ETV Bharat / state

కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూ - బుధవారం నుంచి పీసీ ఘోష్​ కమిషన్ బహిరంగ విచారణ - justice pc ghosh commission

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 19, 2024, 7:36 PM IST

Justice PC Ghosh Commission : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, బుధవారం నుంచి బహిరంగ విచారణ చేపట్టనుంది. ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను విచారించనుంది.

CV Anand Appeared Before PC Ghosh Commission
Justice PC Ghosh Commission (ETV Bharat)

CV Anand Appeared Before PC Ghosh Commission : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, బుధవారం నుంచి బహిరంగ విచారణ చేపట్టనుంది. ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను హైదరాబాద్ బీఆర్కే భవన్​లో విచారణ చేయనున్నారు. అఫిడవిట్లలోని అంశాల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. కమిషన్ తరఫున మొదట న్యాయవాదిని నియమించుకోవాలని అనుకున్నప్పటికీ, వివిధ కారణాలతో సాధ్యం కాకపోవడంతో నేరుగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ విభాగం ఇప్పటికే విచారణ చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.

అదనపు సమాచారంపై ఆరా : మరోవైపు ఇవాళ విజిలెన్స్ డీజీ సీవీ ఆనంద్ జస్టిస్ పీసీ ఘోష్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల అంశాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ గురించి ఆయన వివరించారు. మధ్యంతర నివేదిక సిద్ధంగా ఉందని సీవీ ఆనంద్ కమిషన్​కు తెలిపారు. మరికొన్ని అంశాల గురించి కూడా సీవీ ఆనంద్​ను ఆరా తీసిన జస్టిస్ పీసీ ఘోష్, అదనపు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టు విచారణపై తుది నివేదిక కూడా త్వరగా ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై విచారణ నిమిత్తం నీటి పారుదల శాఖ నుంచి తీసుకున్న దస్త్రాలు, వివరాలు కూడా కమిషన్ అడిగినట్లు తెలిసింది. వాటిని స్వాధీనం చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, నీటి పారుదల శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

త్వరలో సోమేశ్​ కుమార్​కు నోటీసులు : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఇప్పటి వరకు 57 మంది అధికారులు పీసీ ఘోష్ కమిషన్​కు అఫిడవిట్లు దాఖలు చేశారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఇంకా అఫిడవిట్ దాఖలు చేయలేదని సమాచారం. కమిషన్ నుంచి మరోమారు ఆయనకు నోటీసులు పంపనున్నట్లు తెలిసింది. త్వరలోనే గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టు రీ-డిజైనింగ్, నిర్మాణ స్థలం ఎంపిక, విధానపర నిర్ణయాలు, సంబంధిత అంశాలపై గత ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

CV Anand Appeared Before PC Ghosh Commission : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, బుధవారం నుంచి బహిరంగ విచారణ చేపట్టనుంది. ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను హైదరాబాద్ బీఆర్కే భవన్​లో విచారణ చేయనున్నారు. అఫిడవిట్లలోని అంశాల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. కమిషన్ తరఫున మొదట న్యాయవాదిని నియమించుకోవాలని అనుకున్నప్పటికీ, వివిధ కారణాలతో సాధ్యం కాకపోవడంతో నేరుగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ విభాగం ఇప్పటికే విచారణ చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.

అదనపు సమాచారంపై ఆరా : మరోవైపు ఇవాళ విజిలెన్స్ డీజీ సీవీ ఆనంద్ జస్టిస్ పీసీ ఘోష్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల అంశాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ గురించి ఆయన వివరించారు. మధ్యంతర నివేదిక సిద్ధంగా ఉందని సీవీ ఆనంద్ కమిషన్​కు తెలిపారు. మరికొన్ని అంశాల గురించి కూడా సీవీ ఆనంద్​ను ఆరా తీసిన జస్టిస్ పీసీ ఘోష్, అదనపు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టు విచారణపై తుది నివేదిక కూడా త్వరగా ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై విచారణ నిమిత్తం నీటి పారుదల శాఖ నుంచి తీసుకున్న దస్త్రాలు, వివరాలు కూడా కమిషన్ అడిగినట్లు తెలిసింది. వాటిని స్వాధీనం చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, నీటి పారుదల శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

త్వరలో సోమేశ్​ కుమార్​కు నోటీసులు : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఇప్పటి వరకు 57 మంది అధికారులు పీసీ ఘోష్ కమిషన్​కు అఫిడవిట్లు దాఖలు చేశారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఇంకా అఫిడవిట్ దాఖలు చేయలేదని సమాచారం. కమిషన్ నుంచి మరోమారు ఆయనకు నోటీసులు పంపనున్నట్లు తెలిసింది. త్వరలోనే గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టు రీ-డిజైనింగ్, నిర్మాణ స్థలం ఎంపిక, విధానపర నిర్ణయాలు, సంబంధిత అంశాలపై గత ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కీలక దశకు చేరుకున్న కాళేశ్వరంపై విచారణ - గత ప్రభుత్వ పెద్దలపై పీసీ ఘోష్‌ కమిషన్‌ ఫోకస్‌ - PC Ghosh Commission

కాళేశ్వరం ప్రాజెక్టుల క్వాలిటీ కంట్రోల్‌ దారి తప్పింది : వెదిరె శ్రీరాం - Vedire Sriram On Kaleshwaram

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.