LIVE : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రెస్ మీట్ - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video


Published : Apr 24, 2024, 1:35 PM IST
|Updated : Apr 24, 2024, 1:55 PM IST
Central Minister Anurag Thakur Press Meet Live : జాతీయ క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడీయా సమావేశంలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అధిక మెజారిటీతో గెలుస్తోందని తెలియజేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే దేశాన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకువస్తారనే విషయాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందని రెండకెల మెజారిటీతో గెలుస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన చేయనున్నారని తెలియజేస్తున్నారు. పార్టీ నాయకులు ప్రచారంలో ముందుకు వెళ్తున్నారని తమ విధానాల ద్వారా ప్రజల్లో మార్పు వచ్చిందని భావిస్తోన్నారు. అలానే కాంగ్రెస్ ప్రభుత్వంపై, బీఆర్ఎస్పై పలు విమర్శలు చేస్తున్నారు. దేశంలో హస్తం పార్టీ కనుమరగు అవుతుందని ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో అగ్రనాయకుల పర్యటనలు, సమావేశాల ఏర్పాట్లు, కార్యచరణ తదితర అంశాల గురించి తెలుపుతున్నారు. అలానే పార్టీ కార్యకర్తలు ప్రచారంలో ఉత్సాహంగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు.
Last Updated : Apr 24, 2024, 1:55 PM IST