thumbnail

LIVE : మంగళగిరిలో వైఎస్సార్​ జయంతి వేడుకలు - ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్​ రెడ్డి - Revanth LIVE From AP

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 6:14 PM IST

Updated : Jul 8, 2024, 8:06 PM IST

Revanth Reddy at YSR Birth Anniversary Celebrations 2024 : ఏపీలోని మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్​లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వై.ఎస్‌.రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఏపీసీసీ ఆధ్వర్యంలో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి, మంత్రులను ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల హైదరాబాద్​లో కలిసిన విషయం తెలిసిందే. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆమె వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహిస్తోంది. ఈ సభకు జాతీయ నేతలతో పాటుగా తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. మాణికం ఠాగూర్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ప్రస్తుతం మంగళగిరిలో రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం.  
Last Updated : Jul 8, 2024, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.