కిసాన్‌ పథకం 18వ విడత నిధులు విడుదల కానున్నాయి. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 9 కోట్ల మంది పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. మరి ఆ లబ్ధిదారుల్లో మీరు ఉన్నారేమో స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి.

2019లో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు "ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి" స్కీమ్​ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు పంట సాయంగా ఏడాదికి 6 వేల రూపాయలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా జమ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా కేంద్ర సర్కార్ 17 సార్లు రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేసింది. తాజాగా.. 18వ దఫా పీఎం కిసాన్ డబ్బులను "2024, అక్టోబర్ 5న మహారాష్ట్రలోని వాశిమ్​లో " ప్రధాని నరేంద్ర మోదీ రిలీజ్ చేస్తారని పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ పేర్కొంది.

స్టేటస్​ ఇలా చెక్​ చేసుకోండి:

  • ఫస్ట్‌ మీరు www.pmkisan.gov.in వెబ్​సైట్​ ఓపెన్ చేయాలి.
  • తర్వాత వెబ్​సైట్​లోని "Beneficiary List" ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను సెలెక్ట్​ చేసుకోవాలి.
  • లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చెక్​ చేసుకోవాలి.

ఈ జాబితాలో పేరు ఉంటే మీకు పీఎం కిసాన్​ డబ్బులు పడ్డట్టే. ఆ స్టేటస్​ ఇలా తెలుసుకోండి.

  • ఇన్​స్టాల్​మెంట్ స్టేటస్​ చెక్​ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్​ను ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు Know Your Status అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్​ను నమోదు చేసి, క్యాప్చా కోడ్​ను ఎంటర్‌ చేయాలి. రిజిస్ట్రేషన్​ వివరాలు లేకపోతే Know Your Registration Number పై క్లిక్​ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
  • ఇప్పుడు Get OTP ఆప్షన్​పై క్లిక్​ చేస్తే మీ మొబైల్​కు ఓటీపీ వస్తుంది. ఆ వివరాలు ఎంటర్​ చేస్తే స్క్రీన్​పై మీ బెనిషియరీ స్టేటస్​ కనిపిస్తుంది.
  • ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఈ - కేవైసీ చేయించలేదని అర్థం.

e-KYC ఎలా చేయాలంటే? :

  • ముందుగా పీఎం కిసాన్​ అధికారిక వెబ్​సైట్​ https://pmkisan.gov.in/ లోకి లాగిన్​ అవ్వాలి.
  • ఆ తర్వాత హోమ్​ పేజీలో కుడివైపున e-KYC ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత ఆధార్​ నెంబర్​ ఎంటర్​ చేసి 'Search'​ ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత వివరాలు స్క్రీన్​ మీద డిస్​ప్లే అవుతాయి. ఓటీపీ సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.
  • లేదంటే.. పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు.
  • ఇంకా.. దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కూడా బయోమెట్రిక్ సాయంతో ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

పీఎం కిసాన్ పైసలు రావాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి - మరి మీరు చేయించారా?

హెచ్చరిక : పీఎం కిసాన్ డబ్బులకు ఎసరు పెట్టారు - తొందరపడ్డారో ఖతమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.