ETV Bharat / bharat

రైలు పట్టాలపై 'ప్రైవేటు' కూతతో మరింత నష్టమా?

author img

By

Published : Oct 27, 2020, 8:51 AM IST

2019 అక్టోబర్‌ నాలుగో తేదీన లఖ్‌నవూ-దిల్లీ మధ్య తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కించడంతో భారతీయ రైల్వేలో తొలి ప్రైవేటు రైలు ప్రయాణం మొదలైంది. 2020 జనవరి 19న రెండో తేజస్​ పరుగులు పెట్టింది. ఇది విజయవంతం కావడంతో.. రైల్వేశాఖ జులైలో తదుపరి దశ కింద 151 ప్యాసింజర్​ రైళ్లను నడిపేందుకు ప్రైవేటు సంస్థలకు ఆహ్వానం పలికింది. 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతోనే ప్రైవేటు రైళ్లకు మొగ్గు చూపుతున్నట్లు ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, ఈ విషయంలో చాలా ప్రతికూలతలూ ఉన్నాయి.

PRIVATE TRAIN PROJECT: Center prepared for reforms
రైలు పట్టాలపై 'ప్రైవేటు' కూత!

'జాతీయ రహదారులపై ప్రైవేటు వాహనాలు, గగనమార్గంలో ప్రైవేటు విమానాలు పయనిస్తున్నప్పుడు.. మన రైలు పట్టాలపై ప్రైవేటు రైళ్లు ఎందుకు పరుగులు తీయకూడదు?'- 2012లో 'వైబ్రంట్‌ గుజరాత్‌' సదస్సులో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ లేవనెత్తిన ప్రశ్న ఇది. 2014లో మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టాక భారతీయ రైల్వే- ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించే దిశగా అడుగులు మొదలుపెట్టింది. 2019 అక్టోబర్‌ నాలుగో తేదీన లఖ్‌నవూ-దిల్లీ మధ్య తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కించడంతో ఈ రంగంలో తొలి ప్రైవేటు రైలు ప్రయాణం మొదలైంది. ఆ తరవాత 2020 జనవరి 19న అహ్మదాబాద్‌-ముంబయి మధ్య రెండో ప్రైవేటు తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ పరుగులు మొదలు పెట్టింది. తొలి రెండు ప్రైవేటు రైళ్లను నడిపేందుకూ మోదీ ప్రభుత్వం పరోక్ష మార్గాన్నే ఎంచుకుంది. రైల్వేకు చెందిన ప్రభుత్వరంగ సంస్థ ఐఆర్‌సీటీసీ ఎలాంటి బిడ్డింగ్‌ లేకుండా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రైవేటు సంస్థలు కూడా భాగస్వాములుగా ఉండగా, ఐఆర్‌సీటీసీ రైల్వేయేతర ఆపరేటర్‌గా పాల్గొంది.

