ETV Bharat / state

జనగామ కలెక్టరేట్‌ను సందర్శించిన గవర్నర్‌ - సంక్షేమం గురించి వివరించిన అధికారులు - Governor visited Jangaon

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 4:49 PM IST

Governor Jishnu Dev Varma Visit To Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్టు దేవ్ వర్మ జనగామ జిల్లాకు చేరుకున్నారు. అక్కడి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ నాయకులు, అధికారులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్య సదుపాయాల గురించి అధికారులు పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్‌కు వివరించారు.

GOVERNOR VISITED JANGAON
Governor Jishnu Dev Varma Visit To Warangal (ETV Bharat)

Telangana Governor visited Jangaon Collectorate : ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జనగామ జిల్లాకు చేరుకున్నారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్​లు శాలువాలు కప్పి, పూల మొక్కలతో సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం రాష్ట్ర గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించి పరిశీలించారు. అనంతరం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నాయకులు, అధికారులతో కలిసి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యసదుపాయాల గురించి అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గవర్నర్‌కు వివరించారు.

అభివృద్ధి గురించి గవర్నర్‌కు వివరించిన అధికారులు : తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2016లో జనగామ జిల్లా ఏర్పడిందని జిల్లా కలెక్టర్ గవర్నర్​కు వివరించారు. జిల్లాలో 12 మండలాలు ఉండగా, 281 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నాని తెలిపారు. 2011 సెన్సస్ ప్రకారం జిల్లాలో మొత్తం 5,34,991 మంది జనాభా కలిగి ఉందన్నారు. పాలకుర్తి సోమలింగేశ్వర స్వామి ఆలయం, చిల్పూర్​లోని బుగులు వేంకటేశ్వర స్వామి దేవాలయం, వల్మిడి రామాలయం, జాఫర్​గఢ్ నరసింహ స్వామి ఆలయం, బమ్మెర పోతన, ఇలా ఎన్నో చారిత్రక కట్టడాలకు జిల్లా నిలయంగా మారిందన్నారు.

మొక్కలు నాటిన గవర్నర్ : అలాగే పెంబర్తి హస్తకళలు జిల్లాకే తలమానికమని, పెంబర్తి గ్రామం 2023లో ఉత్తమ టూరిజం గ్రామంగా యునెస్కో గుర్తింపు పొందిందని తెలిపారు. అదే విధంగా ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని మహిళా శక్తి పథకం, స్వయం సహాయక సంఘాలకు చెందిన పలు అంశాలపై కలెక్టర్ వివరించారు. అనంతరం ఓబుల్ కేశ్వాపురం వెంకటేశ్వరాలయాన్ని సందర్శించిన గవర్నర్‌ స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఘనపూర్ (స్టేషన్) ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జాయింట్ సెక్రటరీ భవాని శంకర్, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, (రెవెన్యూ) రోహిత్ సింగ్ పాల్గొన్నారు.

ఉమ్మడి వరంగల్​లో గవర్నర్ పర్యటన - కాకతీయుల శిల్పకళా అందాలకు ఫిదా - Jishnu Dev Varma visit to Warangal

యాదాద్రి శ్రీలక్షీనరసింహ స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ - Telangana Governor Visited Yadadri

Telangana Governor visited Jangaon Collectorate : ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జనగామ జిల్లాకు చేరుకున్నారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్​లు శాలువాలు కప్పి, పూల మొక్కలతో సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం రాష్ట్ర గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించి పరిశీలించారు. అనంతరం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నాయకులు, అధికారులతో కలిసి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యసదుపాయాల గురించి అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గవర్నర్‌కు వివరించారు.

అభివృద్ధి గురించి గవర్నర్‌కు వివరించిన అధికారులు : తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2016లో జనగామ జిల్లా ఏర్పడిందని జిల్లా కలెక్టర్ గవర్నర్​కు వివరించారు. జిల్లాలో 12 మండలాలు ఉండగా, 281 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నాని తెలిపారు. 2011 సెన్సస్ ప్రకారం జిల్లాలో మొత్తం 5,34,991 మంది జనాభా కలిగి ఉందన్నారు. పాలకుర్తి సోమలింగేశ్వర స్వామి ఆలయం, చిల్పూర్​లోని బుగులు వేంకటేశ్వర స్వామి దేవాలయం, వల్మిడి రామాలయం, జాఫర్​గఢ్ నరసింహ స్వామి ఆలయం, బమ్మెర పోతన, ఇలా ఎన్నో చారిత్రక కట్టడాలకు జిల్లా నిలయంగా మారిందన్నారు.

మొక్కలు నాటిన గవర్నర్ : అలాగే పెంబర్తి హస్తకళలు జిల్లాకే తలమానికమని, పెంబర్తి గ్రామం 2023లో ఉత్తమ టూరిజం గ్రామంగా యునెస్కో గుర్తింపు పొందిందని తెలిపారు. అదే విధంగా ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని మహిళా శక్తి పథకం, స్వయం సహాయక సంఘాలకు చెందిన పలు అంశాలపై కలెక్టర్ వివరించారు. అనంతరం ఓబుల్ కేశ్వాపురం వెంకటేశ్వరాలయాన్ని సందర్శించిన గవర్నర్‌ స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఘనపూర్ (స్టేషన్) ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జాయింట్ సెక్రటరీ భవాని శంకర్, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, (రెవెన్యూ) రోహిత్ సింగ్ పాల్గొన్నారు.

ఉమ్మడి వరంగల్​లో గవర్నర్ పర్యటన - కాకతీయుల శిల్పకళా అందాలకు ఫిదా - Jishnu Dev Varma visit to Warangal

యాదాద్రి శ్రీలక్షీనరసింహ స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ - Telangana Governor Visited Yadadri

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.