నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా : నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి - Lok Sabha Elections 2024
🎬 Watch Now: Feature Video


Published : Mar 20, 2024, 12:59 PM IST
Nalgonda Congress MP Candidate Interview : గత పదేళ్లుగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధి జరిగిందంటే అది జానారెడ్డి హాయంలోనేనని తెలిపారు. తాను ఎంపీగా గెలిస్తే జిల్లాలోని సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానని వెల్లడించారు.
జిల్లాలోని నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. సాగునీరు, మౌలిక సదుపాయాలను అందించేందుకు దృష్టి సారిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పరిపాలను చూసే ప్రజలు తమకు ఓట్లు వేస్తారని కందూరు రఘువీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2004 నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉన్నానని వివరించారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తానన్న ఆయన, ఈ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ తమకు పోటీయే కాదని స్పష్టం చేశారు. ఈ లోక్సభ ఎన్నికల్లో నల్గొండలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడటం గ్యారంటీ అంటున్న ఆ పార్టీ అభ్యర్థి కందూరు రఘువీర్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.