ETV Bharat / state

రైళ్లలో భారీగా పెరుగుతున్న గంజాయి రవాణా - గుట్టుగా రాష్ట్రాలు దాటిస్తున్న స్మగ్లర్లు - Ganja Smuggling in Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 10:59 AM IST

Illegal Transportation of Ganja in Trains : కోట్లాది మంది ప్రజల్ని గమ్యస్థానాలకు తీసుకెళ్లే రైళ్లలో గంజాయి రవాణా అధికంగా సాగుతోంది. వందల కిలోమీటర్లు ప్రయాణించినా అంతంతమాత్రంగా జరిగే తనిఖీలు ప్రయాణికుల్లా నటిస్తూ అనుమానమొస్తే మధ్యలోనే తప్పించుకునే వెసులుబాటు, వెరసి ఏటా గంజాయి రవాణా భారీగా పెరుగుతోంది. రహదారుల వెంట పోలీసుల తనిఖీలు పెరగడం ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చెయ్యడంతో స్మగ్లర్లు రైలు మార్గాన్ని ఎంచుకుని గుట్టుగా రాష్ట్రాలు దాటించేస్తున్నారు.

Illegal Transportation of Ganja in Trains
Illegal Transportation of Ganja in Trains

రైళ్లలో భారీగా పెరుగుతున్న గంజాయి రవాణా - గుట్టుగా రాష్ట్రాలు దాటిస్తున్న స్మగ్లర్లు

Illegal Transportation of Ganja in Trains : గంజాయి రవాణాపై పోలీసుల తనిఖీలు ఎక్కువవ్వడం రోడ్డు మార్గాల్లో పోలీసులకు తరచూ చిక్కుతుండడంతో నేరగాళ్లు రైలు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ బృందాల తనిఖీల్లో ఎప్పటికప్పుడు సరకు పట్టుబడుతున్నా రవాణా అయ్యే పరిమాణంతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని అధికారులే అంగీకరిస్తున్నారు. చిన్న రైల్వే స్టేషన్లు కేంద్రంగా మత్తు పదార్థాల స్మగ్లింగ్‌(Drug Smuggling in Hyderabad) ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు నిర్దేశిత బస్​ స్టాపులు, పట్టణాల్లోనే ఆగుతాయి. బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వెళ్తే అంతర్రాష్ట్ర సరిహద్దులు, అక్కడక్కడా పోలీసు తనిఖీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణించే రైళ్లు చిన్నపాటి గ్రామాలు నగర శివార్లలో ఉండే స్టేషన్లలో ఆగుతుంటాయి. కొన్నిసార్లు రూట్‌ క్లియరెన్స్‌ కోసం శివార్లలో ఆపాల్సి ఉంటుంది. నేరగాళ్లు దీన్నే అవకాశంగా మార్చుకుంటున్నారు.

Ganja Smuggling in Telangana : ఉదాహరణకు ఏవోబీ సరిహద్దులు, ఒడిశా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చే వారు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వరకూ రాకుండా శివారు ప్రాంతాల్లోని చిన్న స్టేషన్లలో దిగుతారు. ఇక్కడ ఎలాంటి తనిఖీలు ఉండకపోవడం అక్కడి నుంచి వాహనాల్లో నగరానికి చేరుకుని దందా చేస్తున్నారు. భారీ మొత్తంలో కాకుండా ప్రయాణికుల్లా నటిస్తూ కిలోల పరిమాణంలో చిన్న సంచుల్లో గంజాయి(Ganja) తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒకేసారి ఐదారుగురు కలిసి చిన్న మొత్తాల్లో వేర్వేరు బోగీల్లో ఉంటూ తరలిస్తున్నారు. ఒకవేళ పోలీసుల తనిఖీలు జరుగుతున్నట్లు అనుమానమొస్తే సరకు వదిలేసి తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తారు. కొన్నిసార్లు వేర్వేరు బోగీల్లోకి మారుతూ ముప్పుతిప్పలు పెడుతుంటారని పోలీసులు తెలిపారు.

