ETV Bharat / snippets

గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు- 36మంది పౌరులు మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 6:33 AM IST

Israel Attack On Gaza
Israel Attack On Gaza (Associated Press)

Israel Attack On Gaza : ఇజ్రాయెల్‌ వరుస దాడులు వల్ల పాలస్తీనా పౌరులు ప్రాణాలను కోల్పోతున్నారు. శనివారం గాజాలో ఇజ్రాయెల్‌ జరిపిన రెండు వేర్వేరు వైమానిక దాడుల్లో 36 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజా సిటీలోని పురాతనమైన ఆల్‌-షాతి శిబిరంపై జరిపిన దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారు ఆల్‌ తుఫా జిల్లాలో మరణించారు. ఆల్‌షాతిపై ఇజ్రాయెల్‌ దళాలు దాడి జరపడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఈ శిబిరంపై అనేక సార్లు దాడులు జరిపారు. ఆ ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. గాయపడిన వారిని తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. శిథిలాల కింద మృతుల కోసం సహాయక బృందాలు వెతుకుతున్నాయి. ఇజ్రాయెల్‌ సైన్యం మాత్రం తాము హమాస్‌ సైనిక నిర్మాణాలపై దాడులు చేశామని తెలిపింది.

Israel Attack On Gaza : ఇజ్రాయెల్‌ వరుస దాడులు వల్ల పాలస్తీనా పౌరులు ప్రాణాలను కోల్పోతున్నారు. శనివారం గాజాలో ఇజ్రాయెల్‌ జరిపిన రెండు వేర్వేరు వైమానిక దాడుల్లో 36 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజా సిటీలోని పురాతనమైన ఆల్‌-షాతి శిబిరంపై జరిపిన దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారు ఆల్‌ తుఫా జిల్లాలో మరణించారు. ఆల్‌షాతిపై ఇజ్రాయెల్‌ దళాలు దాడి జరపడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఈ శిబిరంపై అనేక సార్లు దాడులు జరిపారు. ఆ ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. గాయపడిన వారిని తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. శిథిలాల కింద మృతుల కోసం సహాయక బృందాలు వెతుకుతున్నాయి. ఇజ్రాయెల్‌ సైన్యం మాత్రం తాము హమాస్‌ సైనిక నిర్మాణాలపై దాడులు చేశామని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.