thumbnail

యాదాద్రి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలార్పిన ఫైర్ సిబ్బంది - Fire Accident In Yadadri

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 10:54 AM IST

Fire Accident In Yadadri Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం శివారు ప్రాంతంలోని ఓజో ఫర్టిలైజర్ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్​ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఆకస్మిక పరిణామం స్థానికంగా కలకలం రేపింది.

స్థానికుల సమాచారం ప్రకారం : ధర్మోజి గూడెం శివారు ప్రాంతంలో ఓజో ఫర్టిలైజర్ పరిశ్రమ ఉంది. ఉదయం ఒక్కసారిగా ఈ పరిశ్రమ నుంచి దట్టమైన పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికుల నుంచి సమాచారమందుకున్న పోలీసులు, ఫైర్​ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆరు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాదానికి కారణం షార్ట్​ సర్క్యూట్​ అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోట్లలో ఆస్తి నష్టం జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.