Published : Jun 1, 2024, 3:08 PM IST
|Updated : Jun 1, 2024, 3:22 PM IST
LIVE : దిల్లీలో బండి సంజయ్ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Bandi Sanjay Delhi Tour
Bandi Sanjay Delhi Tour : బీజేపీ నేత బండి సంజయ్ దిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కమలం పార్టీ నేతలను కలుసుకున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ఆయన పార్టీ అగ్రనేతలకు వివరించారు. అనంతరం దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో హస్తం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిందని ఆయన విమర్శించారు. తమ మేనిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీత అని కాంగ్రెస్ నేతలు చెప్పారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వం, పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశానన్నారు. కేసీఆర్, కేటీఆర్లు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారని ఆయన విమర్శించారు. ఆయన బీఆర్ఎస్పై కూడా పలు విమర్శలు గుప్పించారు. దిల్లీ పర్యటనకు వెళ్లిన బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు.
Last Updated : Jun 1, 2024, 3:22 PM IST