ETV Bharat / state

డ్రైవర్‌ పథకం వేస్తే - స్నేహితులు కొట్టేశారు - పోయింది రూ.15 లక్షలు - దొరికింది రూ.2 కోట్లు! - Rs 2crore Theft In Medak - RS 2CRORE THEFT IN MEDAK

Driver Looted Rs.2 Crore in Owner House : యజమాని దగ్గర భారీగా డబ్బుందని తెలుసుకున్న డ్రైవర్, తన స్నేహితులతో కలిసి ప్లాన్‌ వేశాడు. యజమాని ఇంట్లో లేని సమయంలో చోరీకి పాల్పడ్డాడు. యజమాని రూ.15 లక్షలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేస్తే, నిందితుల దగ్గర మాత్రం రూ.2.02 కోట్లు పట్టుబడటం గమనార్హం.

Driver Looted Rs.2crore and 28tola Gold From Owners House in Maktha
Driver Looted Rs.2crore and 28tola Gold From Owners House in Maktha (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2024, 7:32 AM IST

Driver Looted Rs.2crore and 28tola Gold From Owners House in Maktha : తన ఇంట్లో రూ.15 లక్షలు చోరీ అయ్యాయని ఫిర్యాదు చేయగా, చోరీ చేసిన వారు మాత్రం రూ.2.02 కోట్లు ఉన్నాయని చెప్పిన విడ్డూర ఘటన ఘట్​కేసర్​ శివారు మక్త గ్రామంలో చోటుచేసుకుంది. పోచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధి మక్త గ్రామానికి చెందిన పాల వ్యాపారి నాగభూషణం (70) ఈ నెల 22వ తేదీన తన ఇంట్లో భారీ చోరీ జరిగిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొత్తం రూ.2.02 కోట్ల నగదు, 28 తులాల బంగారం అపహరణకు గురైనట్లు చెప్పాడు. అయినా తొలిరోజు ఫిర్యాదు ఇవ్వలేదు. దాంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు.

మరుసటి రోజు వెళ్లి రూ.15 లక్షలు పోయినట్లు పీఎస్​లో ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్పెషల్‌ బృందాలతో సీసీ కెమెరాలను తనిఖీ చేయగా, ఓ ఆటోలో ముగ్గురు రాకపోకలు సాగించినట్లు గుర్తించారు. వాటి ఆధారంగా సుమారు 200పైగా సీసీ కెమెరాలను పరిశీలించి, ఆటో నెంబర్ ద్వారా పవన్‌, మహేశ్‌ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ డ్రైవర్‌ రవి స్నేహితులుగా గుర్తించినట్లు తెలుస్తోంది.

నాగభూషణం వద్ద భారీగా డబ్బు ఉందని, తన సూచన మేరకే చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు సమాచారం. నాగభూషణం ఇంట్లో లేడని డ్రైవర్​ రవి సమాచారం ఇవ్వగా, ఆటో డ్రైవర్​ అయిన మహేశ్​తో కలిసి చోరీ చేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. వీరికి మరో నలుగురు సహకరించినట్లు గుర్తించి, వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాగభూషణం రూ.15 లక్షలు చోరీ అయినట్లు ఫిర్యాదు చేయగా, నిందితుల్లో ఒకరు చేసిన సంచిలో దాదాపు రూ.2 కోట్లు ఉన్నాయని, మరో నిందితుడు రూ.1.7 కోట్లు ఉన్నాయని వెల్లడించారని సమాచారం. కాగా నగదు ఎక్కడ ఉందనే విషయంపై ఆరా తీస్తున్నారు.

Driver Looted Rs.2crore and 28tola Gold From Owners House in Maktha : తన ఇంట్లో రూ.15 లక్షలు చోరీ అయ్యాయని ఫిర్యాదు చేయగా, చోరీ చేసిన వారు మాత్రం రూ.2.02 కోట్లు ఉన్నాయని చెప్పిన విడ్డూర ఘటన ఘట్​కేసర్​ శివారు మక్త గ్రామంలో చోటుచేసుకుంది. పోచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధి మక్త గ్రామానికి చెందిన పాల వ్యాపారి నాగభూషణం (70) ఈ నెల 22వ తేదీన తన ఇంట్లో భారీ చోరీ జరిగిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొత్తం రూ.2.02 కోట్ల నగదు, 28 తులాల బంగారం అపహరణకు గురైనట్లు చెప్పాడు. అయినా తొలిరోజు ఫిర్యాదు ఇవ్వలేదు. దాంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు.

మరుసటి రోజు వెళ్లి రూ.15 లక్షలు పోయినట్లు పీఎస్​లో ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్పెషల్‌ బృందాలతో సీసీ కెమెరాలను తనిఖీ చేయగా, ఓ ఆటోలో ముగ్గురు రాకపోకలు సాగించినట్లు గుర్తించారు. వాటి ఆధారంగా సుమారు 200పైగా సీసీ కెమెరాలను పరిశీలించి, ఆటో నెంబర్ ద్వారా పవన్‌, మహేశ్‌ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ డ్రైవర్‌ రవి స్నేహితులుగా గుర్తించినట్లు తెలుస్తోంది.

నాగభూషణం వద్ద భారీగా డబ్బు ఉందని, తన సూచన మేరకే చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు సమాచారం. నాగభూషణం ఇంట్లో లేడని డ్రైవర్​ రవి సమాచారం ఇవ్వగా, ఆటో డ్రైవర్​ అయిన మహేశ్​తో కలిసి చోరీ చేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. వీరికి మరో నలుగురు సహకరించినట్లు గుర్తించి, వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాగభూషణం రూ.15 లక్షలు చోరీ అయినట్లు ఫిర్యాదు చేయగా, నిందితుల్లో ఒకరు చేసిన సంచిలో దాదాపు రూ.2 కోట్లు ఉన్నాయని, మరో నిందితుడు రూ.1.7 కోట్లు ఉన్నాయని వెల్లడించారని సమాచారం. కాగా నగదు ఎక్కడ ఉందనే విషయంపై ఆరా తీస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.