కంపెనీల విశేష స్పందన

ఐఆర్‌సీటీసీ నిర్వహణలోని రెండు ప్రైవేటు రైళ్లు విజయవంతం కావడంతో, రైల్వేశాఖ జులైలో తదుపరి దశ కింద 151 ప్యాసింజర్‌ రైళ్లను నడిపేందుకు ప్రైవేటు సంస్థలకు ఆహ్వానం పలికింది. ఇందుకోసం 109 మార్గాలను గుర్తించింది. దిల్లీ, ముంబయి, సికింద్రాబాద్‌, నాగ్‌పుర్‌, చెన్నై, హౌరా, బెంగళూరు, జైపుర్‌, పట్నా సహా పన్నెండు క్లస్టర్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంగా రూపొందించారు. భారతీయ రైల్వే తమ పట్టాలతోపాటు, డ్రైవర్లు, గార్డులు వంటి సిబ్బందిని సమకూరుస్తుంది. మిగతా సిబ్బంది ప్రైవేటు కంపెనీకి చెందినవారే ఉంటారు. ప్రైవేటు కంపెనీలు రైలు బోగీలు, ఇంజిన్లను ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు. రుసుములను నిర్ణయించుకోవచ్చు. రైలును నిలపాల్సిన స్టేషన్లను ఎంచుకోవచ్చు. రైల్వేశాఖ నుంచి వచ్చిన ప్రైవేటు ప్రతిపాదనకు మంచి స్పందన వచ్చింది. దేశీయ, విదేశీ కంపెనీల నుంచి 120 బిడ్లు వచ్చాయి. స్పెయిన్‌కు చెందిన సీఏఎఫ్‌, జర్మనీ కంపెనీ సీమెన్స్‌ ఏజీ, అల్‌స్టెమ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, ఎల్‌అండ్‌టీ, అదానీ గ్రూప్‌, జీఎంఆర్‌ గ్రూప్‌, వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఐఆర్‌బీ వంటి సంస్థలతోపాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్‌, ఐఆర్‌సీటీసీల నుంచి బిడ్లు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కేటాయింపులకు 2021 ఫిబ్రవరిని గడువుగా ప్రభుత్వం నిర్ణయించింది. 2023 మార్చి నాటికి 12 రైళ్లు, 2024 మార్చి నాటికి 45 ప్రైవేటు రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఒక స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ (రెగ్యులేటర్‌)ను నియమిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఈ విషయంలో భారతీయ రైల్వేలకు ఎలాంటి పాత్ర ఉంటుందనే విషయంలో స్పష్టత కరవైంది. ప్రస్తుతం రైల్వేమంత్రిత్వశాఖ విధాన రూపకర్తగా, అన్ని రైళ్ల నియంత్రణ సంస్థగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ప్రైవేటు రైళ్లతో పోటీపడాల్సి వచ్చినప్పుడు ప్రయోజన వైరుద్ధ్యం తలెత్తకమానదు. అంటే- ఒక మార్గంలో పొగమంచు కారణంగా రెండు రైళ్లు ఆలస్యమైతే, అందులో ఒకటి ప్రైవేటు, మరొకటి రైల్వేశాఖదైతే, రెండింటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో తేల్చుకోవడం నియంత్రణ వ్యవస్థకు అంత తేలికైన వ్యవహారమేమీ కాదు. ఇలాంటి సందర్భాల్లో ప్రైవేటు సంస్థ నిర్వాహకులు తమకే ప్రాధాన్యం దక్కేలా చేసుకునే అవకాశాలూ లేకపోలేదు.

తటస్థ వైఖరి సాధ్యమేనా?

అల్పాదాయ ప్రయాణికుల కోసం ఉద్దేశించిన రైళ్లు మనుగడ సాధించాలంటే స్వతంత్రంగా వ్యవహరించే రెగ్యులేటర్‌ ఉండాల్సిందే. ప్రైవేటు రైళ్ల విషయంలోనూ తటస్థ రెగ్యులేటర్‌ అవసరం ఉంది. రైల్వేలతో కలిసి పని చేస్తున్న ప్రైవేటు రవాణా రైళ్ల ఆపరేటర్లు ఈ విషయంలో చేదు అనుభవాలు చవిచూశారు. 2006 నుంచి పరిమిత స్థాయిలో ప్రైవేటు రవాణా రైళ్లు నడిపిస్తున్న టీఎంఐఎల్‌, అర్షియా సంస్థలు రైల్వేశాఖ తమకు సమానావకాశాలు కల్పించడం లేదని ఆరోపించాయి. ‘మెట్రోమ్యాన్‌’గా పేరొందిన ఇ.శ్రీధరన్‌ సైతం ప్రైవేటు రైళ్ల విషయంలో పెదవి విరిచారు. ప్రైవేటు సంస్థలు రైల్వేశాఖతో కలిసి పనిచేయడం కష్టమని తెలుసుకుని మధ్యలోనే వెళ్లిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు పౌర విమానయానం, టెలికాం వంటి రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలూ ఎన్నో ఏళ్లుగా విజయవంతంగా పని చేస్తున్నాయి. ట్రాయ్‌ ఎన్నడూ బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ పట్ల సానుకూలంగా వ్యవహరించినట్ల ఆరోపణలు రాలేదు. ప్రభుత్వం సైతం ఎయిరిండియాకు సానుకూలత చూపడంగానీ, ప్రైవేటు కంపెనీలపై సవతి తల్లి ప్రేమ చూపినట్లుగానీ ఎవరూ ఆరోపణలు చేయలేదు. ప్రభుత్వం విమానయాన రంగం నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు స్పష్టం చేస్తూ వచ్చింది. టెలికం రంగం నుంచి దశలవారీగా ఉపసంహరించుకునేలా సంకేతాలిచ్చింది. రైల్వేల నుంచి కూడా ఇదే తరహాలో దీర్ఘకాలిక ప్రణాళికతో వైదొలగాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందా అనేది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.

