ETV Bharat / state

మీర్​పేట​లో దారుణం - భార్యను కుక్కర్​లో ఉడికించి, రోటిలో దంచి హతమార్చిన భర్త - EX SOLDIER KILLS WIFE AT MEERPET

భార్యను చంపి ముక్కలు ముక్కలుగా చేసిన కసాయి భర్త - మృతదేహాన్ని ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించిన వైనం - భార్యతో విభేదాలే కారణం

MURDER IN MEERPET
HUSBAND KILLED THE WIFE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2025, 9:46 PM IST

Updated : Jan 22, 2025, 10:03 PM IST

Hyderabad Man Murdered Wife : క్షణికావేశంలో భార్యతో గొడవపడిన భర్త ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు. హత్యతో సంబంధం లేదని నిరూపించుకునేందుకు అత్యంత దారుణమైన రీతిలో మృతదేహాన్ని మాయం చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించి, దంచి చెరువులో విసిరేశాడు. రంగారెడ్డి జిల్లా మీర్​పేట పరిధిలో ఆ కిరాతకం చోటుచేసుకుంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై మరింత లోతుగా విచారిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దండుపల్లికి చెందిన వెంకటమాధవికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా జేపీచెరువుకు చెందిన గురుమూర్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గురుమూర్తి గతంలో సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం డీఆర్డీవోలో కాంట్రాక్టు విధానంలో భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు భార్యతో చిన్న గొడవలు జరిగినా సర్దుకుపోయి కుటుంబం సాఫీగా సాగుతోంది. ఈనెల 16న ఇంట్లో పిల్లలు లేని సమయంలో భార్యభర్తల మధ్య తగాదా జరిగింది.

మీర్​పేట్​లో దారుణం - భార్యను కుక్కర్​లో ఉడికించి, రోటిలో దంచి హతమార్చిన భర్త (ETV Bharat)

కేసు నుంచి తప్పించుకోవాలని ఘోరమైన పథకం : ఆ గొడవకు కారణాలేంటో తేలియలేదు. సంక్రాంతి సెలవులకు వెళ్లిన చిన్నారులను తీసుకువచ్చే విషయంపై భేదాభిప్రాయాలు వచ్చి గొడవ మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే మాధవి తలపై గురుమూర్తి రెండుసార్లు గట్టిగా కొట్టగా స్పృహతప్పి పడిపోయింది. అకస్మాత్తుగా కిందపడిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నిందితుడు మరణించినట్లు భావించాడు. ఆ విషయం బయటకు వెళ్తే పోలీసులకు చిక్కుతాననే ఉద్దేశంతో మృతదేహాన్ని అదృశ్యం చేయాలని నిర్ణయించాడు. భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయించి తను కేసు నుంచి తప్పించుకోవాలని పథకం వేశాడని తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిలోని కిరాతకుడు బయటకొచ్చాడు.

కుక్కర్లో ఉడికించి, రోటీలో దంచి : నిందితుడు గురుమూర్తి భార్య మృతదేహాన్ని ఇంట్లోని శౌచాలయంలోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కత్తితో శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికాడని తెలుస్తోంది. ఆ ముక్కల్ని వంటగదిలోని కుక్కర్లో వేసి ఉడికించి ఆ తర్వాత వాటిని రోట్లో వేసి దంచాడని సమాచారం. ఆ మొత్తాన్ని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. నిందితుడు పోలీసులు నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ఎత్తులు వేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. భార్యను 16న చంపేసినా ఎవరికీ చెప్పలేదు. 18న భార్య తల్లి సుబ్బమ్మకు ఫోన్‌ చేసి వెంకటమాధవి కనిపించడం లేదని 16వ తేదీ ఉదయం ఇద్దరి మధ్య చిన్నగొడవ జరిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడు.

ఫిర్యాదు చేసేందుకు అత్తతో వెళ్లిన నిందితుడు : పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమెకు చెప్పింది నిందితుడేనని తెలుస్తోంది. హత్య విషయం తెలియని ఆమె 18న మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఫిర్యాదు చేసేందుకు ఆమెతో పాటు నిందితుడు వెళ్లినట్లు తెలుస్తోంది. వెంకటమాధవి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు ఇంటిముందున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ కెమెరాల్లో వెంకట మాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటకెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. గురుమూర్తి రాకపోకలు సాగిస్తున్న దృశ్యాలు రికార్డుకాగా ఇంట్లోనే ఏదో జరిగిందనే కోణంలో పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు.

