LIVE : కామారెడ్డిలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం - Priyanka Gandhi Election Campaign

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 3:43 PM IST

Updated : May 11, 2024, 5:57 PM IST

thumbnail
Priyanka Gandhi, CM Revanth Election Campaign in Telangana : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇవాళ ఆఖరి రోజు. సాయంత్రం 6గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ రాష్ట్రంలోని తాండూరు, కామారెడ్డి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రియాంక వెంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం 10గంటలకు పఠాన్ చెరు కార్నర్ మీటింగ్​లో పాల్గొన్న సీఎం రేవంత్, మధ్యాహ్నం 1గంటకు తాండూర్ జన జాతర సభకు ప్రియాంక గాంధీతో కలిసి హాజరయ్యారు. అదేవిధంగా సాయంత్రం 3.15 గంటలకు ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డిలో రోడ్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కాగా హోరాహోరీగా సాగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరటంతో, ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, వారి తరపున స్టార్‌ క్యాంపెయినర్లు ప్రచారాన్ని హోరెత్తించారు. ఈక్రమంలోనే తాండూరు జనజాతర సభకు హాజరైన ప్రియాంక గాంధీ, రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. దేశంలో ఉన్న ఎన్డీయే సర్కార్​పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.​    
Last Updated : May 11, 2024, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.