ETV Bharat / bharat

సీఎం యడియూరప్ప రాజీనామా చేస్తారా?

author img

By

Published : Jul 18, 2021, 4:42 AM IST

Updated : Jul 18, 2021, 7:31 AM IST

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జాతీయ మీడియాలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప దిల్లీ పర్యటనతో ఈ వాదనలు బలపడ్డాయి. మరి సీఎం యడియూరప్ప త్వరలో రాజీనామా చేస్తారా?..

bs yediyurappa
సీఎం యడియూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప హస్తిన పర్యటనతో ఆయన రాజీనామాపై వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ అధిష్ఠాన పెద్దలతో వరుస భేటీలతో ఈ వార్తలకు ప్రాధాన్యం చేకూరింది. కర్ణాటక భాజపాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు కొద్ది నెలలుగా బహిర్గతం కావడం ఆయనకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది.

ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్య కారణాలను చూపుతూ సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రధాని మోదీ వద్ద యడియూరప్ప ప్రస్తావించినట్టు జాతీయ మీడియాలో ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, యడ్డీ రాజీనామాను ఆమోదించాలా.. వద్దా? అనే అంశంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కథనాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ సీఎంను మార్చాల్సి వస్తే మాత్రం జులై 26 కల్లా (సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతాయి) కర్ణాటకలో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఆ వార్తల్ని కొట్టిపారేసిన యడ్డీ..

మరోవైపు, తన రాజీనామాపై వస్తోన్న వార్తల్ని సీఎం యడియూరప్ప కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని స్పష్టంచేశారు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర అభివృద్ధి పనులపైనే చర్చించినట్టు తెలిపారు. ఆగస్టులో మరోసారి దిల్లీకి వస్తానన్నారు. రాజీనామాపై వచ్చే ఇలాంటి వార్తలకు విలువ ఉండదన్నారు. తన తనయుడు విజయేంద్రకు పార్టీలో మంచి స్థానం కల్పించాలన్న షరతుతో యడియూరప్ప తన పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపాదించినట్టు కూడా ఊహాగానాలు వస్తుండటం గమనార్హం. దీనికితోడు, 79 ఏళ్ల యడియూరప్ప రాజీనామా చేయాలని మరో వర్గం డిమాండ్‌ చేస్తోంది. ఆయన వయస్సు ఎక్కువగా ఉండటంతో 2023 ఎన్నికల్లో కొత్త ముఖాన్ని ప్రొజెక్ట్‌ చేస్తే మంచిదని మరికొందరు నేతలు భావిస్తున్నట్టు సమాచారం.

పార్టీ బలోపేతంపైనే చర్చించా..

తన కుమారుడు విజయేంద్రతో కలిసి ఛార్టర్డ్‌ విమానంలో దిల్లీకి వెళ్లిన యడియూరప్ప శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ తర్వాత భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోనూ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామాపై వస్తోన్న ఊహాగానాలను కొట్టిపారేశారు. పార్టీని బలోపేతం చేయడం, 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తేవడంపై నడ్డాతో చర్చించినట్టు యడియూరప్ప వెల్లడించారు.

bs yediyurapp
ప్రధాని మోదీతో యడియూరప్ప సమావేశం
bs yediyurappa
భాజపా అధ్యక్షుడు నడ్డాతో యడియూరప్ప భేటీ

యూపీలో 100శాతం అధికారంలోకి రాబోతున్నామని, కర్ణాటకలోనూ అదే తరహాలో వస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెప్పారన్నారు. కర్ణాటకలో భాజపాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, పార్టీని బలోపేతం చేసేందుకు మరింత బాగా పనిచేయాలని సూచించారని చెప్పారు. మోదీతో జరిగిన చర్చల్లో కూడా రాష్ట్రంలో పెండింగ్‌ పనులు, పార్టీ బలోపేతం అంశాలే చర్చకు వచ్చాయని పేర్కొన్నారు.

