ETV Bharat / state

'మహాలక్ష్మి'కే జై కొట్టిన మహిళామణులు - ఎన్ని అప్లికేషన్లు వచ్చాయో తెలుసా?

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2024, 12:33 PM IST

Praja Palana Applications in Telangana : తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ తుది దశకు చేరుకుంది. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇచ్చే పథకానికి అత్యధికంగా 92.23 లక్షల అర్జీలు వచ్చాయి. రూ.500కే గ్యాస్‌ సిలిండర్ల పథకానికి 91.49 లక్షల దరఖాస్తులు అందాయి.

Praja Palana Program in Telangana
Praja Palana Program in Telangana

Praja Palana Applications in Telangana : రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో అత్యధికంగా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు వచ్చాయి. నెలకు రూ.2,500 ఇచ్చే ఈ పథకానికి ఎక్కువమంది మహిళలకు జైకొట్టారు. ఆ తర్వాత రూ.500కే గ్యాస్‌ సిలిండర్లకు, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ అర్జీలు అందాయి. అభయహస్తం గ్యారెంటీలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలకు అర్జీకి అవకాశం కల్పించగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి.

ఉచిత కరెంట్‌కు బకాయిల షాక్ - ఎరక్కపోయి ప్రజాపాలన దరఖాస్తుతో ఇరుక్కుపోయి!

Praja Palana Program in Telangana : అందిన దరఖాస్తుల్లో 1,09,00,662 అర్జీలను (Praja Palana) ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ దాదాపు తుది దశకు చేరింది. జిల్లాల వారీగా అప్‌లోడ్‌ అయిన దరఖాస్తులన పరిశీలిస్తే, గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి అత్యధికంగా 18.97 లక్షలు ఉన్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నుంచి అత్యల్పంగా 1.37 లక్షలు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తు ఫారంలో తమ అర్హతలను బట్టి పలు పథకాలకు అభ్యర్థన పెట్టుకున్నారు. అలా పథకాలవారీగా విభజించి చూస్తే, అందిన మొత్తం అభ్యర్థనల సంఖ్య 4,56,35,666 అవుతుంది.

క్రమసంఖ్య పథకంఅభ్యర్థనల సంఖ్య
1మహిళలకు రూ,2500 (మహాలక్ష్మి)92,23,195
2రూ.500కే గ్యాస్ సిలిండర్91,49,838
3ఇందిరమ్మ ఇళ్లు82,82,332
4200 యూనిట్ల ఉచిత విద్యుత్ (గృహజ్యోతి)81,54,158
5రైతుభరోసా (భూమి ఉన్న రైతులకు రూ.15,000లు)38,73,956
6రైతుభరోసా (కౌలు రైతులకు రూ.15,000లు)2,63,616
7రైతుకూలీలకు రూ.12,000లు40,95,581
8ఉద్యమ అమరల కుటుంబాలకు 250 గజాల స్థలం23,794
9ఉద్యమకారులకు 250 గజాల స్థలం84,659
10దివ్యాంగుల పింఛన్లు2,77,292
11ఇతర పింఛన్లు22,07,245

జిల్లాల వారీగా దరఖాస్తుల సంఖ్య

క్రమసంఖ్య జిల్లాదరఖాస్తుల సంఖ్య
1ఆదిలాబాద్2,30,711
2భద్రాద్రి కొత్తగూడెం3,34227
3జీహెచ్ఎంసీ18,97,155
4హనుమకొండ2,54,472
5జగిత్యాల3,35,781
6జనగామ1,77,382
7జయశంకర్ భూపాలపల్లి1,37,454
8జోగులాంబ గద్వాల1,72,371
9కామారెడ్డి3,02,451
10కరీంనగర్3,21,654
11ఖమ్మం4,90,902
12ఆసిఫాబాద్1,63,647
13మహబూబాబాద్2,47,213
14మహబూబ్‌నగర్‌2,64,022
15మంచిర్యాల2,54,898
16మెదక్2,25,594
17మేడ్చల్ మల్కాజిగిరి2,27,717
18ములుగు99,364
19నాగర్‌కర్నూల్‌2,76,984
20నల్గొండ5,35,274
21నారాయణపేట1,70,479
22నిర్మల్2,46,366
23నిజామాబాద్‌4,80,294
24పెద్దపల్లి2,40,331
25రాజన్న సిరిసిల్ల1,92,622
26రంగారెడ్డి5,10,709
27సంగారెడ్డి3,91,565
28సిద్దిపేట3,25,214
29సూర్యాపేట3,75,094
30వికారాబాద్2,84,275
31వనపర్తి1,74,794
32వరంగల్2,90,834
33యాదాద్రి భువనగిరి2,68,812