ఈక్రమంలో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా తొలుత నిందితుడు పొంతనలేని సమాధానాలిచ్చినట్లు సమాచారం. పలుమార్లు ప్రశ్నించాక అసలు విషయం వెల్లడించాడు. మృతదేహం ఆనవాళ్ల కోసం వెతుకున్నారు. కేవలం నిందితుడు చెప్పిన సమాచారంతో మాత్రమే కాకుండా స్వీయ దర్యాప్తులో వెల్లడైన అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. క్లూస్‌టీం, ఇతర ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఆ ఒక్క ఫోన్ కాల్​తోనే జంట హత్యలు! - రోడ్డున పడ్డ ముగ్గురు పిల్లలు

ప్రేమ కోసం దారుణం - నడిరోడ్డుపై ఆటో డ్రైవర్​ను హత్య చేసిన మరో డ్రైవర్

Hyderabad Man Murdered Wife : క్షణికావేశంలో భార్యతో గొడవపడిన భర్త ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు. హత్యతో సంబంధం లేదని నిరూపించుకునేందుకు అత్యంత దారుణమైన రీతిలో మృతదేహాన్ని మాయం చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించి, దంచి చెరువులో విసిరేశాడు. రంగారెడ్డి జిల్లా మీర్​పేట పరిధిలో ఆ కిరాతకం చోటుచేసుకుంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై మరింత లోతుగా విచారిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దండుపల్లికి చెందిన వెంకటమాధవికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా జేపీచెరువుకు చెందిన గురుమూర్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గురుమూర్తి గతంలో సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం డీఆర్డీవోలో కాంట్రాక్టు విధానంలో భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు భార్యతో చిన్న గొడవలు జరిగినా సర్దుకుపోయి కుటుంబం సాఫీగా సాగుతోంది. ఈనెల 16న ఇంట్లో పిల్లలు లేని సమయంలో భార్యభర్తల మధ్య తగాదా జరిగింది.

మీర్​పేట్​లో దారుణం - భార్యను కుక్కర్​లో ఉడికించి, రోటిలో దంచి హతమార్చిన భర్త (ETV Bharat)

కేసు నుంచి తప్పించుకోవాలని ఘోరమైన పథకం : ఆ గొడవకు కారణాలేంటో తేలియలేదు. సంక్రాంతి సెలవులకు వెళ్లిన చిన్నారులను తీసుకువచ్చే విషయంపై భేదాభిప్రాయాలు వచ్చి గొడవ మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే మాధవి తలపై గురుమూర్తి రెండుసార్లు గట్టిగా కొట్టగా స్పృహతప్పి పడిపోయింది. అకస్మాత్తుగా కిందపడిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నిందితుడు మరణించినట్లు భావించాడు. ఆ విషయం బయటకు వెళ్తే పోలీసులకు చిక్కుతాననే ఉద్దేశంతో మృతదేహాన్ని అదృశ్యం చేయాలని నిర్ణయించాడు. భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయించి తను కేసు నుంచి తప్పించుకోవాలని పథకం వేశాడని తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిలోని కిరాతకుడు బయటకొచ్చాడు.

కుక్కర్లో ఉడికించి, రోటీలో దంచి : నిందితుడు గురుమూర్తి భార్య మృతదేహాన్ని ఇంట్లోని శౌచాలయంలోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కత్తితో శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికాడని తెలుస్తోంది. ఆ ముక్కల్ని వంటగదిలోని కుక్కర్లో వేసి ఉడికించి ఆ తర్వాత వాటిని రోట్లో వేసి దంచాడని సమాచారం. ఆ మొత్తాన్ని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. నిందితుడు పోలీసులు నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ఎత్తులు వేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. భార్యను 16న చంపేసినా ఎవరికీ చెప్పలేదు. 18న భార్య తల్లి సుబ్బమ్మకు ఫోన్‌ చేసి వెంకటమాధవి కనిపించడం లేదని 16వ తేదీ ఉదయం ఇద్దరి మధ్య చిన్నగొడవ జరిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడు.

ఫిర్యాదు చేసేందుకు అత్తతో వెళ్లిన నిందితుడు : పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమెకు చెప్పింది నిందితుడేనని తెలుస్తోంది. హత్య విషయం తెలియని ఆమె 18న మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఫిర్యాదు చేసేందుకు ఆమెతో పాటు నిందితుడు వెళ్లినట్లు తెలుస్తోంది. వెంకటమాధవి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు ఇంటిముందున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ కెమెరాల్లో వెంకట మాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటకెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. గురుమూర్తి రాకపోకలు సాగిస్తున్న దృశ్యాలు రికార్డుకాగా ఇంట్లోనే ఏదో జరిగిందనే కోణంలో పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు.

ఈక్రమంలో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా తొలుత నిందితుడు పొంతనలేని సమాధానాలిచ్చినట్లు సమాచారం. పలుమార్లు ప్రశ్నించాక అసలు విషయం వెల్లడించాడు. మృతదేహం ఆనవాళ్ల కోసం వెతుకున్నారు. కేవలం నిందితుడు చెప్పిన సమాచారంతో మాత్రమే కాకుండా స్వీయ దర్యాప్తులో వెల్లడైన అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. క్లూస్‌టీం, ఇతర ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఆ ఒక్క ఫోన్ కాల్​తోనే జంట హత్యలు! - రోడ్డున పడ్డ ముగ్గురు పిల్లలు

ప్రేమ కోసం దారుణం - నడిరోడ్డుపై ఆటో డ్రైవర్​ను హత్య చేసిన మరో డ్రైవర్

Last Updated : Jan 22, 2025, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.