ETV Bharat / sports

షూటింగ్‌కు మను బాకర్​ విరామం! - నెక్ట్స్​ ఏం చేయబోతుందంటే? - Manu Bhaker Break from Shooting

author img

By ETV Bharat Sports Team

Published : Aug 16, 2024, 9:20 PM IST

Updated : Aug 16, 2024, 9:29 PM IST

Manu Bhaker Take Break From Shooting : ఇంతకాలం పిస్టల్‌ చప్పుళ్లతో గ్యాప్​ లేకుండా గడిపిన భారత స్టార్​ షూటర్‌ మను బాకర్‌ ప్రస్తుతం కొన్ని నెలల పాటు గన్‌ శబ్దాలకు కాస్త దూరంగా ఉండాలని అనుకుంటోందట. పూర్తి వివరాలు స్టోరీలో.

source Associated Press
Manu Bhaker (source Associated Press)

Manu Bhaker Take Break From Shooting : ఇటీవలే ముగిసిన పారిస్​ ఒలింపిక్స్​ 2024లో రెండు కాంస్య పతకాలతో ప్రపంచ క్రీడా వేదికపై మను బాకర్​ సత్తాచాటిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి ఈ ఒలింపిక్స్‌ కోసం ఎన్నో అభిరుచులను పక్కన పెట్టింది మను బాకర్‌. చిన్నతనంలోనే కరాటేలో ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ షూటింగ్‌వైపు మనసు మార్చుకుంది. ఫైనల్​గా అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.

అయితే ఇంత కాలం పిస్టల్‌ చప్పుళ్లతో ఖాళీ లేకుండా గడిపిన మను బాకర్​ కొన్ని నెలల పాటు ఈ గన్​ శబ్దాలకు కాస్త దూరంగా ఉండాలని అనుకుంటోందట. మూడు నెలల పాటు షూటింగ్ నుంచి విరామం తీసుకొని స్కేటింగ్‌, గుర్రపు స్వారీ, భరతనాట్యం వంటి వాటిపై దృష్టి పెట్టబోతున్నట్లు తెలిపింది. కోచ్‌ జస్పాల్‌ రానాతో కలిసి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది. ఇంకా పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.

"ఇప్పుడు నాకు కాస్త సమయం దొరికింది. కరాటే ట్రైనింగ్​ మళ్లీ చేయగలను అని అనుకుంటున్నాను. అంతకుముందు దాని కోసం సమయం కేటాయించలేకపోయాను. ఇప్పుడు నా వ్యక్తిగత ఇష్టాల కోసం కాస్త బ్రేక్​ దొరికింది. స్కేటింగ్‌, గుర్రపు స్వారీ అంటే ఎంతో ఇష్టం. రోడ్లపైనా కూడా చేయగలను. డ్యాన్స్‌ కూడా చాలా ఇష్టం. అందుకే భరత నాట్యం నేర్చుకుంటున్నాను. వయోలిన్‌ కూడా వచ్చు" అని మను బాకర్‌ వెల్లడించింది.

కాగా, పారిస్ ఒలింపిక్స్​లో మను బాకర్‌ 10 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్​లో రెండు బ్రాంజ్​ మెడల్స్​ను సొంతం చేసుకుంది. 124 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో మెడల్స్​ను దక్కించుకుంది. ఈ మెడల్స్ సాధించడంతో మన బాకర్​కు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రూ.30 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఇకపోతే ఆమె సిల్వర్​ మెడల్ విన్నర్​ నీరజ్​ చోప్రాతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగింది. కానీ ఆ వార్తలను ఆమె ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.

గంగ్నమ్ స్టైల్​, భంగమ్‌ స్టైల్​ - ఈ ప్లేయర్లు వికెట్‌ తీస్తే ఇక స్టేప్పులే - Bowler Wicket Celebration Style

పారిస్​ మరోసారి ముస్తాబు - పారాఒలింపిక్స్ పతాకధారులుగా​ భాగ్యశ్రీ జాధవ్, సుమిత్ అంతిల్ - Paralympics 2024

Manu Bhaker Take Break From Shooting : ఇటీవలే ముగిసిన పారిస్​ ఒలింపిక్స్​ 2024లో రెండు కాంస్య పతకాలతో ప్రపంచ క్రీడా వేదికపై మను బాకర్​ సత్తాచాటిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి ఈ ఒలింపిక్స్‌ కోసం ఎన్నో అభిరుచులను పక్కన పెట్టింది మను బాకర్‌. చిన్నతనంలోనే కరాటేలో ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ షూటింగ్‌వైపు మనసు మార్చుకుంది. ఫైనల్​గా అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.

అయితే ఇంత కాలం పిస్టల్‌ చప్పుళ్లతో ఖాళీ లేకుండా గడిపిన మను బాకర్​ కొన్ని నెలల పాటు ఈ గన్​ శబ్దాలకు కాస్త దూరంగా ఉండాలని అనుకుంటోందట. మూడు నెలల పాటు షూటింగ్ నుంచి విరామం తీసుకొని స్కేటింగ్‌, గుర్రపు స్వారీ, భరతనాట్యం వంటి వాటిపై దృష్టి పెట్టబోతున్నట్లు తెలిపింది. కోచ్‌ జస్పాల్‌ రానాతో కలిసి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది. ఇంకా పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.

"ఇప్పుడు నాకు కాస్త సమయం దొరికింది. కరాటే ట్రైనింగ్​ మళ్లీ చేయగలను అని అనుకుంటున్నాను. అంతకుముందు దాని కోసం సమయం కేటాయించలేకపోయాను. ఇప్పుడు నా వ్యక్తిగత ఇష్టాల కోసం కాస్త బ్రేక్​ దొరికింది. స్కేటింగ్‌, గుర్రపు స్వారీ అంటే ఎంతో ఇష్టం. రోడ్లపైనా కూడా చేయగలను. డ్యాన్స్‌ కూడా చాలా ఇష్టం. అందుకే భరత నాట్యం నేర్చుకుంటున్నాను. వయోలిన్‌ కూడా వచ్చు" అని మను బాకర్‌ వెల్లడించింది.

కాగా, పారిస్ ఒలింపిక్స్​లో మను బాకర్‌ 10 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్​లో రెండు బ్రాంజ్​ మెడల్స్​ను సొంతం చేసుకుంది. 124 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో మెడల్స్​ను దక్కించుకుంది. ఈ మెడల్స్ సాధించడంతో మన బాకర్​కు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రూ.30 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఇకపోతే ఆమె సిల్వర్​ మెడల్ విన్నర్​ నీరజ్​ చోప్రాతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగింది. కానీ ఆ వార్తలను ఆమె ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.

గంగ్నమ్ స్టైల్​, భంగమ్‌ స్టైల్​ - ఈ ప్లేయర్లు వికెట్‌ తీస్తే ఇక స్టేప్పులే - Bowler Wicket Celebration Style

పారిస్​ మరోసారి ముస్తాబు - పారాఒలింపిక్స్ పతాకధారులుగా​ భాగ్యశ్రీ జాధవ్, సుమిత్ అంతిల్ - Paralympics 2024

Last Updated : Aug 16, 2024, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.