thumbnail

LIVE : విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా - తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ - Telugu States CMs Meeting LIVE

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 5:46 PM IST

Updated : Jul 6, 2024, 6:25 PM IST

Telugu States CMs Meeting Points LIVE : తెలంగాణ ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ ప్రారంభమైంది. విభజన సమస్యల పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరగా, అందుకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సానుకూలంగా స్పందించి అంగీకరించారు. ఉమ్మడి ఏపీ పునర్​ వ్యవస్థీకరణ జరిగి దశాబ్దకాలం గడవడంతో, హైదరాబాద్​లోని ఆస్తులు, ఇతర పెండింగ్ అంశాలపై లోక్​సభ ఎన్నికల ముందే చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, గతంలోనే కేబినెట్ సమావేశం ఎజెండాలో పొందుపరిచింది. అయితే లోక్​సభ ఎన్నికల పోలింగ్ వరకు ఆ అంశాలపై చర్చించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో అప్పుడు పక్కన పెట్టింది. ఎట్టకేలకు ప్రజా భవన్​లో నేటి సమావేశానికి ఏర్పాట్లతో చర్చించాల్సిన అంశాలతో ఎజెండా సిద్ధం చేసింది. విభజన అంశాలపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే తొలిసారి. విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థలు, ఆస్తులపై ముఖ్యంగా చర్చ జరగనుంది.  
Last Updated : Jul 6, 2024, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.