ETV Bharat / sports

'కోహ్లీ బ్యాట్​ వల్ల నా ఇమేజ్ దెబ్బతింది - ఇకపై ఎవర్నీ బ్యాట్ ఆడగను'

విరాట్ కోహ్లీని బ్యాట్ అడగడం వల్ల తన ఇమేజ్ దెబ్బతిందని చెప్పిన యంగ్ బ్యాటర్ రింకూ సింగ్!

author img

By ETV Bharat Sports Team

Published : 3 hours ago

source Associated Press
Rinku Singh Virat Kohli (source Associated Press)

Rinku Singh Virat Kohli Bat Incident : టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ తనదైన హిట్టింగ్​తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. ఇటీవలే బంగ్లాతో జరిగిన రెండో టీ20లోనూ అది నిరూపితమైంది. 29 బంతుల్లోనే రింకూ 53 పరుగులు బాదాడు. అందులో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే మ్యాచ్ అనంతరం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రింకూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

'నా ఇమేజ్ దెబ్బతింది' - మీరు విరాట్ కోహ్లీని కొన్నాళ్ల క్రితం బ్యాట్ అడిగారు కదా? అలానే ఇప్పుడు మీ బ్యాట్​ను ఎవరైనా అడిగారా? అని రింకూను రిపోర్టర్ ప్రశ్నించారు. అందుకు రింకూ ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. "బ్యాట్ కారణంగా నా ఇమేజ్ పాడైపోయింది! అందరూ నన్ను చూసి ఎప్పుడూ బ్యాట్​లు అడుగుతూనే ఉంటాడనుకుంటున్నారు. కానీ నేను ఇప్పుడు ఆ సమస్యను అధిగమించాను. ఇకపై ఎవర్నీ బ్యాట్ ఆడగను. అలా బ్యాట్ అడగడం వల్ల నా ఇమేజ్ దెబ్బతింది. " అని రింకూ వ్యాఖ్యానించాడు. కాగా, గతంలో రింకూ సింగ్ - కోహ్లీ, నితీశ్ రాణా బ్యాట్​లతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

'ఆ విషయం సూర్యకు తెలుసు' - టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్య మిమ్మల్ని బౌలర్ కూడా ఉపయోగించొచ్చు కదా ? అని రింకూని అడగ్గా ఇలా బదులిచ్చాడు. "అవును. నేను ఏడు మ్యాచుల్లో మూడు వికెట్లు తీశానని, శ్రీలంక సిరీస్​లో కూడా బౌలింగ్ చేశానని సూర్యకు గుర్తు చేశాను. ఆయనకు ఆ విషయం తెలుసు. వికెట్ టర్నింగ్ పరిస్థితి వస్తే నాకు అతడు బంతి ఇస్తాడు." అని రింకూ పేర్కొన్నాడు.

"నేనెప్పుడూ 3 లేదా 4వికెట్లు పడిన తర్వాత బ్యాటింగ్​కు వస్తాను. కాబట్టి ఆ సమయంలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అందుకు మ్యాచ్​కు అనుగుణంగా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను. బంగ్లాతో రెండో టీ20లో నేను పెద్ద స్కోర్ చేయడానికి ప్లాన్ చేయలేదు. సింగిల్స్, డబుల్స్ తీసి స్కోరును పెంచాలని భావించాం. ఆ తర్వాత వేగంగా పరుగులు చేశాం. మ్యాచ్​కు ముందు టీమ్ ఇండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్​తో ప్రత్యేకంగా ఏమీ చర్చించలేదు. కేకేఆర్​కు ఆడేటప్పుడు నా శైలిలో ఆడడానికి గంభీర్ స్వేచ్ఛను ఇచ్చాడు. ఇప్పుడే అదే మాట చెప్పాడు."

- రింకూ సింగ్, టీమ్ ఇండియా బ్యాటర్

టీమ్ ఇండియా ఘన విజయం - బంగ్లాదేశ్​తో ఇటీవల జరిగిన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 41పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో బ్యాటింగ్ వచ్చిన రింకూ సింగ్, మరో యంగ్ బ్యాటర్ నితీశ్ తో కలిసి 108 భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు 221 పరుగుల భారీ స్కోరును అందిచాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ ను కూడా 2-0 తేడాతో గెలుచుకుంది. మూడో టీ20 హైదరాబాద్ వేదికగా శనివారం జరగనుంది.

