ETV Bharat / state

విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం - ఒకరి మృతి, 11 మందికి గాయాలు

రాజస్థాన్​లో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న న్యాయవాదుల బస్సు - అజ్​మేర్‌ విహార యాత్రకు వెళ్లిన విజయవాడ బార్ అసోసియేషన్‌ న్యాయవాదులు

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Road Accident in Rajasthan
Road Accident in Rajasthan (ETV Bharat)

Road Accident in Rajasthan : రాజస్థాన్‌లోని అజ్​మేర్‌లో విజయవాడ బార్ అసోసియేషన్‌ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు రెండు బస్సుల్లో అజ్‌మేర్‌ విహారయాత్రకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆగి ఉన్న ట్రక్కును న్యాయవాదుల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీనియర్‌ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ సతీమణి జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందారు. రాజేంద్రప్రసాద్‌ సహా 11 మందికి గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Road Accident in Rajasthan : రాజస్థాన్‌లోని అజ్​మేర్‌లో విజయవాడ బార్ అసోసియేషన్‌ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు రెండు బస్సుల్లో అజ్‌మేర్‌ విహారయాత్రకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆగి ఉన్న ట్రక్కును న్యాయవాదుల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీనియర్‌ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ సతీమణి జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందారు. రాజేంద్రప్రసాద్‌ సహా 11 మందికి గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.