బైక్​పై వెళ్తున్న వ్యక్తిపై ఎద్దు దాడి- ట్రక్కు డ్రైవర్​ అలర్ట్​తో ప్రాణాలు సేఫ్​! - Bull Attack Man - BULL ATTACK MAN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 2:24 PM IST

Bull Attack On Man Viral Video : కర్ణాటకలోని బెంగళూరులో ఓ వ్యక్తికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మహాలక్ష్మీ స్విమ్మింగ్​పూల్​ రోడ్​లో బైక్​పై వెళ్తున్న అతడిపై ఉన్నట్టుండి ఓ ఎద్దు దాడి చేసింది. దీంతో అతడు ఎగిరి ఎదురుగా వస్తున్న ట్రక్కు కింద పడిపోయాడు. ఇది గమనించిన ట్రక్కు డ్రైవర్​ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. డ్రైవర్​ అప్రమత్తతతో పెద్ద ముప్పు తప్పినట్లయింది.

రఘు అనే వ్యక్తి స్కూటీపై రోడ్డుపై వెళ్తున్నాడు. ఇదే సమయంలో గంగిరెద్దును పట్టుకుని ఓ మహిళ అటుగా వస్తుంది. ఈ క్రమంలోనే ఎద్దు ఉన్నట్టుండి రఘును తన కొమ్ములతో గుద్దింది. దీంతో అతడు ఎదురుగా వస్తున్న ఓ ట్రక్కు కింద పడిపోయాడు. రఘు తన వాహనం కింద పడడాన్ని చూసిన డ్రైవర్​ ఒక్కసారిగా ట్రక్కును అదుపులోకి తెచ్చాడు. దీంతో రఘ ప్రాణాలతో సురక్షితంగా ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్​ అయ్యాయి. కాగా, ఈ ఘటన గతవారం జరిగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎద్దు దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.