'ఆ తెలుగు ఉపాధ్యాయుడు మాకొద్దు' - కలెక్టర్‌కు విద్యార్థుల ఫిర్యాదు - Students Complaint Against Teacher

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 6:40 PM IST

thumbnail
'ఆ తెలుగు ఉపాధ్యాయుడు మాకొద్దు' - కలెక్టర్‌కు విద్యార్థుల ఫిర్యాదు (ETV Bharat)

Students Complained to Collector Against the Teacher : తెలుగు ఉపాధ్యాయుడు పాఠాలు సరిగ్గా చెప్పడం లేదని గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు జడ్పీ పాఠశాల విద్యార్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తెలుగు ఉపాధ్యాయుడిని మార్చాలంటూ తొమ్మిది తరగతి విద్యార్థినులు కలెక్టర్​కు వినతిపత్రం ఇచ్చారు. తెలుగు ఉపాధ్యాయుడైన నాగేశ్వరరావు గతేడాది నుంచి జడ్పీ పాఠశాలలో పని చేస్తున్నారని పాఠాలు సరిగ్గా చెప్పడం లేదని ప్రధానోపాధ్యాయురాలు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు విద్యార్థులు తెలిపారు. 

తెలుగు ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోకపోగా ప్రధానోపాధ్యాయురాలు తమనే తప్పు బట్టి తిట్టారని విద్యార్థులు వాపోయారు. వచ్చే సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకావాల్సిన తమ పిల్లలకు సరైన బోధన చేయకపోతే నష్టపోయే ప్రమాదముందని ప్రధానోపాధ్యాయురాలు దృష్టికి తీసుకెళ్లితే తమను దుర్భాషలాడారని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. అక్షరాలు, గుణింతాలు కూడా సరిగ్గా బోధించలేని తెలుగు ఉపాధ్యాయుడిని వెంటనే మార్చాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.