ETV Bharat / bharat

మహిళా కమిషన్​పై వ్యాజ్యాలను స్వీకరించిన సుప్రీం

author img

By

Published : Mar 25, 2021, 12:53 PM IST

సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ కోసం రూపొందించిన అర్హత ప్రమాణాల ప్రక్రియ(ఏసీఆర్)లో లోపాలు ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై పలువురు మహిళా ఎస్ఎస్​సీ అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారణకు స్వీకరించింది. ఏసీఆర్ ప్రక్రియ లింగ వివక్ష సమస్యను పరిష్కరించలేకపోయిందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

supreme court
మహిళా కమిషన్​పై ఆ వ్యాజ్యాలను స్వీకరించిన సుప్రీం

సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుపై పలువురు మహిళా ఎస్ఎస్​సీ అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. అర్హత ప్రమాణాల కోసం రూపొందించిన వార్షిక రహస్య నివేదిక(యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్-ఏసీఆర్) ప్రక్రియలో లోపాలు ఉన్నాయని పేర్కొంది. మహిళల పట్ల వివక్ష చూపించే విధంగా ఈ ప్రక్రియ ఉందని తెలిపింది. భారత సైన్యానికి మహిళా అధికారులు సంపాదించి పెట్టిన విజయాలను ఇది విస్మరిస్తోందని వ్యాఖ్యానించింది.

ఈ అంశంపై వాదనలు ఆలకించిన జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. మహిళా అధికారుల అర్హతను అంచనా వేసే ఏసీఆర్ ప్రక్రియ లింగ వివక్ష సమస్యను పరిష్కరించలేకపోయిందని పేర్కొంది. ఈ సమస్యలనే గతేడాది ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించిందని తెలిపింది.

భారత సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని ఫిబ్రవరి 17న చారిత్రక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. శారీరక పరిమితుల కారణం చూపి ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రం చేసిన వాదనలను తీవ్రంగా తప్పుబట్టింది.

ఇదీ చదవండి: సైన్యంలో శాశ్వత కమిషన్​ కోసం మళ్లీ సుప్రీంకు

సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుపై పలువురు మహిళా ఎస్ఎస్​సీ అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. అర్హత ప్రమాణాల కోసం రూపొందించిన వార్షిక రహస్య నివేదిక(యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్-ఏసీఆర్) ప్రక్రియలో లోపాలు ఉన్నాయని పేర్కొంది. మహిళల పట్ల వివక్ష చూపించే విధంగా ఈ ప్రక్రియ ఉందని తెలిపింది. భారత సైన్యానికి మహిళా అధికారులు సంపాదించి పెట్టిన విజయాలను ఇది విస్మరిస్తోందని వ్యాఖ్యానించింది.

ఈ అంశంపై వాదనలు ఆలకించిన జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. మహిళా అధికారుల అర్హతను అంచనా వేసే ఏసీఆర్ ప్రక్రియ లింగ వివక్ష సమస్యను పరిష్కరించలేకపోయిందని పేర్కొంది. ఈ సమస్యలనే గతేడాది ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించిందని తెలిపింది.

భారత సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని ఫిబ్రవరి 17న చారిత్రక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. శారీరక పరిమితుల కారణం చూపి ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రం చేసిన వాదనలను తీవ్రంగా తప్పుబట్టింది.

ఇదీ చదవండి: సైన్యంలో శాశ్వత కమిషన్​ కోసం మళ్లీ సుప్రీంకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.