ETV Bharat / bharat

కరోనాకు 24 గంటల్లో 71 మంది బలి - Covid-19 pandemic in india

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 1813 మందికి కరోనా వైరస్ సోకింది. 71మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో 9318మందికి వైరస్ సోకింది. 400మంది ప్రాణాలు కోల్పోయారు.

india death toll
భారత్​లో కరోనా విజృంభణ
author img

By

Published : Apr 29, 2020, 6:43 PM IST

Updated : Apr 29, 2020, 7:21 PM IST

భారత్​లో కరోనా విస్తరిస్తోంది. 24 గంటల వ్యవధిలో 1,813 మందికి వైరస్ సోకింది. కొత్తగా 71మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, గుజరాత్​, దిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​లో వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది.

bharat
భారత్​లో కరోనా గణాంకాలు

ముంబయిలో ఆరువేల మందికి పైగా..

వైరస్​తో తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్రలో ఇప్పటివరకు 9318మంది మహమ్మారి బారినపడ్డారు. అక్కడ 400మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబయి మహానగరంలోనే కొత్తగా 393 కేసులు నమోదయ్యాయి. నగరంలో కేసుల సంఖ్య 6169కి చేరింది. ఠాణే ప్రాంతంలో 7223 మంది వైరస్ బారినపడ్డారు. పుణెలో 89మంది వైరస్​తో మృతి చెందారు. 1288 మందికి వైరస్ పాజిటివ్​గా తేలింది.

ఇద్దరు ఖైదీలకు కరోనా

గుజరాత్ అహ్మదాబాద్​లోని సబర్మతి కేంద్ర కారాగారంలో ఇద్దరు ఖైదీలకు కరోనా సోకింది. వారిద్దరూ ఇటీవలే జైలుకు వచ్చారు. ముందు జాగ్రత్తగా వారిని జైలు ప్రధాన ప్రాంగణానికి కాస్త దూరంగా ఉండే ఐసోలేషన్​ వార్డులో ఉంచడం వల్ల ఇతరులకు సోకే ప్రమాదం తప్పింది. పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలిన అనంతరం ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.

పంజాబ్​లో సడలింపులు

పంజాబ్​లో ఉదయం నాలుగు గంటల పాటు కర్ఫ్యూ సడలించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

ఒడిశాలో 122మందికి..

ఒడిశాలో 122మందికి వైరస్ పాజిటివ్​గా తేలింది. కరోనా బాధితుల సంఖ్య భువనేశ్వర్​లో 47గా ఉంది. రాష్ట్రంలో మొత్తంగా 29,108మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

ఉత్తర్​ప్రదేశ్​లో..

ఉత్తర్​ప్రదేశ్​లో నలుగురు పోలీసు సిబ్బంది వైరస్ బారినపడ్డారు. వారంతా లాక్​డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన ఓ యువకుడిని పోలీస్​ స్టేషన్​కు తీసుకొచ్చినవారే.

కేరళలో జర్నలిస్టుకు..

కేరళలో ఓ జర్నలిస్టు, ముగ్గురు ఆరోగ్య సిబ్బంది సహా కొత్తగా 10మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 486కు చేరింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: త్వరలో సీబీఎస్​ఈ 10, 12వ తరగతి పరీక్షలు!

భారత్​లో కరోనా విస్తరిస్తోంది. 24 గంటల వ్యవధిలో 1,813 మందికి వైరస్ సోకింది. కొత్తగా 71మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, గుజరాత్​, దిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​లో వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది.

bharat
భారత్​లో కరోనా గణాంకాలు

ముంబయిలో ఆరువేల మందికి పైగా..

వైరస్​తో తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్రలో ఇప్పటివరకు 9318మంది మహమ్మారి బారినపడ్డారు. అక్కడ 400మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబయి మహానగరంలోనే కొత్తగా 393 కేసులు నమోదయ్యాయి. నగరంలో కేసుల సంఖ్య 6169కి చేరింది. ఠాణే ప్రాంతంలో 7223 మంది వైరస్ బారినపడ్డారు. పుణెలో 89మంది వైరస్​తో మృతి చెందారు. 1288 మందికి వైరస్ పాజిటివ్​గా తేలింది.

ఇద్దరు ఖైదీలకు కరోనా

గుజరాత్ అహ్మదాబాద్​లోని సబర్మతి కేంద్ర కారాగారంలో ఇద్దరు ఖైదీలకు కరోనా సోకింది. వారిద్దరూ ఇటీవలే జైలుకు వచ్చారు. ముందు జాగ్రత్తగా వారిని జైలు ప్రధాన ప్రాంగణానికి కాస్త దూరంగా ఉండే ఐసోలేషన్​ వార్డులో ఉంచడం వల్ల ఇతరులకు సోకే ప్రమాదం తప్పింది. పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలిన అనంతరం ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.

పంజాబ్​లో సడలింపులు

పంజాబ్​లో ఉదయం నాలుగు గంటల పాటు కర్ఫ్యూ సడలించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

ఒడిశాలో 122మందికి..

ఒడిశాలో 122మందికి వైరస్ పాజిటివ్​గా తేలింది. కరోనా బాధితుల సంఖ్య భువనేశ్వర్​లో 47గా ఉంది. రాష్ట్రంలో మొత్తంగా 29,108మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

ఉత్తర్​ప్రదేశ్​లో..

ఉత్తర్​ప్రదేశ్​లో నలుగురు పోలీసు సిబ్బంది వైరస్ బారినపడ్డారు. వారంతా లాక్​డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన ఓ యువకుడిని పోలీస్​ స్టేషన్​కు తీసుకొచ్చినవారే.

కేరళలో జర్నలిస్టుకు..

కేరళలో ఓ జర్నలిస్టు, ముగ్గురు ఆరోగ్య సిబ్బంది సహా కొత్తగా 10మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 486కు చేరింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: త్వరలో సీబీఎస్​ఈ 10, 12వ తరగతి పరీక్షలు!

Last Updated : Apr 29, 2020, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.