శివార్లలో గుప్పుమంటున్న గంజాయి - పొలంలోనే సాగు - చివరికి పోలీసులకు చిక్కి

ఇప్పటివరకూ స్మగ్లర్లు మధ్యవర్తులు మాత్రమే గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు దొరికేవారు. ఇటీవలికాలంలో ఏవోబీ(AOB), ఒడిశా ప్రాంతాలకు చెందిన స్థానికులు, రైతులు గంజాయి దందా మొదలుపెట్టారు. ఏవోబీ దగ్గర గంజాయి కిలో రూ.3000 ఉంటే నగరంలో రూ.30 వేల నుంచి రూ.50 వేల మధ్య ఉంటుంది. దాన్నే హ్యాష్‌ ఆయిల్‌(Hash Oil)గా మారిస్తే ఇంకా ధర పెరుగుతుంది. దీంతో ఆయా ప్రాంతాల వారే మధ్యవర్తులతో సంబంధం లేకుండా నగరానికి తెచ్చి విక్రయిస్తున్నారు.

ఉపాధి కోసం హైదరాబాద్‌ వచ్చిన వారు తమతోపాటే సరకు తీసుకొస్తున్నారు. ఇటీవల చందానగర్‌లో అబ్కారీ అధికారులు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. ఆరా తీయగా ఏవోబీ ప్రాంతానికి చెందిన రైతుగా గుర్తించారు. డబ్బు కోసం అప్పుడప్పుడూ రైల్లో నగరానికి వచ్చి గంజాయి విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. నగరానికి ఉపాధి కోసం వచ్చిన వారు తమ వెంట గంజాయి తీసుకొస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మహిళలే ఎక్కువగా ఉన్నారు : పోలీసులకు చిక్కకుండా మధ్యవర్తులు, ఏజెంట్లతో గంజాయి రవాణా చేయిస్తున్న స్మగ్లర్లు కొంతకాలంగా మహిళలతో కూడా ఈ మత్తుదందా చేయిస్తున్నారు. మహిళలకు తక్కువ పరిమాణంలో ఇచ్చి హైదరాబాద్‌ చేరుస్తున్నారు. ఉదాహరణకు 2023లో రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్న 47 మందిని అరెస్టు చేయగా వారిలో 12 మంది మహిళలు ఉన్నారు. ఈ ఏడాది తొలి మూడు నెలల వ్యవధిలోనే 10 మందిని అరెస్టు చేయగా వారిలో కూడా ఒక మహిళ ఉన్నారు.

డ్రగ్స్ అమ్మితే అరెస్టే కాదు, ఆస్తులు కూడా సీజ్

ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి సరఫరా - మాటువేసి పట్టుకున్న పోలీసులు

రైళ్లలో భారీగా పెరుగుతున్న గంజాయి రవాణా - గుట్టుగా రాష్ట్రాలు దాటిస్తున్న స్మగ్లర్లు

Illegal Transportation of Ganja in Trains : గంజాయి రవాణాపై పోలీసుల తనిఖీలు ఎక్కువవ్వడం రోడ్డు మార్గాల్లో పోలీసులకు తరచూ చిక్కుతుండడంతో నేరగాళ్లు రైలు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ బృందాల తనిఖీల్లో ఎప్పటికప్పుడు సరకు పట్టుబడుతున్నా రవాణా అయ్యే పరిమాణంతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని అధికారులే అంగీకరిస్తున్నారు. చిన్న రైల్వే స్టేషన్లు కేంద్రంగా మత్తు పదార్థాల స్మగ్లింగ్‌(Drug Smuggling in Hyderabad) ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు నిర్దేశిత బస్​ స్టాపులు, పట్టణాల్లోనే ఆగుతాయి. బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వెళ్తే అంతర్రాష్ట్ర సరిహద్దులు, అక్కడక్కడా పోలీసు తనిఖీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణించే రైళ్లు చిన్నపాటి గ్రామాలు నగర శివార్లలో ఉండే స్టేషన్లలో ఆగుతుంటాయి. కొన్నిసార్లు రూట్‌ క్లియరెన్స్‌ కోసం శివార్లలో ఆపాల్సి ఉంటుంది. నేరగాళ్లు దీన్నే అవకాశంగా మార్చుకుంటున్నారు.

