thumbnail

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 11:41 AM IST

ETV Bharat / Videos

ఎన్నికల డిపాజిట్​ కింద రూ.12,500 చిల్లర- లెక్కించేందుకు తీవ్రంగా శ్రమించిన సిబ్బంది! - Nomination With Coins

Election Nomination With Coins : మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో లోక్​సభ ఎన్నికల బరిలోకి దిగిన ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్​ దాఖలు చేసిన సమయంలో ఏకంగా రూ.12,500 విలువ చేసే చిల్లర నాణేలను ఎన్నికల అధికారికి సమర్పించారు. 

యవత్మాల్-వాషిం లోక్​సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా మనోజ్​ గెడం పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్​ దాఖలు చేసేందుకు మంగళవారం తన మద్దతుదారులతో కలిసి జిల్లా ఎన్నికల కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలో డిపాజిట్​ కింద చెల్లించాల్సిన రూ.12,500 మొత్తాన్ని చెక్​ లేదా కరెన్సీ నోట్ల రూపంలో కాకుండా కాయిన్స్​ రూపంలో చెల్లించారు.

రూ.1, 2, 5, 10 రూపాయల నాణేలను పెద్ద సంచిలో తీసుకొని వచ్చారు మనోజ్. అయితే ఇంత భారీ మొత్తంలో వచ్చిన కాయిన్స్​ను లెక్కించేందుకు కార్యాలయ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. వారికి సాయంగా అభ్యర్థి మనోజ్​ గెడంతో పాటు ఆయన కార్యకర్తలు కూడా నాణేలను లెక్కించారు. అలా లెక్కించిన వాటిని చిన్న ప్లాస్టిక్​ సంచుల్లో నింపి సంబంధిత ఎన్నికల అధికారికి డిపాజిట్​గా​ అందజేశారు.

సామాజిక కార్యకర్తగా ప్రసిద్ధి చెందిన మనోజ్​ గెడంను స్థానికంగా గురుదేవ్​ అని పిలుస్తారు. ఇక కొన్నేళ్లుగా ప్రజలకు సేవచేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఎలాగైనా గెలిపిస్తారని మనోజ్​ విశ్వాసం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.