రోహిత్​కు అది దేవుడిచ్చిన ఓ గొప్ప బహుమతి : ధోనీ

WTC టేబుల్​లో కిందకి పడిపోయిన పాక్ - మరి భారత్ స్థానం ఎంతంటే?

Rinku Singh Virat Kohli Bat Incident : టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ తనదైన హిట్టింగ్​తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. ఇటీవలే బంగ్లాతో జరిగిన రెండో టీ20లోనూ అది నిరూపితమైంది. 29 బంతుల్లోనే రింకూ 53 పరుగులు బాదాడు. అందులో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే మ్యాచ్ అనంతరం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రింకూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

'నా ఇమేజ్ దెబ్బతింది' - మీరు విరాట్ కోహ్లీని కొన్నాళ్ల క్రితం బ్యాట్ అడిగారు కదా? అలానే ఇప్పుడు మీ బ్యాట్​ను ఎవరైనా అడిగారా? అని రింకూను రిపోర్టర్ ప్రశ్నించారు. అందుకు రింకూ ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. "బ్యాట్ కారణంగా నా ఇమేజ్ పాడైపోయింది! అందరూ నన్ను చూసి ఎప్పుడూ బ్యాట్​లు అడుగుతూనే ఉంటాడనుకుంటున్నారు. కానీ నేను ఇప్పుడు ఆ సమస్యను అధిగమించాను. ఇకపై ఎవర్నీ బ్యాట్ ఆడగను. అలా బ్యాట్ అడగడం వల్ల నా ఇమేజ్ దెబ్బతింది. " అని రింకూ వ్యాఖ్యానించాడు. కాగా, గతంలో రింకూ సింగ్ - కోహ్లీ, నితీశ్ రాణా బ్యాట్​లతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

'ఆ విషయం సూర్యకు తెలుసు' - టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్య మిమ్మల్ని బౌలర్ కూడా ఉపయోగించొచ్చు కదా ? అని రింకూని అడగ్గా ఇలా బదులిచ్చాడు. "అవును. నేను ఏడు మ్యాచుల్లో మూడు వికెట్లు తీశానని, శ్రీలంక సిరీస్​లో కూడా బౌలింగ్ చేశానని సూర్యకు గుర్తు చేశాను. ఆయనకు ఆ విషయం తెలుసు. వికెట్ టర్నింగ్ పరిస్థితి వస్తే నాకు అతడు బంతి ఇస్తాడు." అని రింకూ పేర్కొన్నాడు.

"నేనెప్పుడూ 3 లేదా 4వికెట్లు పడిన తర్వాత బ్యాటింగ్​కు వస్తాను. కాబట్టి ఆ సమయంలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అందుకు మ్యాచ్​కు అనుగుణంగా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను. బంగ్లాతో రెండో టీ20లో నేను పెద్ద స్కోర్ చేయడానికి ప్లాన్ చేయలేదు. సింగిల్స్, డబుల్స్ తీసి స్కోరును పెంచాలని భావించాం. ఆ తర్వాత వేగంగా పరుగులు చేశాం. మ్యాచ్​కు ముందు టీమ్ ఇండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్​తో ప్రత్యేకంగా ఏమీ చర్చించలేదు. కేకేఆర్​కు ఆడేటప్పుడు నా శైలిలో ఆడడానికి గంభీర్ స్వేచ్ఛను ఇచ్చాడు. ఇప్పుడే అదే మాట చెప్పాడు."

- రింకూ సింగ్, టీమ్ ఇండియా బ్యాటర్

టీమ్ ఇండియా ఘన విజయం - బంగ్లాదేశ్​తో ఇటీవల జరిగిన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 41పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో బ్యాటింగ్ వచ్చిన రింకూ సింగ్, మరో యంగ్ బ్యాటర్ నితీశ్ తో కలిసి 108 భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు 221 పరుగుల భారీ స్కోరును అందిచాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ ను కూడా 2-0 తేడాతో గెలుచుకుంది. మూడో టీ20 హైదరాబాద్ వేదికగా శనివారం జరగనుంది.

రోహిత్​కు అది దేవుడిచ్చిన ఓ గొప్ప బహుమతి : ధోనీ

WTC టేబుల్​లో కిందకి పడిపోయిన పాక్ - మరి భారత్ స్థానం ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.