డీజీపీని కలిసిన బీజేపీ నేత రఘునందన్​రావు - వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు - BJP Raghunadan rao Meets DGP

By ETV Bharat Telangana Team

Published : May 18, 2024, 7:33 PM IST

thumbnail
డీజీపీని కలిసిన బీజేపీ నేత రఘునందన్​రావు - వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు (ETV Bharat)

BJP Raghunandan Rao Meets DGP : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్ ​రావు స్టేట్​మెంట్ ఇచ్చారని అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డికి సంబంధించిన రూ.3 కోట్లు తరలించినట్లు రాధాకిషన్ రావు స్టేట్​మెంట్ ఇచ్చారన్నారు. అయినా వెంకట్రామిరెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని డీజీపీ రవిగుప్తాను కలిసి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన రఘనందన్​రావు, ఎందుకు వెంకట్రామిరెడ్డిని కాపాడుతున్నారని ప్రశ్నించారు. పొంగులేటి వియ్యంకుడని అని ఆయనను అరెస్ట్ చెయ్యడం లేదా? అనే విషయంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా కూడా అరెస్ట్ చెయ్యడం లేదని అన్నారు. ఈరోజు ఈ కన్ఫెషన్​ కాపీలన్నింటిని డీజీపీకి సమర్పించానని చెప్పారు. ఆధారాలున్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని అడిగితే ఇప్పుడే ఈ విషయం తన దృష్టికి ఇప్పుడే వచ్చిందని కచ్చితంగా తగు చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పారన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.