రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న పన్నులు మొత్తం కేంద్రం ఖజానాకే : బీవీ రాఘవులు

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 3:42 PM IST

thumbnail

CPM BV Raghavulu Fires on BJP : దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కేరళ ప్రభుత్వంపై రాజకీయంగా, ఆర్థికంగా కేంద్రం వివక్షత చూపుతుందని సీపీఎం పొలిట్​ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. కేంద్ర అనుసరించే విధానాలు ఫెడరల్​ వ్యవస్థనే పూర్తిగా దెబ్బ తీస్తుందన్నారు. రాష్ట్రాల మీద జరుగుతున్న వివక్షత దాడిని ఎదురించే దానికే కేరళ, ఎల్డీఎఫ్​ కూటమి దిల్లీలో ధర్నా చేస్తుందని తెలిపారు. కేంద్రం దేశవ్యాప్తంగా వసూలు చేస్తున్న పన్నుల్లో 60శాతం రాష్ట్రాలకు, 40శాతం కేంద్రానికి వాటా ఉండాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న పన్నులు అంతా కేంద్ర ఖజానాకే పోతుందన్నారు. కేరళ ప్రభుత్వానికి మద్దతుగా హైదరాబాద్​లోని ఇందిరా పార్క ధర్నా చౌక్​ వద్ద సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి అసెంబ్లీ సమావేశాల్లో 2014 తెలంగాణ రాష్ట్రం అవిర్భావం తర్వాత కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులు, చేసిన అన్యాయాన్ని లెక్కలతో బయటపెట్టి బీజేపీ సర్కార్​ వివక్షను ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.