బ్రిడ్జి రేలింగ్​ను ఢీకొట్టిన బస్సు- జహీరాబాద్​లో పిరామల్​ సంస్థ బస్సుకు తప్పిన పెను ప్రమాదం - Piramal Company bus in Zaheerabad

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 4:35 PM IST

thumbnail
బ్రిడ్జి రేలింగ్​ను ఢీకొట్టిన బస్సు తప్పిన పెను ప్రమాదం (ETV Bharat)

Bus hit the Railway Bridge Railing in Sangareddy: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్​ ప్రాంతంలోని పిరామల్ పరిశ్రమకు చెందిన బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రాంనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్​పై ఉన్న రేలింగ్ గోడను ఢీకొట్టి సగం వరకు బస్సు దూసుకెళ్లింది. వెనక టైర్లను ఫుట్​పాత్​ అడ్డుకోవడంతో బస్సు కింద పడకుండా ఆగిపోయింది. బస్సు ప్రమాదంతో జహీరాబాద్ నుంచి తాండూర్ వెళ్లే ప్రయాణికులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బ్రిడ్జిపై సగం వరకు వేలాడిన బస్సును ప్రయాణికులు చూసి విస్మయానికి గురయ్యారు.

ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రవాణా శాఖ అధికారులు ట్రాఫిక్​ నిబంధనలు పాటించాలని ఎన్ని సార్లు చెబుతున్న వాహనదారులు పెడచెవిన పెడుతుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదం కొద్ది సేపు స్థానికులను భయాందోళనకు గురి చేసింది. బస్సు ఒకవేళా కింద పడిపోయుంటే చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయేవని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.