ఏవోబీలో పోలీసులు లక్ష్యంగా మందుపాతర - గుర్తించి నిర్వీర్యం చేసిన గాలింపు బలగాలు - Maoist Landmine found at AOB

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

thumbnail
ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన మందు పాతర స్వాధీనం (ETV Bharat)

Police found the Landmine of the Maoists: ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల కుట్రను పోలీసులు ఛేదించారు. మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలను పోలీసులు కనుగొన్నారు. ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లోని మల్కనగిరి జిల్లా కలిమిలా పోలీస్ స్టేషన్ పరిధిలో గొంప‌కొండ అట‌వీ ప్రాంతంలో పోలీసుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమ‌ర్చిన మందుపాత‌ర‌ల‌ను వారు స్వాధీనం చేసుకున్నారు. క‌లిమెల పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో బొడిగెట్ట‌కు చెందిన బీఎస్ఎఫ్ బ‌ల‌గాలు మావోయిస్టుల కోసం గాలిస్తుండ‌గా గొంప‌కొండ కెనాల్ వంతెన దగ్గర మావోయిస్టులు అమ‌ర్చిన ఆ మందుపాత‌ర‌ను గాలింపు బ‌ల‌గాలు గుర్తించాయి. వీటిని తీసేందుకు ఎంతో శ్రమించారు. మందుపాత‌ర‌, డిటోనేట‌ర్, 30 మీట‌ర్లు ప్లాస్టిక్ వైర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని మందుపాత‌ర‌ను నిర్వీర్యం చేశారు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. అత్యంత ధైర్య సాహసాలతో ఆయుధాలను అధికారులు ఛేదించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక రాజకీయ నేతలు ఈ విషయం తెలుసుకుని పోలీసులను అభినందించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.