ETV Bharat / state

తెలంగాణ విశ్వవిద్యాలయం - సమస్యలకు అతిపెద్ద నిలయం - ప్రభుత్వాలు మారినా పట్టించుకున్న వారేరి? - Telangana University Issues

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 3:23 PM IST

Telangana University Issues : పేరుకే తెలంగాణ విశ్వవిద్యాలయం. కానీ సమస్యలకు మాత్రం అతిపెద్ద నిలయం. వర్సిటీ ఏర్పాటై పదహారేళ్లు గడిచినా, విద్యార్థుల బాధలు మాత్రం తీరడం లేదు. వసతి గృహాల్లో అరకొర సౌకర్యాలు, చాలీచాలని గదులే ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. భోజనంలో బల్లులు, సాంబారులో పురుగులు, మూడేళ్లుగా రాని మెస్ ఛార్జీలు ఇలా ఎన్నో సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే వారు లేరని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telangana University Problems
Telangana University Issues (ETV Bharat)

Telangana University Problems : నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమస్యలు నానాటికీ అధికమవుతున్నాయి. దీంతో వివిధ జిల్లాల నుంచి ఉన్నత విద్య కోసం వస్తున్న విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. సరైన వసతి, సౌకర్యాలు, నాణ్యమైన భోజనం లేక విద్యార్థులు సతమతమవుతున్నారు. వర్షాకాలం కావడంతో పారిశుద్ధ్యం లోపించి దోమలు, పాములతో సహవాసం చేయాల్సిన దుస్థితి యూనివర్సిటీలో నెలకొంది.

వర్షం పడితే గదులన్నీ జలమయం : వసతి గృహాల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. హాస్టల్‌లో మురుగునీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు నిల్వ ఉండి విపరీతమైన దుర్గంధం వస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే గదులన్నీ జలమయం అవుతున్నాయి. దాంతో దోమల సమస్య పెరిగి వ్యాధుల బారిన పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. భవనం సీలింగ్ పెచ్చులు ఊడిపోతున్నాయని, బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తుందని చెబుతున్నారు. సమస్యలపై వర్సిటీ అధికారులకు విన్నవిస్తే రెగ్యులర్‌ వీసీ లేరనే సాకు చెబుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రెగ్యులర్‌ వీసీని నియమించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం సైతం అందక అవస్థలు పడుతున్నారు. నెల క్రితం అల్పాహారంలో బల్లి రాగా, ఇటీవల సాంబార్‌లో పురుగు ప్రత్యక్షమైంది. దాంతో విద్యార్థినులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. దీనిపై స్పందించిన విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. అయినా తీరు మారలేదని, భోజనంలో తరచూ పురుగులు, బల్లులు వస్తున్నాయని, నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థులు గోడు వెల్లబోస్తున్నారు.

ఇవే కాకుండా మూడేళ్లుగా మెస్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వాలు మారినా యూనివర్సీటిలో సమస్యలు మాత్రం మారడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. అరకొర వసతుల గురించి అధికారులకు విన్నవించినా, గోడు పట్టడం లేదని, ఇలానే కొనసాగితే పెద్ద స్థాయిలో ఉద్యమిస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.

"కూరలో కరివేపాకు వచ్చినట్లుగా బల్లులు, పురుగులు వస్తున్నాయి. భవనం సీలింగ్ పెచ్చులు ఊడిపోతున్నాయి. సరైన వసతి, సౌకర్యాలు, నాణ్యమైన భోజనం లేక ఇబ్బందిపడుతున్నాం. ప్రభుత్వాలు మారినా యూనివర్సీటీలో సమస్యలు మాత్రం మారడం లేదు. వసతుల గురించి ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలానే కొనసాగితే పెద్ద స్థాయిలో ఉద్యమం చేస్తాం." -యూనివర్సిటీ విద్యార్థులు

Telangana University : టీయూ పరిస్థితేంటి?.. వీసీ జైలుకెళ్లడంతో అనుమతులకు ఇబ్బందులు

ACB Arrests TU VC Ravinder : అనిశాకు చిక్కిన తొలి వీసీగా రవీందర్​... వెలుగులోకి మరికొన్ని అక్రమాలు..!

Telangana University Problems : నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమస్యలు నానాటికీ అధికమవుతున్నాయి. దీంతో వివిధ జిల్లాల నుంచి ఉన్నత విద్య కోసం వస్తున్న విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. సరైన వసతి, సౌకర్యాలు, నాణ్యమైన భోజనం లేక విద్యార్థులు సతమతమవుతున్నారు. వర్షాకాలం కావడంతో పారిశుద్ధ్యం లోపించి దోమలు, పాములతో సహవాసం చేయాల్సిన దుస్థితి యూనివర్సిటీలో నెలకొంది.

వర్షం పడితే గదులన్నీ జలమయం : వసతి గృహాల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. హాస్టల్‌లో మురుగునీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు నిల్వ ఉండి విపరీతమైన దుర్గంధం వస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే గదులన్నీ జలమయం అవుతున్నాయి. దాంతో దోమల సమస్య పెరిగి వ్యాధుల బారిన పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. భవనం సీలింగ్ పెచ్చులు ఊడిపోతున్నాయని, బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తుందని చెబుతున్నారు. సమస్యలపై వర్సిటీ అధికారులకు విన్నవిస్తే రెగ్యులర్‌ వీసీ లేరనే సాకు చెబుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రెగ్యులర్‌ వీసీని నియమించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం సైతం అందక అవస్థలు పడుతున్నారు. నెల క్రితం అల్పాహారంలో బల్లి రాగా, ఇటీవల సాంబార్‌లో పురుగు ప్రత్యక్షమైంది. దాంతో విద్యార్థినులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. దీనిపై స్పందించిన విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. అయినా తీరు మారలేదని, భోజనంలో తరచూ పురుగులు, బల్లులు వస్తున్నాయని, నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థులు గోడు వెల్లబోస్తున్నారు.

ఇవే కాకుండా మూడేళ్లుగా మెస్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వాలు మారినా యూనివర్సీటిలో సమస్యలు మాత్రం మారడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. అరకొర వసతుల గురించి అధికారులకు విన్నవించినా, గోడు పట్టడం లేదని, ఇలానే కొనసాగితే పెద్ద స్థాయిలో ఉద్యమిస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.

"కూరలో కరివేపాకు వచ్చినట్లుగా బల్లులు, పురుగులు వస్తున్నాయి. భవనం సీలింగ్ పెచ్చులు ఊడిపోతున్నాయి. సరైన వసతి, సౌకర్యాలు, నాణ్యమైన భోజనం లేక ఇబ్బందిపడుతున్నాం. ప్రభుత్వాలు మారినా యూనివర్సీటీలో సమస్యలు మాత్రం మారడం లేదు. వసతుల గురించి ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలానే కొనసాగితే పెద్ద స్థాయిలో ఉద్యమం చేస్తాం." -యూనివర్సిటీ విద్యార్థులు

Telangana University : టీయూ పరిస్థితేంటి?.. వీసీ జైలుకెళ్లడంతో అనుమతులకు ఇబ్బందులు

ACB Arrests TU VC Ravinder : అనిశాకు చిక్కిన తొలి వీసీగా రవీందర్​... వెలుగులోకి మరికొన్ని అక్రమాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.