పెట్టుబడులపై దృష్టి

ప్రస్తుతం రైళ్ల సామర్థ్య పరిమితుల కారణంగానే ప్రైవేటు వైపు చూస్తున్నట్లు రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ చెబుతున్నారు. 2019-20లో 7.44 కోట్ల మంది దరఖాస్తుదారులు రిజర్వుడ్‌ బెర్తులు పొందలేకపోవడం గమనార్హం. 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతోనే ప్రైవేటు రైళ్లకు మొగ్గు చూపుతున్నట్లు ప్రభుత్వం వాదిస్తోంది. ప్రైవేటీకరణ వల్ల రైళ్లలోపల మెరుగైన సేవలు అందడంతోపాటు, ప్రయాణ సమయం కూడా తగ్గుతున్నట్లు చెబుతోంది. అయితే, ఈ విషయంలో కొన్ని ప్రతికూలతలూ లేకపోలేదు. ప్రైవేటు సంస్థలు పూర్తిగా లాభాల పైనే దృష్టి పెడతాయన్న సంగతిని విస్మరించలేం. తదుపరి దశల్లో ఇవి- అల్పాదాయ ప్రయాణికుల కోసం ఉద్దేశించిన బోగీలను ఎత్తివేసే ప్రమాదం లేకపోలేదు. కేవలం అల్పాదాయ ప్రయాణికులతో రైల్వేశాఖ నష్టాల్ని మూటగట్టుకొనే ముప్పు మరింత పెరుగుతుంది. తదుపరి దశలో ఛార్జీలను భారీగా పెంచివేసే ప్రమాదం తలెత్తుతుంది. భారత్‌ వంటి సంక్షేమ దేశంలో సమాజంలోని బలహీన వర్గాలందరికీ రైలు ప్రయాణాన్ని అందుబాటులో ఉంచాలన్న ప్రాథమిక లక్ష్యం నీరుగారుతుంది.

- రాజీవ్‌ రాజన్

'జాతీయ రహదారులపై ప్రైవేటు వాహనాలు, గగనమార్గంలో ప్రైవేటు విమానాలు పయనిస్తున్నప్పుడు.. మన రైలు పట్టాలపై ప్రైవేటు రైళ్లు ఎందుకు పరుగులు తీయకూడదు?'- 2012లో 'వైబ్రంట్‌ గుజరాత్‌' సదస్సులో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ లేవనెత్తిన ప్రశ్న ఇది. 2014లో మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టాక భారతీయ రైల్వే- ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించే దిశగా అడుగులు మొదలుపెట్టింది. 2019 అక్టోబర్‌ నాలుగో తేదీన లఖ్‌నవూ-దిల్లీ మధ్య తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కించడంతో ఈ రంగంలో తొలి ప్రైవేటు రైలు ప్రయాణం మొదలైంది. ఆ తరవాత 2020 జనవరి 19న అహ్మదాబాద్‌-ముంబయి మధ్య రెండో ప్రైవేటు తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ పరుగులు మొదలు పెట్టింది. తొలి రెండు ప్రైవేటు రైళ్లను నడిపేందుకూ మోదీ ప్రభుత్వం పరోక్ష మార్గాన్నే ఎంచుకుంది. రైల్వేకు చెందిన ప్రభుత్వరంగ సంస్థ ఐఆర్‌సీటీసీ ఎలాంటి బిడ్డింగ్‌ లేకుండా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రైవేటు సంస్థలు కూడా భాగస్వాములుగా ఉండగా, ఐఆర్‌సీటీసీ రైల్వేయేతర ఆపరేటర్‌గా పాల్గొంది.

