ETV Bharat / bharat

ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో భారత్​వి ఇవే..

author img

By

Published : Feb 19, 2020, 3:23 PM IST

Updated : Mar 1, 2020, 8:32 PM IST

ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో ఈసారి భారత్ నుంచి రికార్డుస్థాయిలో వర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని యూనివర్సిటీలపై యూకేకు చెందిన టైమ్స్​ హైయర్​ ఎడ్యుకేషన్ అనే మ్యాగజైన్​ సర్వే చేయగా.. టాప్​-100లో భారత్​కు చెందిన 11 విశ్వవిద్యాలయాలు చోటు సంపాదించాయి.

11 Indian universities in top 100 for emerging economies
టాప్​-100లో 11 భారతీయ విశ్వవిద్యాలయాలు

యూకేకు చెందిన టైమ్స్​ హైయర్​ ఎడ్యుకేషన్(టీహెచ్ఈ) అనే ​మ్యాగజైన్ 2020 సంవత్సరానికి గాను ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్​​ వర్సిటీలు రికార్డు స్థాయిలో ర్యాంకులను దక్కించుకున్నాయి.

ఎమర్జింగ్​ ఎకానమీస్​ యూనివర్శిటీ ర్యాంకింగ్స్​-2020లో టాప్​-100లో భారత్​ నుంచి 11 విశ్వవిద్యాలయాలు నిచిచాయి. ఇందులో 'ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​(ఐఐఎస్​సీ​)' భారత్​ తరఫున అత్యుత్తమంగా 16వ స్థానాన్ని దక్కించుకుంది. అమృత విశ్వ విద్యాపీఠం తొలిసారిగా టాప్​-100లో చోటుదక్కించుకుంది. 2019లో 141వ స్థానంలో ఉన్న ఈ వర్సిటీ .. తాజాగా 51స్థానాలు మెరుగుపడింది. ఐఐటీ-ఖరగ్​పూర్​ 23 స్థానాలు వృద్ధి చెంది 32వ స్థానంలో నిలవగా.. ఐఐటీ-దిల్లీ 28 స్థానాలు ఎగబాకి 38వ ర్యాంక్​ను​ దక్కించుకుంది. ఐఐటీ-మద్రాస్​ 12 స్థానాలు మెరుగుపడి 63వ స్థానంలో నిలిచింది. ఐఐటీ-రోపర్​, ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ కెమికల్​ టెక్నాలజీ వర్సిటీలు తొలిసారిగా టాప్​-100లో చోటు దక్కించుకున్నాయి.

మొత్తం 47 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో చైనా అధికంగా 30 ర్యాంకులను కైవసం చేసుకుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని యూనివర్సిటీల స్థితిగతులపై టీహెచ్​ఈ ఏటా సర్వే చేసి వాటికి ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ జాబితాలో మొత్తం ప్రపంచంలోని 533 విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్స్​ ఇవ్వగా.. భారత్​లోని 56 యూనివర్శిటీలకు స్థానం దక్కింది.

ర్యాంకులు ఇలా ఇస్తారు..

విదేశీ విద్యార్థులు, ఉద్యోగుల పెరుగుదల, ఆన్​లైన్​ కోర్సులను అందించడం, ఇతర విశ్వవిద్యాలయాలకు విద్యా సహకారాన్నందించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులను నిర్ణయిస్తారు.

'ప్రపంచ ర్యాంకింగ్స్​లో భారతీయ విశ్వవిద్యాలయాలు సాధించిన విజయాలపై చాలాకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఎమర్జింగ్​ ఎకానమీస్​ యూనివర్శిటీ ర్యాంకింగ్స్-2020లో పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రకారం.. అనేక సంస్థలు వాస్తవమైన అభివృద్ధిని సాధించాయి. ఇది ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఎమినెన్స్​ పథకం ద్వారా మాత్రమే సాధ్యమైంది.'

- ఫిల్​ బాటీ, టైమ్స్​ హైయర్​ ఎడ్యుకేషన్​ ప్రతినిధి

లాభాలేంటి.?

ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఎమినెన్స్​ పథకంలో పాల్గొనే విశ్వవిద్యాలయాలకు టైమ్స్​ హైయర్​ ఎడ్యుకేషన్​ ఇచ్చే ర్యాంకింగ్స్​ను బట్టి యూజీసీ నుంచి నిధులు సమకూరుతాయి. అధిక స్వయం ప్రతిపత్తి కూడా లభిస్తుంది.