Congress Six Guarantees in Telangana 2024 : మరోవైపు ఐదు గ్యారెంటీలు ఆశిస్తున్నవారు ఎందరున్నారనే అంచనా స్పష్టం కావడంతో, బడ్జెట్​పై సర్కార్ కసరత్తు చేస్తోంది. అర్జీల ప్రకారం ఏయే పథకానికి ఎంత ఖర్చవుతుందనే వివరాలు సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని శాఖలు ప్రాథమిక అంచనాలు సమర్పించినట్లు సమాచారం. మొదట 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను (Gas Cylinder Scheme) వచ్చే నెలలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గ్యారంటీల అమలు జరిగేలా బడ్జెట్ రూపకల్పన కోసమే ప్రజాపాలన దరఖాస్తులు : భట్టి విక్రమార్క

ఈ రెండు పథకాలకు విద్యుత్, గ్యాస్ కంపెనీల వద్ద వివరాలతో లబ్ధిదారులను ఎంపిక చేయడం సులువుగా ఉండడమే కారణమని సమాచారం. దీంతో పాటు మిగతా పథకాలతో పోలిస్తే నిధుల భారం కూడా కొంత తక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. విద్యుత్ సంస్థలు, గ్యాస్ కంపెనీలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా కారణంతో నిధుల చెల్లింపు అప్పుడప్పుడు కొంత ఆలస్యమైనా ఇబ్బంది ఉండదని సూచించినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ఆరు హామీల్లో వీలైనన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన కసరత్తు చేస్తోంది.

కోటి దాటిన ప్రజాపాలన దరఖాస్తులు - మరో మూడు పథకాల అమలుపై సర్కార్ కసరత్తు

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా పాలన : మంత్రి సీతక్క

Praja Palana Applications in Telangana : రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో అత్యధికంగా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు వచ్చాయి. నెలకు రూ.2,500 ఇచ్చే ఈ పథకానికి ఎక్కువమంది మహిళలకు జైకొట్టారు. ఆ తర్వాత రూ.500కే గ్యాస్‌ సిలిండర్లకు, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ అర్జీలు అందాయి. అభయహస్తం గ్యారెంటీలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలకు అర్జీకి అవకాశం కల్పించగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి.

ఉచిత కరెంట్‌కు బకాయిల షాక్ - ఎరక్కపోయి ప్రజాపాలన దరఖాస్తుతో ఇరుక్కుపోయి!

Praja Palana Program in Telangana : అందిన దరఖాస్తుల్లో 1,09,00,662 అర్జీలను (Praja Palana) ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ దాదాపు తుది దశకు చేరింది. జిల్లాల వారీగా అప్‌లోడ్‌ అయిన దరఖాస్తులన పరిశీలిస్తే, గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి అత్యధికంగా 18.97 లక్షలు ఉన్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నుంచి అత్యల్పంగా 1.37 లక్షలు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తు ఫారంలో తమ అర్హతలను బట్టి పలు పథకాలకు అభ్యర్థన పెట్టుకున్నారు. అలా పథకాలవారీగా విభజించి చూస్తే, అందిన మొత్తం అభ్యర్థనల సంఖ్య 4,56,35,666 అవుతుంది.

