ETV Bharat / state

'పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు సీట్లు పెరిగాయి?' - ఈ అంశంపైనే కురియన్​ కమిటీ ఫోకస్ - Congress Fact Finding Committee

Congress Fact Finding Committee in Telangana : పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు సీట్లు పెరగడం పట్ల కురియన్​ కమిషన్​ ఫోకస్​ పెట్టింది. ఈ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా కమిటీ సభ్యులు పీజే కురియర్​, రాకిబుల్​ హుస్సేన్​ ఆరా తీశారు. ముందుగా సికింద్రాబాద్​ పార్లమెంటు అభ్యర్థి దానం నాగేందర్​ తన ఓటమిపై వివరణ ఇచ్చారు. ఈ సమావేశం సాయంత్రం 6.30 గంటల వరకు సాగింది. రేపు డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కమిటీ మాట్లాడనుంది.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 3:06 PM IST

Updated : Jul 11, 2024, 7:28 PM IST

Congress Fact Finding Committee in Telangana
Congress Fact Finding Committee in Telangana (ETV Bharat)

Congress Fact Finding Committee Inquiry into Lok Sabha Election Result : రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్​ నిజ నిర్ధారణ కమిటీ(కురియన్​ కమిటీ) మొదటి రోజు సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి పెద్దపల్లి ఎంపీ మినహా అందరూ హాజరయ్యారు. ఎంపీలు, ఓడిపోయిన ఎంపీ అభ్యర్థుల నుంచి వివరాలను కురియన్​ కమిటీ సేకరించింది. వారు చెప్పిన వివరాలను కమిటీ సభ్యులు నోట్​ చేసుకున్నారు.

ఈ లోక్​సభ ఎన్నికలో తెలంగాణలో బీజేపీకి ఎందుకు సీట్లు పెరిగాయనే అంశాలపై కురియన్​ కమిటీ ఫోకస్​ పెట్టింది. 12 సీట్లు గెలవాల్సిన ఉండే ఎనిమిది మాత్రమే ఎందుకు గెలిచినట్లు ప్రశ్నించింది. మహబూబ్​నగర్​, మెదక్​లో ఏం జరిగిందని కురియన్​ కమిటీ ఆరా తీసింది. రేపు జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించనుంది. ఇందులో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో కురియన్​ కమిటీ భేటీ కానుంది. అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఏఐసీసీ నేత కురియన్​ తెలిపారు.

ఉదయం 11 గంటలకే సమావేశం ప్రారంభం : ఉదయం 11 గంటల నుంచి గాంధీభవన్​లో మకాం వేసిన కురియన్​ కమిటీ సభ్యులు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన 17 మంది అభ్యర్థులతో భేటీ అయ్యారు. నేడు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్​ పార్లమెంటు అభ్యర్థి, ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​తో భేటీ మొదలైంది. ఈ భేటీలో పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​ గౌడ్​ పాల్గొన్నారు.

మొదటగా ఓటమిపాలైన పార్లమెంటు నియోజక వర్గాలకు చెందిన అభ్యర్థులతో మొదలైన భేటీలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. పట్నం సునీతా మహేందర్​ రెడ్డి, రంజిత్​ రెడ్డి, వంశీచంద్​ రెడ్డి, నీలం మధు, వి.రాజేందర్​రావు, జీవన్​ రెడ్డి, ఆత్రం సుగుణలు హాజరైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా సాయంత్రం సురేశ్​ షెట్కార్​, మల్లు రవి, చామల కిరణ్​కుమార్​ రెడ్డి, రఘువీర్​ రెడ్డి, బలరాం నాయక్​, కడియం కావ్య తదితరులు హాజరయ్యారు.

పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు : తెలంగాణ పార్లమెంటు ఎన్నికలు 2024లో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. కానీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్​ఎస్​ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశలో పడిన బీఆర్​ఎస్​కు ఈ ఫలితాలు ఇంకా చేదు అనుభవాలను తెచ్చిపెట్టాయి. అయితే లోక్​సభ ఎన్నికలో 12 సీట్లు తగ్గమని చెప్పిన కాంగ్రెస్​ పార్టీ 8 సీట్లు సాధించింది. అలాగే బీజేపీ కూడా తన సంఖ్యను పెంచుకుంటూ అదే స్థాయిలో 8సీట్లను గెలుచుకుంది. ఎంఐఎం పార్టీ తన ఒక్క సీటును పదిలం చేసుకుంది.

