ETV Bharat / state

నిజామాబాద్​లో కామాంధుల అకృత్యం - మహిళపై సామూహిక అత్యాచారం

నిజామాబాద్ బస్టాండ్ వద్ద మహిళను ఆటో ఎక్కించుకున్న దుండగులు - డిచ్​పల్లికి తీసుకెళ్లి అత్యాచారం

author img

By ETV Bharat Telangana Team

Published : 1 hours ago

LATEST NEWS IN NIZAMABAD
GANG RAPED IN NIZAMABAD (ETV Bharat)

Gang Raped in nizamabad : నిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఆటోలో మహిళను ఎక్కించుకుని తీసుకెళ్లి ఈ దుర్ఘటనకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా శనివారం ఉదయం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం(అక్టోబర్ 18)న రాత్రి ఒంటరిగా ఉన్న ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఆటోలో నిజామాబాద్ బస్టాండ్ వద్ద ఎక్కించుకున్నారు.

అక్కడి నుంచి డిచ్‌పల్లి ప్రాంతానికి తీసుకువెళ్లి దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలు నగరానికి చేరుకుని శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని వన్​ టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచారానికి పాల్పడిన వారు డిచ్‌పల్లికి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

బాధిత మహిళను వెంటబెట్టుకుని ఘటనాస్థలికి తీసుకెళ్లి పోలీసులు పరిశీలించారు. బస్టాండ్‌ వద్ద ఆటోకు సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిజామాబాద్​లో ఈ ఘటన సంచలనం రేపింది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రాత్రి వేళ పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని కూడా వారు కోరుతున్నారు.

వరుస ఘటనలతో కలవరం : 20 రోజుల క్రితం వరంగల్‌లో కూడా ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె నమ్మిన స్నేహితుడే బలవంతంగా తీసుకెళ్లి తన మిత్రులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. మాట్లాడే పని ఉంది రావాలంటూ కారులో ఎక్కించుకొని వరంగల్​లోనే ఓ హోటల్​కు తీసుకెళ్లి స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. పోలీసులు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

పొట్టకూటి కోసం వలస వచ్చిన అత్తా కోడలిపై గ్యాంగ్​ రేప్

అర్ధరాత్రి యువతిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం కేసు - నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Gang Raped in nizamabad : నిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఆటోలో మహిళను ఎక్కించుకుని తీసుకెళ్లి ఈ దుర్ఘటనకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా శనివారం ఉదయం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం(అక్టోబర్ 18)న రాత్రి ఒంటరిగా ఉన్న ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఆటోలో నిజామాబాద్ బస్టాండ్ వద్ద ఎక్కించుకున్నారు.

అక్కడి నుంచి డిచ్‌పల్లి ప్రాంతానికి తీసుకువెళ్లి దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలు నగరానికి చేరుకుని శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని వన్​ టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచారానికి పాల్పడిన వారు డిచ్‌పల్లికి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

బాధిత మహిళను వెంటబెట్టుకుని ఘటనాస్థలికి తీసుకెళ్లి పోలీసులు పరిశీలించారు. బస్టాండ్‌ వద్ద ఆటోకు సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిజామాబాద్​లో ఈ ఘటన సంచలనం రేపింది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రాత్రి వేళ పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని కూడా వారు కోరుతున్నారు.

వరుస ఘటనలతో కలవరం : 20 రోజుల క్రితం వరంగల్‌లో కూడా ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె నమ్మిన స్నేహితుడే బలవంతంగా తీసుకెళ్లి తన మిత్రులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. మాట్లాడే పని ఉంది రావాలంటూ కారులో ఎక్కించుకొని వరంగల్​లోనే ఓ హోటల్​కు తీసుకెళ్లి స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. పోలీసులు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

పొట్టకూటి కోసం వలస వచ్చిన అత్తా కోడలిపై గ్యాంగ్​ రేప్

అర్ధరాత్రి యువతిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం కేసు - నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.