మండుతున్న ఎండలు - మరింత పెరిగే అవకాశం - summer heat in andhra pradesh - SUMMER HEAT IN ANDHRA PRADESH
Summer Heat Waves in Andhra pradesh: రాష్ట్రంలో రోజురోజుకు ఎండల తీవ్రత అధికంగా మారుతోంది. అనేక ప్రాంతాలలో వడగాలులు వీస్తున్నాయి. అత్యధికంగా నంద్యాలలో 42.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేడిగాలుల కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 29, 2024, 9:16 AM IST
Summer Heat Waves in Andhra pradesh: రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. వడగాలులతో అధిక వేడి పెరుగుతోంది. గురువారం ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.6 డిగ్రీల నుంచి 2.9 డిగ్రీల వరకు పెరిగాయి. ముఖ్యంగా రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు (Temperatures) 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లోనూ వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
'వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వడగాల్పులు'- ఐఎండీ హెచ్చరిక
High temperature in Some Districts: రాయలసీమ జిల్లాల్లో వేడి, తేమ, అసౌకర్య వాతావరణం ఏర్పడ వచ్చని అమరావతి వాతావరణ కేంద్రం (Amaravati Weather Center) పేర్కొంది. రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాలలో 42.0, కర్నూలు 41.9, కడప 41.2, అనంతపురం 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సాఆర్ జిల్లాలో 13, నంద్యాల జిల్లాలో 9, కర్నూలు 2, పార్వతీపురం మన్యం 2, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం జిల్లాల్లోని ఒక్కో మండలంలో వడగాలులు వీయడంతో ప్రజలు ప్రయాణాలు కొనసాగించలేక ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం వైఎస్సాఆర్ జిల్లాలోని 18 మండలాలతో పాటు నంద్యాల, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు- 40డిగ్రీలు దాటొచ్చని వాతావరణశాఖ అంచనా
రానున్న రెండు నెలల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమవుతాయని అంచనా వేస్తున్నారు. తీవ్రమైన వేడిగాలుల కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఎండలో బయటికి వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడగాడ్పులు తీవ్ర ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సెల్ ఫోన్లకు హెచ్చరికల సందేశాలు పంపాలని నిర్ణయించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ఎప్పటికప్పుడు స్టేట్ ఏమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షణ చేయనున్నట్టు కూర్మనాథ్ తెలిపారు.
కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో తీవ్రంగానూ, అల్లూరి, కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. గత ఏడాదిలోనూ గరిష్ఠంగా 48.6 డిగ్రీల మేర అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన దాఖలాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎండ తీవ్రతను సుదూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
ఎండలు పెరుగుతున్నాయి- ఈ నెలలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు?: వాతవరణ శాఖ