thumbnail

LIVE : ఎన్టీఆర్ భవన్​లో మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు - AP CM CHANDRABABU AT NTR BHAVAN

By ETV Bharat Telangana Team

Published : Jul 7, 2024, 11:53 AM IST

Updated : Jul 7, 2024, 1:11 PM IST

AP CM Chandrababu To Visit NTR Bhavan in Hyderabad : ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు తొలిసారి హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ భవన్​కు వచ్చారు. అక్కడ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఎన్టీఆర్​ భవన్​లో టీడీపీ అధినేత చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. జూబ్లీహిల్స్​లోని చంద్రబాబు నివాసం నుంచి ఎన్టీఆర్​ భవన్​ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో చంద్రబాబు పాల్గొని శ్రేణులకు అభివాదం చేశారు. అనంతరం ఎన్టీఆర్ భవన్​కు చేరుకుని ఆయన మాట్లాడారు.  తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావడానికి ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడో చెప్పారు. కానీ గత శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఏ పార్టీకి సపోర్టు చేయకుండా ఉన్నారు. శనివారం జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ చాలా ప్రశాంత వాతావరణంలో సాగింది. ఈ సమావేశం తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి, అటు ఏపీ సీఎం చంద్రబాబు కలిసి మీటింగ్​లో పాల్గొనడం ఇరు రాష్ట్రాల్లో హాట్​టాపిక్​గా మారింది.
Last Updated : Jul 7, 2024, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.