LIVE : ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కుల పంపిణీ - Praja Bhavan LIVE
Published : 2 hours ago
|Updated : 1 hours ago
Deputy CM Bhatti Distribute checks to Singareni workers : సింగరేణి కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం నాడు ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, 'సింగరేణి రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. 2023-24 ఏడాదిలో సింగరేణి లాభం రూ.4,701 కోట్లు నమోదయ్యింది. సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ప్రకటిస్తున్నాం. సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్గా ప్రకటించాం. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు బోనస్ వస్తుంది. సింగరేణిలో శాశ్వత ఉద్యోగులు 41,837. సింగరేణిలో ఒప్పంద ఉద్యోగులకు కూడా బోనస్ ఇవ్వాలని నిర్ణయించాం. సింగరేణి ఒప్పంద ఉద్యోగులకు ఒకొక్కరికి రూ.5 వేల బోనస్ ఇవ్వనున్నాం. సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకూ బోనస్ ఇస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింగరేణి కార్మికులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటుచేస్తాం" అని భట్టి పేర్కొన్నారు.
Last Updated : 1 hours ago