సొంత పార్టీలోనే అసమ్మతి జ్వాల

యడియూరప్పకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా సొంత పార్టీలోనే కొందరు నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. దీంతో నాయకత్వ మార్పు తప్పదంటూ పలుమార్లు వార్తలు వచ్చినా అధిష్ఠానం జోక్యంతో మళ్లీ అవి సద్దుమణిగినట్టు కనబడుతున్నాయి. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌, పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగేశ్వర్‌, ఎమ్మెల్యే ఏహెచ్‌ విశ్వనాథ్ ఇటీవల యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్రపై అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు రాజీనామాకు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి అరుణ్‌ సింగ్‌ సమావేశం నిర్వహించి నేతల మధ్య సంధి కుదర్చడం, యడియూరప్ప బాగా పనిచేస్తున్నారంటూ కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదే సమయంలో, రాష్ట్రంలో త్వరలో కేబినెట్‌ విస్తరణ కూడా చేపట్టే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల అసమ్మతి స్వరం వినిపించిన నేతలకు కేబినెట్‌ విస్తరణలో చోటు కల్పించి తద్వారా నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి 2023 ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో భాజపా ముందుకెళ్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఆ రోజు శాసనసభా పక్ష సమావేశం..

కర్ణాటక సీఎంగా తననే కొనసాగమని భాజపా అధిష్టానం కోరిందని.. ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై అసలు చర్చే జరగలేదని తేల్చి చెప్పారు. భాజపా అగ్ర నాయకత్వ సూచనలు పాటించడం తన కర్తవ్యమని తెలిపారు. ఈ సమావేశాలు ఫలప్రదంగా జరిగాయన్న యడియూరప్ప.. కావేరి జల వివాద సమస్యను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.

జులై 26న తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లు పూర్తవుతుందని.. అదే రోజు శాసనసభా పక్ష సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.


ఇదీ చదవండి : నాయకత్వ మార్పుపై యడియూరప్ప కీలక వ్యాఖ్యలు

యడియూరప్ప దిల్లీ పర్యటన.. నాయకత్వ మార్పుకు సూచన!

సీఎంకు మద్దతుగా 60మంది ఎమ్మెల్యేల సంతకాలు

కర్ణాటక ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప హస్తిన పర్యటనతో ఆయన రాజీనామాపై వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ అధిష్ఠాన పెద్దలతో వరుస భేటీలతో ఈ వార్తలకు ప్రాధాన్యం చేకూరింది. కర్ణాటక భాజపాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు కొద్ది నెలలుగా బహిర్గతం కావడం ఆయనకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది.

ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్య కారణాలను చూపుతూ సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రధాని మోదీ వద్ద యడియూరప్ప ప్రస్తావించినట్టు జాతీయ మీడియాలో ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, యడ్డీ రాజీనామాను ఆమోదించాలా.. వద్దా? అనే అంశంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కథనాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ సీఎంను మార్చాల్సి వస్తే మాత్రం జులై 26 కల్లా (సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతాయి) కర్ణాటకలో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఆ వార్తల్ని కొట్టిపారేసిన యడ్డీ..

మరోవైపు, తన రాజీనామాపై వస్తోన్న వార్తల్ని సీఎం యడియూరప్ప కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని స్పష్టంచేశారు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర అభివృద్ధి పనులపైనే చర్చించినట్టు తెలిపారు. ఆగస్టులో మరోసారి దిల్లీకి వస్తానన్నారు. రాజీనామాపై వచ్చే ఇలాంటి వార్తలకు విలువ ఉండదన్నారు. తన తనయుడు విజయేంద్రకు పార్టీలో మంచి స్థానం కల్పించాలన్న షరతుతో యడియూరప్ప తన పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపాదించినట్టు కూడా ఊహాగానాలు వస్తుండటం గమనార్హం. దీనికితోడు, 79 ఏళ్ల యడియూరప్ప రాజీనామా చేయాలని మరో వర్గం డిమాండ్‌ చేస్తోంది. ఆయన వయస్సు ఎక్కువగా ఉండటంతో 2023 ఎన్నికల్లో కొత్త ముఖాన్ని ప్రొజెక్ట్‌ చేస్తే మంచిదని మరికొందరు నేతలు భావిస్తున్నట్టు సమాచారం.