క్రమసంఖ్య పథకంఅభ్యర్థనల సంఖ్య
1మహిళలకు రూ,2500 (మహాలక్ష్మి)92,23,195
2రూ.500కే గ్యాస్ సిలిండర్91,49,838
3ఇందిరమ్మ ఇళ్లు82,82,332
4200 యూనిట్ల ఉచిత విద్యుత్ (గృహజ్యోతి)81,54,158
5రైతుభరోసా (భూమి ఉన్న రైతులకు రూ.15,000లు)38,73,956
6రైతుభరోసా (కౌలు రైతులకు రూ.15,000లు)2,63,616
7రైతుకూలీలకు రూ.12,000లు40,95,581
8ఉద్యమ అమరల కుటుంబాలకు 250 గజాల స్థలం23,794
9ఉద్యమకారులకు 250 గజాల స్థలం84,659
10దివ్యాంగుల పింఛన్లు2,77,292
11ఇతర పింఛన్లు22,07,245

జిల్లాల వారీగా దరఖాస్తుల సంఖ్య

క్రమసంఖ్య జిల్లాదరఖాస్తుల సంఖ్య
1ఆదిలాబాద్2,30,711
2భద్రాద్రి కొత్తగూడెం3,34227
3జీహెచ్ఎంసీ18,97,155
4హనుమకొండ2,54,472
5జగిత్యాల3,35,781
6జనగామ1,77,382
7జయశంకర్ భూపాలపల్లి1,37,454
8జోగులాంబ గద్వాల1,72,371
9కామారెడ్డి3,02,451
10కరీంనగర్3,21,654
11ఖమ్మం4,90,902
12ఆసిఫాబాద్1,63,647
13మహబూబాబాద్2,47,213
14మహబూబ్‌నగర్‌2,64,022
15మంచిర్యాల2,54,898
16మెదక్2,25,594
17మేడ్చల్ మల్కాజిగిరి2,27,717
18ములుగు99,364
19నాగర్‌కర్నూల్‌2,76,984
20నల్గొండ5,35,274
21నారాయణపేట1,70,479
22నిర్మల్2,46,366
23నిజామాబాద్‌4,80,294
24పెద్దపల్లి2,40,331
25రాజన్న సిరిసిల్ల1,92,622
26రంగారెడ్డి5,10,709
27సంగారెడ్డి3,91,565
28సిద్దిపేట3,25,214
29సూర్యాపేట3,75,094
30వికారాబాద్2,84,275
31వనపర్తి1,74,794
32వరంగల్2,90,834
33యాదాద్రి భువనగిరి2,68,812

Congress Six Guarantees in Telangana 2024 : మరోవైపు ఐదు గ్యారెంటీలు ఆశిస్తున్నవారు ఎందరున్నారనే అంచనా స్పష్టం కావడంతో, బడ్జెట్​పై సర్కార్ కసరత్తు చేస్తోంది. అర్జీల ప్రకారం ఏయే పథకానికి ఎంత ఖర్చవుతుందనే వివరాలు సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని శాఖలు ప్రాథమిక అంచనాలు సమర్పించినట్లు సమాచారం. మొదట 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను (Gas Cylinder Scheme) వచ్చే నెలలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గ్యారంటీల అమలు జరిగేలా బడ్జెట్ రూపకల్పన కోసమే ప్రజాపాలన దరఖాస్తులు : భట్టి విక్రమార్క

ఈ రెండు పథకాలకు విద్యుత్, గ్యాస్ కంపెనీల వద్ద వివరాలతో లబ్ధిదారులను ఎంపిక చేయడం సులువుగా ఉండడమే కారణమని సమాచారం. దీంతో పాటు మిగతా పథకాలతో పోలిస్తే నిధుల భారం కూడా కొంత తక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. విద్యుత్ సంస్థలు, గ్యాస్ కంపెనీలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా కారణంతో నిధుల చెల్లింపు అప్పుడప్పుడు కొంత ఆలస్యమైనా ఇబ్బంది ఉండదని సూచించినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ఆరు హామీల్లో వీలైనన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన కసరత్తు చేస్తోంది.

కోటి దాటిన ప్రజాపాలన దరఖాస్తులు - మరో మూడు పథకాల అమలుపై సర్కార్ కసరత్తు

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా పాలన : మంత్రి సీతక్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.