ETV Bharat / bharat

ఆస్పత్రిలో చెలరేగిన మంటలు- నలుగురు చిన్నారులు మృతి

మధ్యప్రదేశ్​ భోపాల్​లోని కమలా నెహ్రూ ఆస్పత్రి మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మరణించినట్టు ఆ రాష్ట్ర మంత్రి విశ్వాస్​ సారంగ్​ తెలిపారు.

author img

By

Published : Nov 8, 2021, 10:42 PM IST

Updated : Nov 9, 2021, 8:54 AM IST

hospital fire broke out
చిన్నారుల వార్డులో చెలరేగిన మంటలు- ఇద్దరు మృతి!

భోపాల్‌లోని కమల నెహ్రూ ఆస్పత్రి పిల్లల వార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. వార్డులో 40 మంది చిన్నారులు ఉండగా అందులో 36 మంది క్షేమంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి విశ్వాస్​ సారంగ్​ తెలిపారు. మృతుల తల్లిదండ్రులకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని పేర్కొన్నారు.

చిన్నారుల వార్డులో చెలరేగిన మంటలు

12 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. ఘటనపై సమాచారం అందుకున్న రాష్ట్ర మంత్రి విశ్వాస్​ సారంగ్​.. ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

మంటలు చెలరేగిన విషయాన్ని తెలుసుకున్న చిన్నారుల బంధువులు అక్కడికి పరుగులు తీశారు. దీంతో ఆస్పత్రి లోపల, బయట ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

షార్ట్​ సర్క్యూట్​ కారణంగా మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది.

భోపాల్‌లోని కమల నెహ్రూ ఆస్పత్రి పిల్లల వార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. వార్డులో 40 మంది చిన్నారులు ఉండగా అందులో 36 మంది క్షేమంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి విశ్వాస్​ సారంగ్​ తెలిపారు. మృతుల తల్లిదండ్రులకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని పేర్కొన్నారు.

చిన్నారుల వార్డులో చెలరేగిన మంటలు

12 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. ఘటనపై సమాచారం అందుకున్న రాష్ట్ర మంత్రి విశ్వాస్​ సారంగ్​.. ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

మంటలు చెలరేగిన విషయాన్ని తెలుసుకున్న చిన్నారుల బంధువులు అక్కడికి పరుగులు తీశారు. దీంతో ఆస్పత్రి లోపల, బయట ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

షార్ట్​ సర్క్యూట్​ కారణంగా మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది.

Last Updated : Nov 9, 2021, 8:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.