LIVE : కాగ్నిజెంట్ నూతన క్యాంపస్​ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్షప్రసారం - cm revanth inagurates cognizent Ofc

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 5:17 PM IST

Updated : Aug 14, 2024, 5:37 PM IST

thumbnail
Cognizant New Campus in Hyderabad : సీఎం రేవంత్​రెడ్డి కాగ్నిజెంట్​ నూతన క్యాంపస్​ను ప్రారంభించారు. ఐటీకార్యకలాపాల విస్తరణలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ మరో కొత్త క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా కొత్త ప్రాంగణానికి బుధవారం సీఎం చేతులమీదుగా ప్రారంభించారు. ఇటీవల సీఎం రేవంత్​ అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవికుమార్​తో, మంత్రి శ్రీధర్‌బాబు చర్చించి నూతన క్యాంపస్‌ను నెలకొల్పాలని కోరారు. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్న కాగ్నిజెంట్ సంస్థ, హైదరాబాద్​లో 10 లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డిజిటల్‌ ఇంజినీరింగ్‌, క్లౌడ్‌ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ పనిచేయనుంది. గడిచిన రెండేళ్లలో ఈ కంపెనీ రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల నుంచి 7వేల 500 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడు అదనంగా ఉద్యోగులను తీసుకుంటామని కాగ్నిజెంట్ ప్రకటించింది.
Last Updated : Aug 14, 2024, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.