ETV Bharat / technology

మార్చి నుంచి దేశంలో వొడాఫోన్-ఐడియా 5G సర్వీసులు!- మొదట ఎక్కడో తెలుసా? - VODAFONE IDEA 5G LAUNCH DATE

వీఐ గేమ్ ఛేంజిగ్ ప్లాన్- జియో, ఎయిర్​టెల్​కు పోటీగా త్వరలోనే 5G సేవలు!

Vodafone Idea 5G Service Launch Timeline Confirmed
Vodafone Idea 5G Service Launch Timeline Confirmed (Photo Credit- VI)
author img

By ETV Bharat Tech Team

Published : Feb 13, 2025, 3:52 PM IST

Vodafone Idea 5G Service Launch Date: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G వినియోగానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఎట్టకేలకూ వొడాఫోన్-ఐడియా అంటే Vi కూడా భారత్​లో తన 5G సర్వీస్​ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థలు అయిన జియో, ఎయిర్​టెల్ తమ 5G సేవలను విస్తరించాయి. 2022లో మొదట ఎయిర్​టెల్ తన 5G సర్వీస్​ను ప్రారంభించగా, ఆ తర్వాత జియో కూడా లాంఛ్ చేసింది. కానీ వీఐ మాత్రం ఇంకా తన 5G సేవను ప్రారంభించలేదు.

ఇక మన దేశంలో జియో, ఎయిర్​టెల్, వొడాఫోన్-ఐడియా మూడూ అతి పెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలు. వీటిలో మొదటి నుంచి నెలకొన్న త్రిముఖ పోరులో వొడాఫోన్‌ ఐడియా అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం దీని యూజర్ బేస్ బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వొడాఫోన్-ఐడియా తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో జియో, ఎయిర్​టెల్ తమ 5G సేవలను విస్తరించాయి.

దీంతో 5G రూపంలో వొడాఫోన్-ఐడియాకు గట్టి సవాలే ఎదురైందని చెప్పొచ్చు. 5G స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్న ఈ సంస్థ నిధుల కొరత కారణంగా 5Gని విస్తరించడంలో ఆలస్యం చేసింది. అదే సమయంలో జియో, ఎయిర్‌టెల్‌ 5G సేవల్ని వేగంగా విస్తరించి మరింతమంది వినియోగదారులను ఆకర్షించాయి. దీంతో వొడాఫోన్-ఐడియా పెద్దసంఖ్యలో యూజర్లను కోల్పోయింది. అయితే ఇప్పుడు కాస్త ఆలస్యంగానైనా వీఐ 5G సేవల్ని తీసుకొచ్చి తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.

దేశంలో వీఐ 5G సర్వీసులు షురూ: వోడాఫోన్-ఐడియా తన లేటెస్ట్ ఫైనాన్షియల్ రిపోర్ట్​లో మార్చి 2025 నుంచి తన 5G సర్వీస్​ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 2025 మార్చిలో ముంబయిలో తొలిసారిగా తన 5G సేవలను ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే వీఐ ఈ సేవలు ప్రారంభించే తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ మొదట ముంబయిలో ఈ సేవలు ప్రారంభించిన తర్వాత ఏప్రిల్ 2025లో దిల్లీ, చండీగఢ్, బెంగళూరు, పాట్నా అనే మరో నాలుగు నగరాల్లో విస్తరించనున్నట్లు తెలిపింది.

2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక నివేదిక (Third Quarter Report)లో వొడాఫోన్ ఐడియా ఈ సమాచారాన్ని అందించింది. దీనిపై కంపెనీ సీఈవో అక్షయ్ ముంద్రా మాట్లాడుతూ "మేము ఇన్వెస్టిమెంట్​ను పెంచుతున్నాము. నెక్స్ట్​ క్వార్టర్​లో పెట్టుబడి ఖర్చుల వేగం పెరుగుతుంది. ఇది కాకుండా కంపెనీ 5G సర్వీస్​ను దశలవారీగా విస్తరిస్తుంది" అని అన్నారు.

4G సేవలపై కూడా నివేదిక: వోడాఫోన్- ఐడియా తన 5G సర్వీస్​ రోల్ అవుట్‌ను ప్రకటించడమే కాకుండా గత తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా 4G సేవల విస్తరణపై నివేదికను కూడా సమర్పించింది. మార్చి 2024 నాటికి 4G సర్వీస్​ను 1.03 బిలియన్ల జనాభాకు విస్తరించామని, డిసెంబర్ 2024 చివరి నాటికి ఈ సర్వీస్ 1.07 బిలియన్ వినియోగదారులకు చేరుకుందని కంపెనీ తెలిపింది.

ఇది కాకుండా ప్రతి యూజర్​ సగటు ఆదాయం (ARPU)లో కూడా 4.7% పెరుగుదలను సాధించినట్లు Vi తన నివేదికలో పేర్కొంది. కంపెనీ ప్రకారం వారి ARPU క్వార్టర్-2లో రూ.166గా ఉంది. ఇది క్వార్టర్-3లో రూ.173కి పెరిగింది.

ఖరీదైన రీఛార్జ్​ ప్లాన్​లతో మీ జేబుకు చిల్లు పడుతోందా?- అయితే ఈ చౌకైన ప్యాక్​​లపై ఓ లుక్కేయండి!

