దేశంలో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. కొత్తగా 86 వేల 821 కేసులు, 11 వందల 81 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అలాగే 24 గంటల్లో మరో 85 వేల 376 మంది వైరస్ ను జయించినట్లు పేర్కొంది.

బుధవారం ఒక్కరోజే 14 లక్షల 23 వేల 52 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటివరకు 7 కోట్ల 56 లక్షల 19 వేల మందికి పరీక్షించినట్లు పేర్కొంది.