కంపెనీల విశేష స్పందన

ఐఆర్‌సీటీసీ నిర్వహణలోని రెండు ప్రైవేటు రైళ్లు విజయవంతం కావడంతో, రైల్వేశాఖ జులైలో తదుపరి దశ కింద 151 ప్యాసింజర్‌ రైళ్లను నడిపేందుకు ప్రైవేటు సంస్థలకు ఆహ్వానం పలికింది. ఇందుకోసం 109 మార్గాలను గుర్తించింది. దిల్లీ, ముంబయి, సికింద్రాబాద్‌, నాగ్‌పుర్‌, చెన్నై, హౌరా, బెంగళూరు, జైపుర్‌, పట్నా సహా పన్నెండు క్లస్టర్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంగా రూపొందించారు. భారతీయ రైల్వే తమ పట్టాలతోపాటు, డ్రైవర్లు, గార్డులు వంటి సిబ్బందిని సమకూరుస్తుంది. మిగతా సిబ్బంది ప్రైవేటు కంపెనీకి చెందినవారే ఉంటారు. ప్రైవేటు కంపెనీలు రైలు బోగీలు, ఇంజిన్లను ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు. రుసుములను నిర్ణయించుకోవచ్చు. రైలును నిలపాల్సిన స్టేషన్లను ఎంచుకోవచ్చు. రైల్వేశాఖ నుంచి వచ్చిన ప్రైవేటు ప్రతిపాదనకు మంచి స్పందన వచ్చింది. దేశీయ, విదేశీ కంపెనీల నుంచి 120 బిడ్లు వచ్చాయి. స్పెయిన్‌కు చెందిన సీఏఎఫ్‌, జర్మనీ కంపెనీ సీమెన్స్‌ ఏజీ, అల్‌స్టెమ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, ఎల్‌అండ్‌టీ, అదానీ గ్రూప్‌, జీఎంఆర్‌ గ్రూప్‌, వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఐఆర్‌బీ వంటి సంస్థలతోపాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్‌, ఐఆర్‌సీటీసీల నుంచి బిడ్లు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కేటాయింపులకు 2021 ఫిబ్రవరిని గడువుగా ప్రభుత్వం నిర్ణయించింది. 2023 మార్చి నాటికి 12 రైళ్లు, 2024 మార్చి నాటికి 45 ప్రైవేటు రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఒక స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ (రెగ్యులేటర్‌)ను నియమిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఈ విషయంలో భారతీయ రైల్వేలకు ఎలాంటి పాత్ర ఉంటుందనే విషయంలో స్పష్టత కరవైంది. ప్రస్తుతం రైల్వేమంత్రిత్వశాఖ విధాన రూపకర్తగా, అన్ని రైళ్ల నియంత్రణ సంస్థగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ప్రైవేటు రైళ్లతో పోటీపడాల్సి వచ్చినప్పుడు ప్రయోజన వైరుద్ధ్యం తలెత్తకమానదు. అంటే- ఒక మార్గంలో పొగమంచు కారణంగా రెండు రైళ్లు ఆలస్యమైతే, అందులో ఒకటి ప్రైవేటు, మరొకటి రైల్వేశాఖదైతే, రెండింటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో తేల్చుకోవడం నియంత్రణ వ్యవస్థకు అంత తేలికైన వ్యవహారమేమీ కాదు. ఇలాంటి సందర్భాల్లో ప్రైవేటు సంస్థ నిర్వాహకులు తమకే ప్రాధాన్యం దక్కేలా చేసుకునే అవకాశాలూ లేకపోలేదు.

తటస్థ వైఖరి సాధ్యమేనా?

