thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 3:43 PM IST

Updated : Aug 28, 2024, 3:52 PM IST

ETV Bharat / Videos

దిల్లీ నుంచి హైదరాబాద్​ బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత - Kavitha to Reach Hyderabad Today

BRS MLC Kavitha to Reach Hyderabad Today : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ బయలుదేరారు. మంగళవారం రాత్రి బెయిల్​పై తిహాడ్​ జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. రాత్రి దిల్లీలోనే ఉన్న వసంత విహార్​లోని బీఆర్​ఎస్​ కార్యాలయంలో బస చేశారు. అనంతరం బుధవారం ఉదయం రౌస్​ ఎవెన్యూ కోర్టులో జరిగిన విచారణకు వర్చువల్​గా హాజరయ్యారు. సీబీఐ దాఖలు చేసిన చార్జ్​షీట్​పై విచారణ జరగ్గా, కొన్ని పత్రాలు సరిగ్గా లేవని, కోర్టు రికార్డుల నుంచి స్పష్టంగా ఉన్న దస్త్రాలను ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు. 

సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్‌ను అందించాలని జడ్జి కావేరి భవేజా కోర్టు అధికారులకు సూచించారు. సీబీఐ ఛార్జ్‌షీట్​పై విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. విచారణ అనంతరం వసంత్ విహార్‌లోని పార్టీ కార్యాలయం నుంచి దిల్లీ ఎయిర్‌పోర్టుకు ఎమ్మెల్సీ కవిత బయల్దేరారు. అక్కడ హైదరాబాద్​ వెళ్లే విమానం కవిత ఎక్కారు. సాయంత్రానికి భాగ్యనగరానికి రానున్నారు.

Last Updated : Aug 28, 2024, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.