Ganja Smuggling in Telangana : ఉదాహరణకు ఏవోబీ సరిహద్దులు, ఒడిశా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చే వారు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వరకూ రాకుండా శివారు ప్రాంతాల్లోని చిన్న స్టేషన్లలో దిగుతారు. ఇక్కడ ఎలాంటి తనిఖీలు ఉండకపోవడం అక్కడి నుంచి వాహనాల్లో నగరానికి చేరుకుని దందా చేస్తున్నారు. భారీ మొత్తంలో కాకుండా ప్రయాణికుల్లా నటిస్తూ కిలోల పరిమాణంలో చిన్న సంచుల్లో గంజాయి(Ganja) తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒకేసారి ఐదారుగురు కలిసి చిన్న మొత్తాల్లో వేర్వేరు బోగీల్లో ఉంటూ తరలిస్తున్నారు. ఒకవేళ పోలీసుల తనిఖీలు జరుగుతున్నట్లు అనుమానమొస్తే సరకు వదిలేసి తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తారు. కొన్నిసార్లు వేర్వేరు బోగీల్లోకి మారుతూ ముప్పుతిప్పలు పెడుతుంటారని పోలీసులు తెలిపారు.

శివార్లలో గుప్పుమంటున్న గంజాయి - పొలంలోనే సాగు - చివరికి పోలీసులకు చిక్కి

ఇప్పటివరకూ స్మగ్లర్లు మధ్యవర్తులు మాత్రమే గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు దొరికేవారు. ఇటీవలికాలంలో ఏవోబీ(AOB), ఒడిశా ప్రాంతాలకు చెందిన స్థానికులు, రైతులు గంజాయి దందా మొదలుపెట్టారు. ఏవోబీ దగ్గర గంజాయి కిలో రూ.3000 ఉంటే నగరంలో రూ.30 వేల నుంచి రూ.50 వేల మధ్య ఉంటుంది. దాన్నే హ్యాష్‌ ఆయిల్‌(Hash Oil)గా మారిస్తే ఇంకా ధర పెరుగుతుంది. దీంతో ఆయా ప్రాంతాల వారే మధ్యవర్తులతో సంబంధం లేకుండా నగరానికి తెచ్చి విక్రయిస్తున్నారు.

ఉపాధి కోసం హైదరాబాద్‌ వచ్చిన వారు తమతోపాటే సరకు తీసుకొస్తున్నారు. ఇటీవల చందానగర్‌లో అబ్కారీ అధికారులు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. ఆరా తీయగా ఏవోబీ ప్రాంతానికి చెందిన రైతుగా గుర్తించారు. డబ్బు కోసం అప్పుడప్పుడూ రైల్లో నగరానికి వచ్చి గంజాయి విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. నగరానికి ఉపాధి కోసం వచ్చిన వారు తమ వెంట గంజాయి తీసుకొస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మహిళలే ఎక్కువగా ఉన్నారు : పోలీసులకు చిక్కకుండా మధ్యవర్తులు, ఏజెంట్లతో గంజాయి రవాణా చేయిస్తున్న స్మగ్లర్లు కొంతకాలంగా మహిళలతో కూడా ఈ మత్తుదందా చేయిస్తున్నారు. మహిళలకు తక్కువ పరిమాణంలో ఇచ్చి హైదరాబాద్‌ చేరుస్తున్నారు. ఉదాహరణకు 2023లో రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్న 47 మందిని అరెస్టు చేయగా వారిలో 12 మంది మహిళలు ఉన్నారు. ఈ ఏడాది తొలి మూడు నెలల వ్యవధిలోనే 10 మందిని అరెస్టు చేయగా వారిలో కూడా ఒక మహిళ ఉన్నారు.

డ్రగ్స్ అమ్మితే అరెస్టే కాదు, ఆస్తులు కూడా సీజ్

ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి సరఫరా - మాటువేసి పట్టుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.