అసెంబ్లీకి హాజరైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ - KCR to Attend Telangana Assembly

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 12:09 PM IST

thumbnail
నందినగర్‌లోని నివాసం నుంచి అసెంబ్లీకి బయల్దేరిన కేసీఆర్ (ETV Bharat)

KCR to Attend Telangana Assembly : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రతిపక్షనేత హోదాలో ఇవాళ మొదటిసారి శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనారోగ్యానికి గురి కావడంతో ఆయన గత రెండు సమావేశాలకు హాజరు కాలేదు. ప్రమాణస్వీకారం కూడా విడిగా చేశారు. కేసీఆర్ శాసనసభ సమావేశాలకు రాకపోవడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు పదేపదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనూ మొదటి రెండు రోజులు కేసీఆర్ సభకు హాజరుకాలేదు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి సభకు రాకపోవడానికి ప్రస్తావించారు. అయితే బడ్జెట్ సమావేశాలకు ఆయన వస్తారని బీఆర్​ఎస్ వర్గాలు మొదటి నుంచి చెప్తూ వస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఇవాళ శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. అసెంబ్లీలో ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.