అల్పాదాయ ప్రయాణికుల కోసం ఉద్దేశించిన రైళ్లు మనుగడ సాధించాలంటే స్వతంత్రంగా వ్యవహరించే రెగ్యులేటర్‌ ఉండాల్సిందే. ప్రైవేటు రైళ్ల విషయంలోనూ తటస్థ రెగ్యులేటర్‌ అవసరం ఉంది. రైల్వేలతో కలిసి పని చేస్తున్న ప్రైవేటు రవాణా రైళ్ల ఆపరేటర్లు ఈ విషయంలో చేదు అనుభవాలు చవిచూశారు. 2006 నుంచి పరిమిత స్థాయిలో ప్రైవేటు రవాణా రైళ్లు నడిపిస్తున్న టీఎంఐఎల్‌, అర్షియా సంస్థలు రైల్వేశాఖ తమకు సమానావకాశాలు కల్పించడం లేదని ఆరోపించాయి. ‘మెట్రోమ్యాన్‌’గా పేరొందిన ఇ.శ్రీధరన్‌ సైతం ప్రైవేటు రైళ్ల విషయంలో పెదవి విరిచారు. ప్రైవేటు సంస్థలు రైల్వేశాఖతో కలిసి పనిచేయడం కష్టమని తెలుసుకుని మధ్యలోనే వెళ్లిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు పౌర విమానయానం, టెలికాం వంటి రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలూ ఎన్నో ఏళ్లుగా విజయవంతంగా పని చేస్తున్నాయి. ట్రాయ్‌ ఎన్నడూ బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ పట్ల సానుకూలంగా వ్యవహరించినట్ల ఆరోపణలు రాలేదు. ప్రభుత్వం సైతం ఎయిరిండియాకు సానుకూలత చూపడంగానీ, ప్రైవేటు కంపెనీలపై సవతి తల్లి ప్రేమ చూపినట్లుగానీ ఎవరూ ఆరోపణలు చేయలేదు. ప్రభుత్వం విమానయాన రంగం నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు స్పష్టం చేస్తూ వచ్చింది. టెలికం రంగం నుంచి దశలవారీగా ఉపసంహరించుకునేలా సంకేతాలిచ్చింది. రైల్వేల నుంచి కూడా ఇదే తరహాలో దీర్ఘకాలిక ప్రణాళికతో వైదొలగాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందా అనేది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.

పెట్టుబడులపై దృష్టి

ప్రస్తుతం రైళ్ల సామర్థ్య పరిమితుల కారణంగానే ప్రైవేటు వైపు చూస్తున్నట్లు రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ చెబుతున్నారు. 2019-20లో 7.44 కోట్ల మంది దరఖాస్తుదారులు రిజర్వుడ్‌ బెర్తులు పొందలేకపోవడం గమనార్హం. 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతోనే ప్రైవేటు రైళ్లకు మొగ్గు చూపుతున్నట్లు ప్రభుత్వం వాదిస్తోంది. ప్రైవేటీకరణ వల్ల రైళ్లలోపల మెరుగైన సేవలు అందడంతోపాటు, ప్రయాణ సమయం కూడా తగ్గుతున్నట్లు చెబుతోంది. అయితే, ఈ విషయంలో కొన్ని ప్రతికూలతలూ లేకపోలేదు. ప్రైవేటు సంస్థలు పూర్తిగా లాభాల పైనే దృష్టి పెడతాయన్న సంగతిని విస్మరించలేం. తదుపరి దశల్లో ఇవి- అల్పాదాయ ప్రయాణికుల కోసం ఉద్దేశించిన బోగీలను ఎత్తివేసే ప్రమాదం లేకపోలేదు. కేవలం అల్పాదాయ ప్రయాణికులతో రైల్వేశాఖ నష్టాల్ని మూటగట్టుకొనే ముప్పు మరింత పెరుగుతుంది. తదుపరి దశలో ఛార్జీలను భారీగా పెంచివేసే ప్రమాదం తలెత్తుతుంది. భారత్‌ వంటి సంక్షేమ దేశంలో సమాజంలోని బలహీన వర్గాలందరికీ రైలు ప్రయాణాన్ని అందుబాటులో ఉంచాలన్న ప్రాథమిక లక్ష్యం నీరుగారుతుంది.

- రాజీవ్‌ రాజన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.