ఎంపీ ఎన్నికల్లో ఎందుకు ఓడినట్లు? - నిజనిర్ధారణ కమిటీతో కాంగ్రెస్ మేధోమథనం - Congress Fact Finding Committee

అసెంబ్లీ ఎన్నికల్లో ఓలెక్క లోక్​సభలో మరోలెక్క - కాంగ్రెస్ ఓటు బ్యాంకు తీరు భలే గమ్మత్తు గురూ - TELANGANA CONGRESS VOTE BANK 2024

Congress Fact Finding Committee Inquiry into Lok Sabha Election Result : రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్​ నిజ నిర్ధారణ కమిటీ(కురియన్​ కమిటీ) మొదటి రోజు సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి పెద్దపల్లి ఎంపీ మినహా అందరూ హాజరయ్యారు. ఎంపీలు, ఓడిపోయిన ఎంపీ అభ్యర్థుల నుంచి వివరాలను కురియన్​ కమిటీ సేకరించింది. వారు చెప్పిన వివరాలను కమిటీ సభ్యులు నోట్​ చేసుకున్నారు.

ఈ లోక్​సభ ఎన్నికలో తెలంగాణలో బీజేపీకి ఎందుకు సీట్లు పెరిగాయనే అంశాలపై కురియన్​ కమిటీ ఫోకస్​ పెట్టింది. 12 సీట్లు గెలవాల్సిన ఉండే ఎనిమిది మాత్రమే ఎందుకు గెలిచినట్లు ప్రశ్నించింది. మహబూబ్​నగర్​, మెదక్​లో ఏం జరిగిందని కురియన్​ కమిటీ ఆరా తీసింది. రేపు జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించనుంది. ఇందులో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో కురియన్​ కమిటీ భేటీ కానుంది. అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఏఐసీసీ నేత కురియన్​ తెలిపారు.

ఉదయం 11 గంటలకే సమావేశం ప్రారంభం : ఉదయం 11 గంటల నుంచి గాంధీభవన్​లో మకాం వేసిన కురియన్​ కమిటీ సభ్యులు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన 17 మంది అభ్యర్థులతో భేటీ అయ్యారు. నేడు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్​ పార్లమెంటు అభ్యర్థి, ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​తో భేటీ మొదలైంది. ఈ భేటీలో పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​ గౌడ్​ పాల్గొన్నారు.

మొదటగా ఓటమిపాలైన పార్లమెంటు నియోజక వర్గాలకు చెందిన అభ్యర్థులతో మొదలైన భేటీలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. పట్నం సునీతా మహేందర్​ రెడ్డి, రంజిత్​ రెడ్డి, వంశీచంద్​ రెడ్డి, నీలం మధు, వి.రాజేందర్​రావు, జీవన్​ రెడ్డి, ఆత్రం సుగుణలు హాజరైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా సాయంత్రం సురేశ్​ షెట్కార్​, మల్లు రవి, చామల కిరణ్​కుమార్​ రెడ్డి, రఘువీర్​ రెడ్డి, బలరాం నాయక్​, కడియం కావ్య తదితరులు హాజరయ్యారు.

పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు : తెలంగాణ పార్లమెంటు ఎన్నికలు 2024లో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. కానీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్​ఎస్​ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశలో పడిన బీఆర్​ఎస్​కు ఈ ఫలితాలు ఇంకా చేదు అనుభవాలను తెచ్చిపెట్టాయి. అయితే లోక్​సభ ఎన్నికలో 12 సీట్లు తగ్గమని చెప్పిన కాంగ్రెస్​ పార్టీ 8 సీట్లు సాధించింది. అలాగే బీజేపీ కూడా తన సంఖ్యను పెంచుకుంటూ అదే స్థాయిలో 8సీట్లను గెలుచుకుంది. ఎంఐఎం పార్టీ తన ఒక్క సీటును పదిలం చేసుకుంది.

ఎంపీ ఎన్నికల్లో ఎందుకు ఓడినట్లు? - నిజనిర్ధారణ కమిటీతో కాంగ్రెస్ మేధోమథనం - Congress Fact Finding Committee

అసెంబ్లీ ఎన్నికల్లో ఓలెక్క లోక్​సభలో మరోలెక్క - కాంగ్రెస్ ఓటు బ్యాంకు తీరు భలే గమ్మత్తు గురూ - TELANGANA CONGRESS VOTE BANK 2024

Last Updated : Jul 11, 2024, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.