ETV Bharat / state

ఒకేరోజులో అష్టాదశ శక్తి పీఠాల దర్శనం - ఎలాగంటే - Ashtadasha Shakti Peetha Mancherial

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Ashtadasha Shakti Peethas : నవరాత్రి సమయం. అమ్మవారిని రోజుకో రూపంలో పూజించుకునే రోజులు. ఈ పుణ్యసమయంలో జగన్మాత అష్టాదశ శక్తి పీఠాలను ఒకేసారి దర్శించుకునే అవకాశం లభిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి అవకాశమే కల్పించారు మంచిర్యాలకు చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకులు.

Ashtadasha Shakti Peethas in Mancherial
Ashtadasha Shakti Peethas in Mancherial (ETV Bharat)

Ashtadasha Shakti Peethas in Mancherial : దేశంలోని శక్తి పీఠాలన్నింటిని ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకుంటారు. కొందరు తమకు జాబ్, పెళ్లి ఇలా వారు కోరుకున్నవి అయ్యాక దర్శనానికి వెళ్తే, కొందరు తమ రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ చేస్తుంటారు. అలా వారు దేశంలో ఉన్న 18 శక్తి పీఠాలను దర్శించుకోవాలి అంటే పట్టే సమయం, ఖర్చు అంతా ఇంతా కాదు. దానికి ఓపిక కూడా అంతే కావాలి. దేశం మొత్తం తిరిగి అన్ని గుళ్లను దర్శించుకోవాలి. కానీ అవి చూడటం అందరికీ సాధ్యపడదు. ఆర్థిక సమస్యలు, సమయం ఇలా ఎన్నో కారణాలు. వాటన్నింటిని చూసే అవకాశం వస్తే ఎవరైనా టక్కన తలూపేస్తారు. అలాంటి సువర్ణవకాశం కల్పిస్తున్నారు మంచిర్యాల జిల్లాలోని ఆర్యవైశ్య సంఘం నాయకులు.

అమ్మవార్ల రూపాలను ఒకే దగ్గర ఏర్పాటు చేసి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరాలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్యర్యంలో దేవీ నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భారీ సెట్ వేశారు. భక్తులకు కనువిందు కలిగేందుకు మంచి ప్లాన్ వేశారు. దేశంలోని అన్ని శక్తి పీఠాల అమ్మవార్ల రూపాలను ఒకే దగ్గర ఏర్పాటు చేసి భక్తులకు వాటి దర్శనం కల్పిస్తున్నారు.

'దేవీ నవరాత్రుల్లో కుమారి పూజ - ఈ ఒక్క పూజ చేస్తే అప్పులు, బాధలన్నీ తొలగిపోతాయి' - Navaratri Kumari Puja

భారీగా వస్తున్న భక్తులు : ఇలా దేవలందరూ ఒకే చోట దర్శనం ఇవ్వడంతో భక్తులు సంతోశం వ్యక్తం చేస్తున్నారు. భక్తిశ్రద్ధలతో శక్తి పీఠాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకున్నారు. నవరాత్రుల పూజలు పూర్తయ్యే వరకు శక్తి పీఠాల దర్శనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

"బెల్లంపల్లి వాసవి పరమేశ్వర ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవంలో భాగంగా అష్టాదశ శక్తి పీఠాలను ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారు దక్షయజ్ఞంలో అగ్నికి ఆహుతి అయిన సమయంలో అమ్మవారి 18 శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి. అలాంటి అష్టాదశ శక్తి పీఠాలను దుర్గా నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది." - రేణికుంట్ల శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు

వరంగల్​లోని భద్రకాళి ఆలయంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు - SHARANNAVARATRI AT BHADRAKALI

నవరాత్రి స్పెషల్ : అమ్మవారు మెచ్చే "నువ్వులన్నం" - ఇలా ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టండి! - Navratri Special Recipe

Ashtadasha Shakti Peethas in Mancherial : దేశంలోని శక్తి పీఠాలన్నింటిని ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకుంటారు. కొందరు తమకు జాబ్, పెళ్లి ఇలా వారు కోరుకున్నవి అయ్యాక దర్శనానికి వెళ్తే, కొందరు తమ రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ చేస్తుంటారు. అలా వారు దేశంలో ఉన్న 18 శక్తి పీఠాలను దర్శించుకోవాలి అంటే పట్టే సమయం, ఖర్చు అంతా ఇంతా కాదు. దానికి ఓపిక కూడా అంతే కావాలి. దేశం మొత్తం తిరిగి అన్ని గుళ్లను దర్శించుకోవాలి. కానీ అవి చూడటం అందరికీ సాధ్యపడదు. ఆర్థిక సమస్యలు, సమయం ఇలా ఎన్నో కారణాలు. వాటన్నింటిని చూసే అవకాశం వస్తే ఎవరైనా టక్కన తలూపేస్తారు. అలాంటి సువర్ణవకాశం కల్పిస్తున్నారు మంచిర్యాల జిల్లాలోని ఆర్యవైశ్య సంఘం నాయకులు.

అమ్మవార్ల రూపాలను ఒకే దగ్గర ఏర్పాటు చేసి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరాలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్యర్యంలో దేవీ నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భారీ సెట్ వేశారు. భక్తులకు కనువిందు కలిగేందుకు మంచి ప్లాన్ వేశారు. దేశంలోని అన్ని శక్తి పీఠాల అమ్మవార్ల రూపాలను ఒకే దగ్గర ఏర్పాటు చేసి భక్తులకు వాటి దర్శనం కల్పిస్తున్నారు.

'దేవీ నవరాత్రుల్లో కుమారి పూజ - ఈ ఒక్క పూజ చేస్తే అప్పులు, బాధలన్నీ తొలగిపోతాయి' - Navaratri Kumari Puja

భారీగా వస్తున్న భక్తులు : ఇలా దేవలందరూ ఒకే చోట దర్శనం ఇవ్వడంతో భక్తులు సంతోశం వ్యక్తం చేస్తున్నారు. భక్తిశ్రద్ధలతో శక్తి పీఠాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకున్నారు. నవరాత్రుల పూజలు పూర్తయ్యే వరకు శక్తి పీఠాల దర్శనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

"బెల్లంపల్లి వాసవి పరమేశ్వర ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవంలో భాగంగా అష్టాదశ శక్తి పీఠాలను ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారు దక్షయజ్ఞంలో అగ్నికి ఆహుతి అయిన సమయంలో అమ్మవారి 18 శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి. అలాంటి అష్టాదశ శక్తి పీఠాలను దుర్గా నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది." - రేణికుంట్ల శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు

వరంగల్​లోని భద్రకాళి ఆలయంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు - SHARANNAVARATRI AT BHADRAKALI

నవరాత్రి స్పెషల్ : అమ్మవారు మెచ్చే "నువ్వులన్నం" - ఇలా ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టండి! - Navratri Special Recipe

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.