ETV Bharat / state

శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీగా పెరిగిన రాకపోకలు - 10 నెలల్లో 2 కోట్ల ప్రయాణికులు - శంషాబాద్‌లో పెరిగిన ప్రయాణికులు

Hyderabad Airport records 2 crore passengers Travel : హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇతర ఎయిర్‌పోర్టులతో పోల్చితే హైదరాబాద్‌ విమానాశ్రయం వృద్ధి ఎక్కువగా ఉంది. కొత్త సర్వీసులు, ఇతర సానుకూలతలు ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తుంది.

Shamshabad Airport
Shamshabad Airport
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 10:40 AM IST

Hyderabad Airport records 2 crore passengers Travel : జీఎంఆర్‌ గ్రూప్ నిర్వహణలోని ఎయిర్‌పోర్టుల నుంచి ప్రయాణికుల రాకపోకలు బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) మీదుగా ప్రయాణికుల రాకపోకల్లో వృద్ధి, ఇతర విమానాశ్రయాలతో పోల్చితే అధికంగా ఉంది. ఈ సంవత్సరం జనవరిలో హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి 21.8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2023 ఇదే నెలతో పోల్చితే ప్రయాణికుల సంఖ్యలో 14 శాతం వృద్ధి నమోదైంది.

Shamshabad Airport in Hyderabad : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల్లో ఇప్పటి వరకు (2023 ఏప్రిల్‌ నుంచి 2024 జనవరి నెలాఖరు వరకు) హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించిన ప్రయాణికుల సంఖ్య 2.07 కోట్లకు పైగా ఉంది. ఈ సంఖ్య గత ఆర్థిక ఏడాది ఇదే కాలంతో పోల్చితే 21 శాతం అధికంగా ఉంది.

దిల్లీ విమానాశ్రయం నుంచి గత నెలలో 62.94 లక్షల మంది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 6.07 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు నమోదయ్యాయి. 2023 జనవరితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో ప్రయాణికుల సంఖ్య 8 శాతం అధికం కాగా, ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల రాకపోకలు 14 శాతం పెరిగాయి. అంటే ప్రయాణికుల రాకపోకల్లో వృద్ధి దిల్లీ కంటే, హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఎక్కువగా ఉంది.

విమానాల రాకపోకల్లో 13 శాతం వృద్ధి : జీఎంఆర్‌ గ్రూప్ (GMR Group)సారథ్యంలో హైదరాబాద్‌, దిల్లీ విమానాశ్రయాలతో పోటు మోపా (గోవా), మేడన్‌ (ఇండోనేషియా), సెబు (ఫిలిప్సీన్స్‌) విమానాశ్రయాలున్నాయి. వీటన్నింటిమీద చూసినా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రయాణికుల రాకపోకల్లో వృద్ధి ఉంది. విమానాల రాకపోకల్లోనూ 13 శాతం వృద్ధి నమోదైంది. సంవత్సరం క్రితం ప్రారంభమైన మోపా విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది.

Airlines Passengers Rights : విమానాల్లో ప్రయాణిస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

ఒక్కరోజే 536 విమానాలు : హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి గత నెల 30న అత్యధికంగా 536 విమానాలు వచ్చి వెళ్లినట్లు జీఎంఆర్‌ గ్రూప్ తెలిపింది. ఇక్కడ ఒకేరోజులో ఇంత అధిక సంఖ్యలో విమానాల రాకపోకలు నమోదు కావడం ఇదే మొదటిసారి. హైదరాబాద్‌ నుంచి వివిధ అంతర్జాతీయ, జాతీయ నగరాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో పాటు ఇతర సానుకూలతల వల్ల ఇక్కడి నుంచి విమాన సర్వీసులు (Air services), ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది.