2014లో ర్యాంకింగ్స్​ ప్రారంభం కాగా.. 11 భారతీయ సంస్థలకు టాప్​-100లో చోటుదక్కడం ఇది రెండోసారి. అయితే... ప్రపంచవ్యాప్తంగా ఈసారి చాలా తక్కువ విశ్వవిద్యాలయాలు ఇందులో పాల్గొన్నాయి.

ఇదీ చదవండి: పురుషాధిక్యతకు చెక్​.. సైన్యంలో సమన్యాయం

యూకేకు చెందిన టైమ్స్​ హైయర్​ ఎడ్యుకేషన్(టీహెచ్ఈ) అనే ​మ్యాగజైన్ 2020 సంవత్సరానికి గాను ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్​​ వర్సిటీలు రికార్డు స్థాయిలో ర్యాంకులను దక్కించుకున్నాయి.

ఎమర్జింగ్​ ఎకానమీస్​ యూనివర్శిటీ ర్యాంకింగ్స్​-2020లో టాప్​-100లో భారత్​ నుంచి 11 విశ్వవిద్యాలయాలు నిచిచాయి. ఇందులో 'ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​(ఐఐఎస్​సీ​)' భారత్​ తరఫున అత్యుత్తమంగా 16వ స్థానాన్ని దక్కించుకుంది. అమృత విశ్వ విద్యాపీఠం తొలిసారిగా టాప్​-100లో చోటుదక్కించుకుంది. 2019లో 141వ స్థానంలో ఉన్న ఈ వర్సిటీ .. తాజాగా 51స్థానాలు మెరుగుపడింది. ఐఐటీ-ఖరగ్​పూర్​ 23 స్థానాలు వృద్ధి చెంది 32వ స్థానంలో నిలవగా.. ఐఐటీ-దిల్లీ 28 స్థానాలు ఎగబాకి 38వ ర్యాంక్​ను​ దక్కించుకుంది. ఐఐటీ-మద్రాస్​ 12 స్థానాలు మెరుగుపడి 63వ స్థానంలో నిలిచింది. ఐఐటీ-రోపర్​, ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ కెమికల్​ టెక్నాలజీ వర్సిటీలు తొలిసారిగా టాప్​-100లో చోటు దక్కించుకున్నాయి.

మొత్తం 47 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో చైనా అధికంగా 30 ర్యాంకులను కైవసం చేసుకుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని యూనివర్సిటీల స్థితిగతులపై టీహెచ్​ఈ ఏటా సర్వే చేసి వాటికి ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ జాబితాలో మొత్తం ప్రపంచంలోని 533 విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్స్​ ఇవ్వగా.. భారత్​లోని 56 యూనివర్శిటీలకు స్థానం దక్కింది.

ర్యాంకులు ఇలా ఇస్తారు..

విదేశీ విద్యార్థులు, ఉద్యోగుల పెరుగుదల, ఆన్​లైన్​ కోర్సులను అందించడం, ఇతర విశ్వవిద్యాలయాలకు విద్యా సహకారాన్నందించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులను నిర్ణయిస్తారు.

'ప్రపంచ ర్యాంకింగ్స్​లో భారతీయ విశ్వవిద్యాలయాలు సాధించిన విజయాలపై చాలాకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఎమర్జింగ్​ ఎకానమీస్​ యూనివర్శిటీ ర్యాంకింగ్స్-2020లో పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రకారం.. అనేక సంస్థలు వాస్తవమైన అభివృద్ధిని సాధించాయి. ఇది ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఎమినెన్స్​ పథకం ద్వారా మాత్రమే సాధ్యమైంది.'

- ఫిల్​ బాటీ, టైమ్స్​ హైయర్​ ఎడ్యుకేషన్​ ప్రతినిధి

లాభాలేంటి.?

ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఎమినెన్స్​ పథకంలో పాల్గొనే విశ్వవిద్యాలయాలకు టైమ్స్​ హైయర్​ ఎడ్యుకేషన్​ ఇచ్చే ర్యాంకింగ్స్​ను బట్టి యూజీసీ నుంచి నిధులు సమకూరుతాయి. అధిక స్వయం ప్రతిపత్తి కూడా లభిస్తుంది.

2014లో ర్యాంకింగ్స్​ ప్రారంభం కాగా.. 11 భారతీయ సంస్థలకు టాప్​-100లో చోటుదక్కడం ఇది రెండోసారి. అయితే... ప్రపంచవ్యాప్తంగా ఈసారి చాలా తక్కువ విశ్వవిద్యాలయాలు ఇందులో పాల్గొన్నాయి.

ఇదీ చదవండి: పురుషాధిక్యతకు చెక్​.. సైన్యంలో సమన్యాయం

Last Updated : Mar 1, 2020, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.