క్రూ-10 మిషన్​లో కీలక మార్పులు!- షెడ్యూల్​ కంటే ముందుగానే భూమికి సునీతా?

హై మైలేజ్ ఎలక్ట్రిక్ స్కూటీ లాంఛ్- ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ!

Vodafone Idea 5G Service Launch Date: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G వినియోగానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఎట్టకేలకూ వొడాఫోన్-ఐడియా అంటే Vi కూడా భారత్​లో తన 5G సర్వీస్​ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థలు అయిన జియో, ఎయిర్​టెల్ తమ 5G సేవలను విస్తరించాయి. 2022లో మొదట ఎయిర్​టెల్ తన 5G సర్వీస్​ను ప్రారంభించగా, ఆ తర్వాత జియో కూడా లాంఛ్ చేసింది. కానీ వీఐ మాత్రం ఇంకా తన 5G సేవను ప్రారంభించలేదు.

ఇక మన దేశంలో జియో, ఎయిర్​టెల్, వొడాఫోన్-ఐడియా మూడూ అతి పెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలు. వీటిలో మొదటి నుంచి నెలకొన్న త్రిముఖ పోరులో వొడాఫోన్‌ ఐడియా అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం దీని యూజర్ బేస్ బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వొడాఫోన్-ఐడియా తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో జియో, ఎయిర్​టెల్ తమ 5G సేవలను విస్తరించాయి.

దీంతో 5G రూపంలో వొడాఫోన్-ఐడియాకు గట్టి సవాలే ఎదురైందని చెప్పొచ్చు. 5G స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్న ఈ సంస్థ నిధుల కొరత కారణంగా 5Gని విస్తరించడంలో ఆలస్యం చేసింది. అదే సమయంలో జియో, ఎయిర్‌టెల్‌ 5G సేవల్ని వేగంగా విస్తరించి మరింతమంది వినియోగదారులను ఆకర్షించాయి. దీంతో వొడాఫోన్-ఐడియా పెద్దసంఖ్యలో యూజర్లను కోల్పోయింది. అయితే ఇప్పుడు కాస్త ఆలస్యంగానైనా వీఐ 5G సేవల్ని తీసుకొచ్చి తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.

దేశంలో వీఐ 5G సర్వీసులు షురూ: వోడాఫోన్-ఐడియా తన లేటెస్ట్ ఫైనాన్షియల్ రిపోర్ట్​లో మార్చి 2025 నుంచి తన 5G సర్వీస్​ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 2025 మార్చిలో ముంబయిలో తొలిసారిగా తన 5G సేవలను ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే వీఐ ఈ సేవలు ప్రారంభించే తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ మొదట ముంబయిలో ఈ సేవలు ప్రారంభించిన తర్వాత ఏప్రిల్ 2025లో దిల్లీ, చండీగఢ్, బెంగళూరు, పాట్నా అనే మరో నాలుగు నగరాల్లో విస్తరించనున్నట్లు తెలిపింది.

2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక నివేదిక (Third Quarter Report)లో వొడాఫోన్ ఐడియా ఈ సమాచారాన్ని అందించింది. దీనిపై కంపెనీ సీఈవో అక్షయ్ ముంద్రా మాట్లాడుతూ "మేము ఇన్వెస్టిమెంట్​ను పెంచుతున్నాము. నెక్స్ట్​ క్వార్టర్​లో పెట్టుబడి ఖర్చుల వేగం పెరుగుతుంది. ఇది కాకుండా కంపెనీ 5G సర్వీస్​ను దశలవారీగా విస్తరిస్తుంది" అని అన్నారు.

4G సేవలపై కూడా నివేదిక: వోడాఫోన్- ఐడియా తన 5G సర్వీస్​ రోల్ అవుట్‌ను ప్రకటించడమే కాకుండా గత తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా 4G సేవల విస్తరణపై నివేదికను కూడా సమర్పించింది. మార్చి 2024 నాటికి 4G సర్వీస్​ను 1.03 బిలియన్ల జనాభాకు విస్తరించామని, డిసెంబర్ 2024 చివరి నాటికి ఈ సర్వీస్ 1.07 బిలియన్ వినియోగదారులకు చేరుకుందని కంపెనీ తెలిపింది.

ఇది కాకుండా ప్రతి యూజర్​ సగటు ఆదాయం (ARPU)లో కూడా 4.7% పెరుగుదలను సాధించినట్లు Vi తన నివేదికలో పేర్కొంది. కంపెనీ ప్రకారం వారి ARPU క్వార్టర్-2లో రూ.166గా ఉంది. ఇది క్వార్టర్-3లో రూ.173కి పెరిగింది.

ఖరీదైన రీఛార్జ్​ ప్లాన్​లతో మీ జేబుకు చిల్లు పడుతోందా?- అయితే ఈ చౌకైన ప్యాక్​​లపై ఓ లుక్కేయండి!

క్రూ-10 మిషన్​లో కీలక మార్పులు!- షెడ్యూల్​ కంటే ముందుగానే భూమికి సునీతా?

హై మైలేజ్ ఎలక్ట్రిక్ స్కూటీ లాంఛ్- ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.