ETV Bharat / state

సింగరేణిపై ప్రధానితో మాట్లాడతా : కిషన్‌రెడ్డి - Kishan Reddy on Coal Mine Auction

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 3:16 PM IST

Updated : Jun 21, 2024, 5:07 PM IST

Kishan Reddy Talk to PM Modi Over Coal Mines : సింగరేణి బొగ్గు గనుల వేలం విషయంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లేవనెత్తిన అంశాలపై ప్రధానితో మాట్లాడతానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి, ఆదాయం కోసం మాత్రమే బొగ్గు గనులను వేలం వేయడం లేదని అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు దృష్టిలో పెట్టుకునే వేలం చేపట్టినట్లు వివరించారు.

Union Minister Kishan Reddy on Auction of Coal Mine
Kishan Reddy Talk to PM Modi Over Coal Mines (ETV Bharat)

Union Minister Kishan Reddy on Coal Mine Auction : బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కోల్​ మైన్స్​ వేలాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు ఎటువంటి నష్టం కలగకుండా చూస్తామన్నారు. సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని వేలం చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ గనుల వేలంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లేవనెత్తిన అంశాలపై ప్రధానితో మాట్లాడతానని కిషన్​రెడ్డి తెలిపారు. ఆదాయం కోసం మాత్రమే బొగ్గు గనుల వేలం వేయడం కేంద్రమంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా బొగ్గు గనులు కావాలంటే అన్ని సంస్థలకు ఒకే విధానం ఉందన్న కిషన్​రెడ్డి, సింగరేణిని అదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామన్నారు.

"రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పిన అన్ని విషయాలపైనా పరిశీలిస్తాం. ఒక రెండు మైనింగ్​లు మా దృష్టిలో ఉన్నాయి. ఒడిశాలో ఉన్న నైని ప్రాజెక్ట్ అంశం 2015 సంవత్సరం నుంచి పెండింగ్​లో ఉంది. దానిక సంబంధించి ఒక్క అడుగూ ముందుకు కదల్లేదు. ఇకపై ఆ సమస్య ఉండదు. ప్రెజెంట్​ ఆ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంది. దీంతో మరింత నేను చొరవ తీసుకొని ముందుకు సాగుతాం. అలానే మరికొన్ని అంశాలపై ప్రధాని మోదీతో చర్చిస్తాం."- కిషన్​రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి

సింగరేణి విషయంలో రాజకీయాలు చేయడం తగదు : ఆ సంస్థలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు. దిల్లీ వెళ్లాక దీనిపై అధ్యయనం చేస్తామని అన్నారు. సింగరేణి విషయంలో బొగ్గుగనుల శాఖ అధికారులకు పూర్తి అవగాహన ఉందన్న ఆయన, ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయకూడదని కోరారు. కాంగ్రెస్‌, బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్​,. బీఆర్ఎస్​, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేయడం సరికాదని ఆక్షేపించారు. సింగరేణి కార్మికులు ఆందోళన చెందకూడదని కోరారు. వేలంపాట వల్ల రాష్ట్రాలకే ఆదాయం వస్తుంది తప్ప కేంద్రానికి కాదని కిషన్‌రెడ్డి వివరించారు.

బొగ్గు గనుల వేలానికి వేళాయే - 'శ్రావణపల్లి గని'ని సాధించేందుకు పట్టుదలతో సింగరేణి - Singareni attend Coal Mine Auction

గనుల శాఖ మంత్రి మనోడే - అందరం కలిసి సింగరేణిని కాపాడుకుందాం : డిప్యూటీ సీఎం భట్టి - BHATTI ON COAL MINES AUCTION

Union Minister Kishan Reddy on Coal Mine Auction : బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కోల్​ మైన్స్​ వేలాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు ఎటువంటి నష్టం కలగకుండా చూస్తామన్నారు. సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని వేలం చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ గనుల వేలంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లేవనెత్తిన అంశాలపై ప్రధానితో మాట్లాడతానని కిషన్​రెడ్డి తెలిపారు. ఆదాయం కోసం మాత్రమే బొగ్గు గనుల వేలం వేయడం కేంద్రమంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా బొగ్గు గనులు కావాలంటే అన్ని సంస్థలకు ఒకే విధానం ఉందన్న కిషన్​రెడ్డి, సింగరేణిని అదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామన్నారు.

"రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పిన అన్ని విషయాలపైనా పరిశీలిస్తాం. ఒక రెండు మైనింగ్​లు మా దృష్టిలో ఉన్నాయి. ఒడిశాలో ఉన్న నైని ప్రాజెక్ట్ అంశం 2015 సంవత్సరం నుంచి పెండింగ్​లో ఉంది. దానిక సంబంధించి ఒక్క అడుగూ ముందుకు కదల్లేదు. ఇకపై ఆ సమస్య ఉండదు. ప్రెజెంట్​ ఆ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంది. దీంతో మరింత నేను చొరవ తీసుకొని ముందుకు సాగుతాం. అలానే మరికొన్ని అంశాలపై ప్రధాని మోదీతో చర్చిస్తాం."- కిషన్​రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి

సింగరేణి విషయంలో రాజకీయాలు చేయడం తగదు : ఆ సంస్థలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు. దిల్లీ వెళ్లాక దీనిపై అధ్యయనం చేస్తామని అన్నారు. సింగరేణి విషయంలో బొగ్గుగనుల శాఖ అధికారులకు పూర్తి అవగాహన ఉందన్న ఆయన, ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయకూడదని కోరారు. కాంగ్రెస్‌, బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్​,. బీఆర్ఎస్​, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేయడం సరికాదని ఆక్షేపించారు. సింగరేణి కార్మికులు ఆందోళన చెందకూడదని కోరారు. వేలంపాట వల్ల రాష్ట్రాలకే ఆదాయం వస్తుంది తప్ప కేంద్రానికి కాదని కిషన్‌రెడ్డి వివరించారు.

బొగ్గు గనుల వేలానికి వేళాయే - 'శ్రావణపల్లి గని'ని సాధించేందుకు పట్టుదలతో సింగరేణి - Singareni attend Coal Mine Auction

గనుల శాఖ మంత్రి మనోడే - అందరం కలిసి సింగరేణిని కాపాడుకుందాం : డిప్యూటీ సీఎం భట్టి - BHATTI ON COAL MINES AUCTION

Last Updated : Jun 21, 2024, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.