LIVE : కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో పోలీసు మీట్​కు హాజరైన సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth visit Command Centre

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 1:29 PM IST

Updated : Jul 2, 2024, 1:58 PM IST

thumbnail

CM Revanth Reddy Visit Command Control Centre : హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో ఉన్న కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ను సీఎం రేవంత్​ రెడ్డి సందర్శించారు. కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో ఏర్పాటు చేసిన పోలీసులు మీట్​కు సీఎం హాజరయ్యారు. అలాగే పోలీసుల ప్రత్యేక వాహనాలను సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభిస్తున్నారు. టీజీ న్యాబ్​, సైబర్​ సెక్యూరిటీ బ్యూరో కోసం ప్రత్యేక వాహనాలు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. యాంటీ నార్కోటిక్​ బ్యూరో కోసం 27 కార్లు, 40 ద్విచక్ర వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరోవైపు సైబర్​ సెక్యూరిటీ బ్యూరో కోసం 14 కార్లు, 30 ద్విచక్ర వాహనాలను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో డ్రగ్స్​, సైబర్​ నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇది రెండోసారి కమాండ్​ కంట్రోల్​ సెంటర్​కు సీఎం రేవంత్​ రెడ్డి వెళ్లడం. ఇప్పటికే హైదరాబాద్​లో డ్రగ్స్​, సైబర్ నేరాల దాడులు అధికంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు విషయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

Last Updated : Jul 2, 2024, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.