పార్టీ బలోపేతంపైనే చర్చించా..

తన కుమారుడు విజయేంద్రతో కలిసి ఛార్టర్డ్‌ విమానంలో దిల్లీకి వెళ్లిన యడియూరప్ప శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ తర్వాత భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోనూ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామాపై వస్తోన్న ఊహాగానాలను కొట్టిపారేశారు. పార్టీని బలోపేతం చేయడం, 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తేవడంపై నడ్డాతో చర్చించినట్టు యడియూరప్ప వెల్లడించారు.

bs yediyurapp
ప్రధాని మోదీతో యడియూరప్ప సమావేశం
bs yediyurappa
భాజపా అధ్యక్షుడు నడ్డాతో యడియూరప్ప భేటీ

యూపీలో 100శాతం అధికారంలోకి రాబోతున్నామని, కర్ణాటకలోనూ అదే తరహాలో వస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెప్పారన్నారు. కర్ణాటకలో భాజపాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, పార్టీని బలోపేతం చేసేందుకు మరింత బాగా పనిచేయాలని సూచించారని చెప్పారు. మోదీతో జరిగిన చర్చల్లో కూడా రాష్ట్రంలో పెండింగ్‌ పనులు, పార్టీ బలోపేతం అంశాలే చర్చకు వచ్చాయని పేర్కొన్నారు.

సొంత పార్టీలోనే అసమ్మతి జ్వాల

యడియూరప్పకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా సొంత పార్టీలోనే కొందరు నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. దీంతో నాయకత్వ మార్పు తప్పదంటూ పలుమార్లు వార్తలు వచ్చినా అధిష్ఠానం జోక్యంతో మళ్లీ అవి సద్దుమణిగినట్టు కనబడుతున్నాయి. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌, పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగేశ్వర్‌, ఎమ్మెల్యే ఏహెచ్‌ విశ్వనాథ్ ఇటీవల యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్రపై అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు రాజీనామాకు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి అరుణ్‌ సింగ్‌ సమావేశం నిర్వహించి నేతల మధ్య సంధి కుదర్చడం, యడియూరప్ప బాగా పనిచేస్తున్నారంటూ కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదే సమయంలో, రాష్ట్రంలో త్వరలో కేబినెట్‌ విస్తరణ కూడా చేపట్టే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల అసమ్మతి స్వరం వినిపించిన నేతలకు కేబినెట్‌ విస్తరణలో చోటు కల్పించి తద్వారా నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి 2023 ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో భాజపా ముందుకెళ్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఆ రోజు శాసనసభా పక్ష సమావేశం..

కర్ణాటక సీఎంగా తననే కొనసాగమని భాజపా అధిష్టానం కోరిందని.. ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై అసలు చర్చే జరగలేదని తేల్చి చెప్పారు. భాజపా అగ్ర నాయకత్వ సూచనలు పాటించడం తన కర్తవ్యమని తెలిపారు. ఈ సమావేశాలు ఫలప్రదంగా జరిగాయన్న యడియూరప్ప.. కావేరి జల వివాద సమస్యను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.

జులై 26న తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లు పూర్తవుతుందని.. అదే రోజు శాసనసభా పక్ష సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.


ఇదీ చదవండి : నాయకత్వ మార్పుపై యడియూరప్ప కీలక వ్యాఖ్యలు

యడియూరప్ప దిల్లీ పర్యటన.. నాయకత్వ మార్పుకు సూచన!

సీఎంకు మద్దతుగా 60మంది ఎమ్మెల్యేల సంతకాలు

Last Updated : Jul 18, 2021, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.