ETV Bharat / state

ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ తిలోదకాలు - కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి : కిషన్​ రెడ్డి - Kishan Reddy Fires On Congress

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 2:50 PM IST

Minister Kishan Reddy Fires On Congress : రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి విమర్శించారు. గతంలో బీఆర్ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఏవిధంగా మభ్యపెట్టిందో అదే విధానాన్ని సీఎం రేవంత్​ రెడ్డి అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు. బంజారాహిల్స్​లో ఖైరతాబాద్​ అసెంబ్లీ నియోజకవర్గ బూత్​ వర్కర్ల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Minister Kishan Reddy Fires On Congress
Minister Kishan Reddy Fires On Congress
ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ తిలోదకాలు - కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి : కిషన్​ రెడ్డి

Minister Kishan Reddy Fires On Congress : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అందరికీ ఆరోగ్యం, ఇళ్లు, రైతులకు రుణమాఫీ, కళాశాల విద్యార్థులకు స్కూటీ, ఇలా ఆపార్టీ ఇచ్చిన ఏ ఒక్క మాటపై కూడా నిలబడలేదని విమర్శించారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని బంజార గార్డెన్​లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ స్థాయి వర్కర్ల సమావేశం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'మన్​కీబాత్' కార్యక్రమం జరిగింది. ఈ రెండు కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీ

ఆర్​ఎస్​ ఏవిధంగా ప్రజలను మభ్యపెట్టిందో అదే విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ బాటలోనే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పయనిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను అక్రమంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. రెండు పార్టీలు కూడా మోసపూరితమైనవని, అవినీతి మయమైవని ఆరోపించారు.

అమ్మ పేరు మీద ప్రతి ఒక్కరూ ఓ మొక్క నాటాలి : మన్ కీ బాత్​లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అనేక సామాజిక అంశాలపై ప్రస్తావించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జన్మనిచ్చిన అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారని తెలిపారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలంతా తమ తల్లి పేరు మీద ఈ వానాకాలంలో మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా చూసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరు తమ మాతృమూర్తిని ఆ చెట్టులో చూసుకోవాలని పేర్కొన్నారు. దీనివల్ల భూమాతను పర్యావరణ కాలుష్యం నుంచి పరిరక్షించిన వారమవుతామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

"రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. బీఆర్​ఎస్​ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగానైతే కేసీఆర్​ ప్రజలను మభ్యపెట్టారో అదే బాటలో సీఎం రేవంత్​ రెడ్డి పయనిస్తున్నారు. గతంలో ఏ విధంగానైతే బీఆర్ఎస్​ పార్టీ నైతిక విలువలకు తిలోదాలకాలిచ్చి చట్టాలను పాతరవేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందో అదే రీతిలో రేవంత్​ రెడ్డి కూడా చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​లు దొందుదొందే. జాబ్​ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగుల ప్రమోషన్లు, టీచర్స్​ రిక్రూట్​మెంట్ విషయం ఇలా ఏ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటమీద నిలబడే పరిస్థితి లేదు"- కిషన్​ రెడ్డి, కేంద్రమంత్రి

'కాంగ్రెస్‌ పాలన కూడా కేసీఆర్ పాలన మాదిరే ఉంది - సన్న వడ్లకే బోనస్‌ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటో?' - BJP Graduates MLC Election Campaign

కాంగ్రెస్​ పార్టీ 70 ఏళ్లుగా అబద్ధాలతో రాజకీయాలు చేస్తోంది : కిషన్‌ రెడ్డి - TBJP Chief Kishan Reddy Press Meet

ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ తిలోదకాలు - కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి : కిషన్​ రెడ్డి

Minister Kishan Reddy Fires On Congress : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అందరికీ ఆరోగ్యం, ఇళ్లు, రైతులకు రుణమాఫీ, కళాశాల విద్యార్థులకు స్కూటీ, ఇలా ఆపార్టీ ఇచ్చిన ఏ ఒక్క మాటపై కూడా నిలబడలేదని విమర్శించారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని బంజార గార్డెన్​లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ స్థాయి వర్కర్ల సమావేశం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'మన్​కీబాత్' కార్యక్రమం జరిగింది. ఈ రెండు కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీ

ఆర్​ఎస్​ ఏవిధంగా ప్రజలను మభ్యపెట్టిందో అదే విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ బాటలోనే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పయనిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను అక్రమంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. రెండు పార్టీలు కూడా మోసపూరితమైనవని, అవినీతి మయమైవని ఆరోపించారు.

అమ్మ పేరు మీద ప్రతి ఒక్కరూ ఓ మొక్క నాటాలి : మన్ కీ బాత్​లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అనేక సామాజిక అంశాలపై ప్రస్తావించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జన్మనిచ్చిన అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారని తెలిపారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలంతా తమ తల్లి పేరు మీద ఈ వానాకాలంలో మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా చూసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరు తమ మాతృమూర్తిని ఆ చెట్టులో చూసుకోవాలని పేర్కొన్నారు. దీనివల్ల భూమాతను పర్యావరణ కాలుష్యం నుంచి పరిరక్షించిన వారమవుతామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

"రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. బీఆర్​ఎస్​ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగానైతే కేసీఆర్​ ప్రజలను మభ్యపెట్టారో అదే బాటలో సీఎం రేవంత్​ రెడ్డి పయనిస్తున్నారు. గతంలో ఏ విధంగానైతే బీఆర్ఎస్​ పార్టీ నైతిక విలువలకు తిలోదాలకాలిచ్చి చట్టాలను పాతరవేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందో అదే రీతిలో రేవంత్​ రెడ్డి కూడా చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​లు దొందుదొందే. జాబ్​ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగుల ప్రమోషన్లు, టీచర్స్​ రిక్రూట్​మెంట్ విషయం ఇలా ఏ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటమీద నిలబడే పరిస్థితి లేదు"- కిషన్​ రెడ్డి, కేంద్రమంత్రి

'కాంగ్రెస్‌ పాలన కూడా కేసీఆర్ పాలన మాదిరే ఉంది - సన్న వడ్లకే బోనస్‌ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటో?' - BJP Graduates MLC Election Campaign

కాంగ్రెస్​ పార్టీ 70 ఏళ్లుగా అబద్ధాలతో రాజకీయాలు చేస్తోంది : కిషన్‌ రెడ్డి - TBJP Chief Kishan Reddy Press Meet

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.