కొత్తగా లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ హైదరాబాద్‌ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు విమాన సర్వీసును ప్రారంభించింది. అలాగే హైదరాబాద్‌ నుంచి ఆస్ట్రేలియా, యూకే, అమెరికా, కెనడా వంటి దేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్యా ఎక్కువగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Millet Restaurant at RGI Airport : మిల్లెట్​ రెస్టారెంట్​ @శంషాబాద్ ఎయిర్​పోర్ట్​.. దేశంలోనే తొలిసారిగా మన హైదరాబాద్​లో

Hyderabad Airport is Most Punctual : సమయపాలనలో నంబర్ వన్ 'శంషాబాద్ ఎయిర్​పోర్టు'

Hyderabad Airport records 2 crore passengers Travel : జీఎంఆర్‌ గ్రూప్ నిర్వహణలోని ఎయిర్‌పోర్టుల నుంచి ప్రయాణికుల రాకపోకలు బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) మీదుగా ప్రయాణికుల రాకపోకల్లో వృద్ధి, ఇతర విమానాశ్రయాలతో పోల్చితే అధికంగా ఉంది. ఈ సంవత్సరం జనవరిలో హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి 21.8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2023 ఇదే నెలతో పోల్చితే ప్రయాణికుల సంఖ్యలో 14 శాతం వృద్ధి నమోదైంది.

Shamshabad Airport in Hyderabad : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల్లో ఇప్పటి వరకు (2023 ఏప్రిల్‌ నుంచి 2024 జనవరి నెలాఖరు వరకు) హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించిన ప్రయాణికుల సంఖ్య 2.07 కోట్లకు పైగా ఉంది. ఈ సంఖ్య గత ఆర్థిక ఏడాది ఇదే కాలంతో పోల్చితే 21 శాతం అధికంగా ఉంది.

దిల్లీ విమానాశ్రయం నుంచి గత నెలలో 62.94 లక్షల మంది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 6.07 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు నమోదయ్యాయి. 2023 జనవరితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో ప్రయాణికుల సంఖ్య 8 శాతం అధికం కాగా, ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల రాకపోకలు 14 శాతం పెరిగాయి. అంటే ప్రయాణికుల రాకపోకల్లో వృద్ధి దిల్లీ కంటే, హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఎక్కువగా ఉంది.

విమానాల రాకపోకల్లో 13 శాతం వృద్ధి : జీఎంఆర్‌ గ్రూప్ (GMR Group)సారథ్యంలో హైదరాబాద్‌, దిల్లీ విమానాశ్రయాలతో పోటు మోపా (గోవా), మేడన్‌ (ఇండోనేషియా), సెబు (ఫిలిప్సీన్స్‌) విమానాశ్రయాలున్నాయి. వీటన్నింటిమీద చూసినా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రయాణికుల రాకపోకల్లో వృద్ధి ఉంది. విమానాల రాకపోకల్లోనూ 13 శాతం వృద్ధి నమోదైంది. సంవత్సరం క్రితం ప్రారంభమైన మోపా విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది.

Airlines Passengers Rights : విమానాల్లో ప్రయాణిస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

ఒక్కరోజే 536 విమానాలు : హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి గత నెల 30న అత్యధికంగా 536 విమానాలు వచ్చి వెళ్లినట్లు జీఎంఆర్‌ గ్రూప్ తెలిపింది. ఇక్కడ ఒకేరోజులో ఇంత అధిక సంఖ్యలో విమానాల రాకపోకలు నమోదు కావడం ఇదే మొదటిసారి. హైదరాబాద్‌ నుంచి వివిధ అంతర్జాతీయ, జాతీయ నగరాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో పాటు ఇతర సానుకూలతల వల్ల ఇక్కడి నుంచి విమాన సర్వీసులు (Air services), ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది.

కొత్తగా లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ హైదరాబాద్‌ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు విమాన సర్వీసును ప్రారంభించింది. అలాగే హైదరాబాద్‌ నుంచి ఆస్ట్రేలియా, యూకే, అమెరికా, కెనడా వంటి దేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్యా ఎక్కువగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Millet Restaurant at RGI Airport : మిల్లెట్​ రెస్టారెంట్​ @శంషాబాద్ ఎయిర్​పోర్ట్​.. దేశంలోనే తొలిసారిగా మన హైదరాబాద్​లో

Hyderabad Airport is Most Punctual : సమయపాలనలో నంబర్ వన్ 'శంషాబాద్ ఎయిర్​పోర్టు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.